Andhra Pradesh

News January 7, 2026

కడపలో శ్రీరామ శోభాయాత్ర, కళ్యాణ ఏర్పాట్లపై సమీక్ష

image

ఈనెల 21, 22 తేదీల్లో కడప మున్సిపల్ గ్రౌండ్స్‌లో జరగనున్న శ్రీరామ మహా శోభాయాత్ర, శ్రీ సీతారాముల కళ్యాణం విజయవంతం కావాలని మంగళవారం కలెక్టర్ శ్రీధర్ అధికారులతో సమీక్ష చేశారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, MLA మాధవి కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఏర్పాట్లు సజావుగా, ఘనంగా ఉండేలా చూడాలని ఆదేశించారు.

News January 7, 2026

మెరుగైన వసతుల కల్పనకు కృషి: కలెక్టర్

image

జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వసతుల కల్పనపై దృష్టి సారించడంతోపాటు మున్సిపాలిటీలకు ఆదాయం పెరిగేలా చూడాలని కలెక్టర్ రాజాబాబు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మంగళవారం ఒంగోలు కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణ లోపం రాదని, అధికారులు ఈ విషయం గుర్తుంచుకోవాలన్నారు.

News January 7, 2026

మెరుగైన వసతుల కల్పనకు కృషి: కలెక్టర్

image

జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వసతుల కల్పనపై దృష్టి సారించడంతోపాటు మున్సిపాలిటీలకు ఆదాయం పెరిగేలా చూడాలని కలెక్టర్ రాజాబాబు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మంగళవారం ఒంగోలు కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణ లోపం రాదని, అధికారులు ఈ విషయం గుర్తుంచుకోవాలన్నారు.

News January 7, 2026

రాయలసీమ పారిశ్రామికాభివృద్ధి బ్లూప్రింట్

image

రాయలసీమలోని అన్ని జిల్లాలు సమానంగా వృద్ధి చెందేలా సమగ్ర పారిశ్రామిక ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది. జిల్లాలో ఉన్న వనరులు, అవకాశాలను బట్టి ప్రత్యేక పారిశ్రామిక హబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో స్థానిక యువతకు ఉపాధి పెరగడమే కాకుండా ప్రాంతీయ అసమానతలు తొలగే అవకాశం ఉంది. జిల్లాల వారీగా పారిశ్రామిక ప్రాధాన్యతలు పై ఫొటోలో చూడొచ్చు. ఈ ప్రణాళిక సాకారం అయితే రాయలసీమ రతనాల సీమ కానుంది.

News January 7, 2026

నెల్లూరు: మత్స్యకారులకు నావిగేషన్ పరికరాలు

image

నెల్లూరు జిల్లాలో మత్స్యకారులకు భద్రతతో పాటు చేపలు ఉండే ప్రాంతాన్ని పసిగట్టే నావిగేషన్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. జిల్లాలో 3వేల బోట్లకు వీటిని అమర్చనుంది. నెల్లూరులోని జిల్లా మత్స్య శాఖ ఆఫీసుకు ఈ పరికరాలు వచ్చాయి. వీటిని బోట్లకు అమర్చడంతో మత్స్సకారులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

News January 6, 2026

ANU వ్యాయామ విద్య పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరి 3వ తేదీ నుంచి జరగనున్న బీపీఈడీ, డీపీఈడీ, ఎంపీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫీజు షెడ్యూల్ వర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు విడుదల చేశారు. సంబంధిత పరీక్ష ఫీజు ఈనెల 20 తేదీలోగా, అపరాధ రుసుం రూ.100తో ఈనెల 21వ తేదీన చెల్లించాలన్నారు. పూర్తి వివరాలను వర్సిటీ వెబ్‌సైట్ www.Nagarjuna University.ac.in పొందవచ్చన్నారు.

News January 6, 2026

విశాఖ: గంజాయి రవాణాపై కట్టుదిట్టమైన తనిఖీలు

image

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు విశాఖలో మంగళవారం పలు చోట్ల గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు డాగ్ స్క్వాడ్ సహాయంతో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, కోరియర్ కార్యాలయాలలో అనుమానాస్పద వ్యక్తులు, బ్యాగులు, పార్సిళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. యువత భవిష్యత్తు రక్షణే లక్ష్యంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని వైజాగ్ సిటీ పోలీసులు తెలిపారు.

News January 6, 2026

నెల్లూరు: MSME పార్కుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు

image

వేరుశనగ, నిమ్మ పంటలకు అనుగుణంగా MSME పార్కుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. నెల్లూరు జడ్పీలో మంగళవారం సమావేశం జరిగింది. ఎలాంటి గ్యారంటీలు లేకుండా MSMEలకు రుణాలు ఇవ్వడం లేదని చర్చ జరిగింది. MSME రుణాల మంజూరుకు మార్జిన్ మనీ ఇస్తామని.. రుణాలు త్వరగా ఇవ్వాలని ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావు కోరారు.

News January 6, 2026

ANU బీ ఫార్మసీ పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరి 2వ తేదీ నుంచి జరగనున్న బీ ఫార్మసీ నాలుగో సంవత్సరం 7వ సెమిస్టర్, 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు షెడ్యూల్ వర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి శివ ప్రసాదరావు విడుదల చేశారు. సంబంధిత పరీక్ష ఫీజు ఈనెల 22 తేదీలోగా, అపరాధ రుసుం రూ.100తో ఈనెల 23వ తేదీన చెల్లించాలన్నారు. పూర్తి వివరాలను వర్సిటీ వెబ్ సైట్ www.Nagarjuna University.ac.in పొందవచ్చన్నారు.

News January 6, 2026

జిల్లా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఛైర్మన్‌గా సుబ్బారాయుడు

image

తూ.గో. జిల్లా ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఛైర్మన్‌గా బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు నియమితులయ్యారు. రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడైన ఆయన, 2026 నుంచి 2029 వరకు మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ సందర్భంగా ఛాంబర్ అధ్యక్షులు రాజా, కార్యదర్శి శ్రీనివాస్ ఆయనను కలిసి అభినందనలు తెలిపారు.