Andhra Pradesh

News May 23, 2024

చిత్తూరు: ఈనెల 25న డీఈఓ అభ్యర్థులకు ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ పరీక్ష

image

చిత్తూరు జిల్లాలో ఈనెల 25న డీఈఓ అభ్యర్థులకు ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ సగిలి షణ్మోహన్ గురువారం తెలిపారు. జిల్లా కేంద్రంలో సీతమ్స్ కళాశాల, పూతలపట్టు – వేము ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గంగవరం- మదర్ థెరిసా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్ టెక్నాలజీలో స్క్రీనింగ్ పరీక్ష జరుగుతుందని చెప్పారు. ఉదమం 9 నుంచి 11:30 గంటల మధ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

News May 23, 2024

ఓట్ల లెక్కింపు అత్యంత కీల‌క‌ం: కలెక్టర్ నాగ‌ల‌క్ష్మి

image

ఎన్నిక‌ల ప్రక్రియలో భాగంగా చేపట్టే ఓట్ల లెక్కింపు అత్యంత కీలకమని, ఈ ప్ర‌క్రియ‌ను ప‌క‌డ్బందీగా పూర్తి చేయాల‌ని విజయనగరం క‌లెక్ట‌ర్‌, ఎన్నిక‌ల అధికారి నాగ‌ల‌క్ష్మి ఆదేశించారు. ఆర్ఓలు, ఏఆర్వోలు, డీటీలు, నోడ‌ల్ అధికారుల‌కు ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌పై క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో తొలివిడ‌త అవ‌గాహ‌న‌, శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని గురువారం నిర్వ‌హించారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందని చెప్పారు.

News May 23, 2024

ఎన్టీఆర్: జూన్ 4న ర్యాలీలు, ఊరేగింపులు రద్దు

image

ఏపీలో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పలు జిల్లాల ఎస్పీలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజున ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతులు రద్దు చేస్తున్నట్లు పోలీస్ శాఖ ప్రకటించింది. అలాగే బాణసంచా విక్రయంపై కూడా నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. టపాసులు విక్రయించినా, కాల్చినా బాధ్యులపై కేసులు నమోదు చేస్తామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News May 23, 2024

పాఠశాలల్లో కిచెన్ గార్డెన్స్ ఏర్పాటుకు చర్యలు: కలెక్టర్

image

పాఠశాలల్లో కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు ద్వారా విద్యార్థి దశ నుంచి ప్రకృతి వ్యవసాయం పట్ల అవగాహన కల్పించాలని కలెక్టర్ DK బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో విద్యాశాఖ అనుబంధ శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహిస్తున్న రీతిలో ప్రకృతి వ్యవసాయం పట్ల విద్యార్థి దశ నుంచి అవగాహన కల్పించాలన్నారు.

News May 23, 2024

కారంచేడు: తిరుపతికి వెళ్లి వస్తూ అనంతలోకాలకు

image

కారంచేడుకు చెందిన పొత్తూరి వెంకట శివసుబ్రహ్మణ్యం భార్య రేఖ ప్రియాంక(32), పిల్లలు నిక్షిత్ (5) తేజవర్ధన్ (3)తో హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. వీరు కుమారిడి పుట్టు వెంట్రుకలు తీయించేందుకు కారులో తిరుమలకు వెళ్లారు. దైవదర్శనం అనంతరం వారు తిరిగి హైదరాబాద్‌కు బుధవారం రాత్రి బయలుదేరారు. గురువారం వేకువజామున కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రేఖ ప్రియాంక మృతిచెందగా, సుబ్రమణ్యంకు తీవ్ర గాయాలయ్యాయి.

News May 23, 2024

తిరుపతి ఎస్వీయూలో పులివర్తి నానిని విచారిస్తున్న పోలీసులు

image

తిరుపతిలోని ఎస్వీయూ క్యాంపస్ పోలీస్ స్టేషన్‌లో పులివర్తి నానిని పోలీసులు విచారిస్తున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆవరణలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీంతో తనపై హత్యాయత్నం చేసినట్లు నాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై తిరుపతి డీఎస్సీ మనోహరాచారి, సీఐ మురళీ మోహన్ నానిని విచారిస్తున్నారు.

News May 23, 2024

కోడూరు: బైకును ఢీకొన్న ట్రాక్టర్.. యువకుడు మృతి

image

చిట్వేలిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. చిట్వేలి నుంచి గరుగుపల్లికి వెళ్లే రహదారిలో సాయిబాబా గుడి వద్ద ట్రాక్టర్ బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మైలపల్లి హరిజనవాడకు చెందిన కేతరాజుపల్లి చందు కిషోర్ (18) అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన జరిగిన వెంటనే ట్రాక్టర్ డ్రైవర్ చిట్వేలి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 23, 2024

విజయవాడ: ప్రధాని మోదీ రోడ్‍షోలో భద్రతా వైఫల్యంపై కేంద్రం సీరియస్

image

విజయవాడలో ప్రధాని మోదీ రోడ్‍షోలో భద్రతా వైఫల్యంపై కేంద్రం సీరియస్ అయ్యినట్లు సమాచారం. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. ప్రధాని మోదీ ర్యాలీకి 45 నిమిషాల ముందు, ర్యాలీ ప్రారంభం, చివర్లో డ్రోన్‍లు ఎగరవేయటంపై కేంద్రం సీరియస్ అయ్యింది. డ్రోన్లు ఎగురవేసిన వారిపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

News May 23, 2024

శ్రీకాకుళం: ప్రయాణికుల రద్దీ మేరకు సమ్మర్ స్పెషల్ రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ మేరకు శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా నాగర్‌కోయిల్(NCJ), డిబ్రుగర్(DBRG) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.06103 NCJ-DBRG రైలును జూన్ 7, 14, 21 తేదీలలో, నం.06104 DBRG-NCJ రైలును జూన్ 12, 19, 26 తేదీలలో నడుపుతామని తెలిపారు. ఈ రైళ్లు ఏపీలో ఒంగోలు, నెల్లూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని రైల్వే అధికారులు చెప్పారు.

News May 23, 2024

విశాఖ నుంచి వెళ్లే పలు రైళ్లు రద్దు

image

విశాఖ- గుణుపూర్ పాసింజర్ రైలును ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు రద్దు చేశారు. అదే విధంగా, గుణుపూరు నుంచి విశాఖకు వచ్చే పాసింజర్ ట్రైన్ ఈ నెల 24 నుంచి 27 వరకు రద్దు చేశారు. పలాస-విశాఖ, విశాఖ-పలాస మధ్య నడిచే పాసింజర్ ట్రైన్‌ను ఈ నెల 27న రద్దు చేసినట్లు తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు.