India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అనంతపురం జిల్లాలో మట్కా, కర్ణాటక మద్యం కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న 8మందిని జిల్లా బహిష్కరణ చేస్తూ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. పలుమార్లు కేసులు నమోదుచేసినా తరచూ కార్యకలాపాలను కొనసాగిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంతో వారిపై జిల్లా బహిష్కరణ వేటు వేసినట్లు తెలిపారు. అందులో అనంతపురం, బెలుగుప్ప, గార్లదిన్నె మండలాలకు చెందిన వారు ఉన్నట్లు వెల్లడించారు.

ఉమ్మడి తూ.గో.లోని 19నియోజకవర్గాల్లో 2019 ఎన్నికల్లో వైసీపీ 14 చోట్ల గెలిచింది. 4 స్థానాల్లో టీడీపీ, ఒకచోట (రాజోలు) జనసేన పాగా వేసింది. తాజాగా పిఠాపురం నుంచి పవన్ పోటీచేయడంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. కాగా పొత్తులో భాగంగా జనసేన ఈ సారి 5 చోట్ల పోటీచేసింది. మరి గతంలో జనసేన గెలిసిన ఏకైక స్థానం ఈ జిల్లాలోనే కాగా.. ఈ సారి సీట్లు పెరిగేనా.?
– ఉమ్మడి తూ.గో.లో కూటమికి ఎన్నిసీట్లు రావొచ్చు..?

సార్వత్రిక ఎన్నికలు హోరాహోరిగా జరిగాయి. 2019 ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి ఎక్కువ శాతం పోలింగ్ నమోదైంది. కాగా ఆదోని నియోజకవర్గం ఓటర్లు ఇందుకు భిన్నంగా ఉన్నారు. ఆదోనిలో 66.5శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. నియోజకవర్గంలో 2,63,058మంది ఓటర్లు ఉండగా..1,75,064మంది ఓటు వేశారు. 87,994మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు.

శ్రీకాకుళంలోని గూనపాలెంలో సురేశ్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆయన భార్య తిరుమలనే ఈ ఘాతుకానికి పాల్పడింది. పోలీసుల వివరాల మేరకు.. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉండటంతో హత్యకు భార్య ప్లాన్ చేసింది. ఈనెల 16న రాత్రి సురేశ్ తీసుకున్న ఆహారంలో నిద్రమాత్రలు కలిపింది. తర్వాత ప్రియుడికి సమాచారం అందజేసింది. అతను తన ఫ్రెండ్తో కలిసి సురేశ్ ఇంటికి వచ్చారు. అక్కడ అతడి గొంతు కోసి చంపేశారు.

అనంతపురం జిల్లాలో ఈ నెల 24 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలకు 34 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు డివీఈఓ వెంకటరమణ నాయక్ తెలిపారు. ప్రథమ సంవత్సరం 15,921, ద్వితీయ సంవత్సరం 5,017, వృత్తిపరమైన ప్రథమ సంవత్సరం 980, ద్వితీయ సంవత్సరం 592మంది హాజరు కానున్నట్లు తెలిపారు. పరీక్షలు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.

భారత వాయు సేనలో అగ్ని వీర్ సైనిక ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మంగళవారం తెలిపారు. పదో తరగతి తత్సమానమైన విద్యా అర్హత కలిగి ఉండాలన్నారు. సంగీత ప్రావీణ్యం ఫ్లూట్, కీబోర్డ్, పియాసో మొదలైన వాటిలో ఏదైనా ప్రావీణ్యం కలిగి ఉండాలన్నారు. నేటి నుంచి జూన్ ఐదవ తేదీ వరకు https:///agnipathvayu.cdac.in ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు.

భారతీయ వైమానికదళం అగ్నివీర్ వాయు ‘సంగీతకారుల కోసం’ రిక్రూట్మెంట్ ర్యాలీ ఈ నెల 22వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు, జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ తెలిపారు. ఆసక్తి గల అవివాహితులైన పురుషులు, మహిళలు తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. 10వ తరగతి చదివి ఆసక్తి కలిగిన యువతీ, యువకులు నేటి నుంచి https:///agnipathvayu.cdac.in వెబ్ పోర్టల్ లో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.

పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ప.గో. జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనుమంట్ర మండలం భట్లమగుటూరుకు చెందిన పి.శివకుమార్ (22) తండ్రి మందలించాడని మనస్తాపం చెంది పొలంలో పురుగు మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతణ్ని స్థానికులు గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూడగా అప్పటికే చనిపోయి ఉన్నాడు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు.

వృద్ధురాలి హత్య కేసుకులో ఇద్దరిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి కథనం ప్రకారం.. కొత్తపట్నంలోని రెడ్డిపాలెం గ్రామానికి చెందిన గుడిపల్లి నాగేశ్వరమ్మ(75) కల్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 18న అర్ధరాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రెడ్డిపాలేనికి చెందిన నాగరాజు, నాంచార్లు నిద్రిస్తున్న ఆమెను గొంతు నులిమి, ఊపిరాడకుండా చేసి హత్యకు పాల్పడ్డారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

రాయదుర్గంలో మంగళవారం రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో NIA సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అతడి కొడుకు సాఫ్ట్వేర్ ఉద్యోగి సోహైల్ను పోలీసులు అరెస్ట్చేసి 7గంటలు విచారించారు. రామేశ్వరం కెఫే బాంబు పేలుడు ఘటనలో నిందితుడిగా సోహైల్ స్నేహితుడిని NIA అధికారులు గుర్తించారు. అతడితో సోహైల్ హైదరాబాద్కు వెళ్లేవాడిని, పలుమార్లు వాట్సప్లో మాట్లాడటం, చాటింగ్ చేయటం వంటివి NIA గుర్తించింది.
Sorry, no posts matched your criteria.