Andhra Pradesh

News March 23, 2024

అనంత: JNTU బీఫార్మసీ ఫలితాలు విడుదల

image

అనంతపురం JNTU బీఫార్మసీ ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్‌ ఎవాల్యుయేషన్‌ కేశవరెడ్డి, సీఈ చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. ఫిబ్రవరిలో బీఫార్మసీ తృతీయ సంవత్సరం ప్రథమ సెమిస్టర్‌ (ఆర్‌19)రెగ్యులర్‌, సప్లమెంటరీతో పాటు(ఆర్‌15) సప్లమెంటరీ పరీక్షలు జరిగాయన్నారు. అదేవిధంగా ద్వితీయ సెమిస్టర్‌(ఆర్‌19,15) సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయన్నారు. విద్యార్థులు ఆ ఫలితాల కోసం www.jntua.ac.in వెబ్‌సైట్ సంప్రదించాలన్నారు.

News March 23, 2024

కమలాపురంలో టీడీపీ ప్రయోగం ఫలించేనా?

image

కడపలో ఎలాగైనా పట్టు సాధించాలని టీడీపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే అభ్యర్థుల ఎంపిక సాగుతోంది. కమలాపురంలో వరుసగా 4 సార్లు ఓడిపోయిన నరసింహారెడ్డిని కాదని తనయుడు చైతన్యరెడ్డికి టికెట్ ఇచ్చింది. అటు వైసీపీలో రెండు సార్లు గెలిచిన రవీంద్రనాథ్ రెడ్డే మరోసారి బరిలో నిలుస్తూ హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. మరి తండ్రి గెలవలేకపోయిన చోట తనయుడు గెలిచి చరిత్ర సృస్టిస్తారని అనుకుంటున్నారా.?

News March 23, 2024

ఉండి మాజీ ఎమ్మెల్యే శివపై కేసు నమోదు

image

ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజుపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదైంది. పాలకోడేరు ఎస్‌ఐ నాళం శ్రీనివాసరావు శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. ఈ నెల 20న పాలకోడేరు మండలంలో శివరామరాజు సుమారు 30 వాహనాలతో ఊరేగింపు నిర్వహించారని, అందుకు ముందస్తు అనుమతి తీసుకోలేదని ఎస్సై తెలిపారు. దీనిపై ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఇచ్చిన సమాచారం మేరకు పాలకోడేరు తహశీల్దార్‌ నాగార్జున పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News March 23, 2024

VZM: ఫెన్సింగ్ పోటీలకు జిల్లా నుంచి ముగ్గురు

image

జిల్లా నుంచి ముగ్గురు క్రీడాకారులు ఈనెల 25 నుంచి మూడు రోజులపాటు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని జీఎస్ఎల్ మెడి కల్ కళాశాలలో జరగనున్న జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఎంపికైన సాయి చైతన్య, హర్షిత, కె.హితలను ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి, కోచ్‌లు అనిల్ కుమార్ శర్మ, సతీష్ కుమార్, పి.అప్పలరాజు అభినందించారు.

News March 23, 2024

విశాఖ: కరెంట్ షాక్‌తో యువకుడి మృతి

image

విశాఖ జీవీఎంసీ 6వ వార్డ్ పీఎం పాలెం గాయత్రి నగర్‌లో చిల్ల సంతోష్ (27) అనే వ్యక్తి శుక్రవారం కరెంట్ షాక్‌కి గురై మృతి చెందాడు. గాయత్రి నగర్‌లోని ఓ భవనంలో ప్లంబింగ్ పని చేస్తూ ఉండగా ఈ ఘటన జరిగిందని, స్థానికుల సమాచారం ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుని స్వస్థలం విజయనగరం జిల్లా జామి మండలం చిల్లపాలెంగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News March 23, 2024

TDP అభ్యర్థుల్లో అతి పిన్న వయస్కుడు హరీశే

image

ఈసారి TDP అభ్యర్థుల్లో అతి పిన్న వయస్కుడు మన అమలాపురం నుంచే అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఆయనే గంటి హరీశ్ మాధుర్(33). 12వ లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన దివంగత జీఎంసీ బాలయోగి-మాజీ ఎంపీ విజయకుమారి దంపతుల కుమారుడు హరీశ్‌కు అమలాపురం ఎంపీ టికెట్ ఖరారైంది. స్వగ్రామం ఐ.పోలవరం మండలం ఎదుర్లంక. BBM చదివిన ఈయన.. 2019లోనూ ఇక్కడే MPగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఈసారి మళ్లీ ఆయనే టికెట్ దక్కించుకున్నారు.

News March 23, 2024

ఏర్పేడు: వాలంటీర్ల తొలగింపు.. కండక్టర్‌పై విచారణ

image

మండలంలోని పెనుమల్లం, రావిళ్లవారి కండ్రిగకు చెందిన ఇద్దరు వాలంటీర్లను శుక్రవారం విధుల నుంచి తొలగించినట్లు ఎంపీడీవో గిడ్డయ్య ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించగా వాలంటీర్లు లత, గీత, ఆర్టీసీ కండక్టర్ మురళి పాల్గొన్నట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో వాలంటీర్లను తొలగించడంతో పాటు మురళిపై విచారణకు ఆదేశాలు జారీ చేశామన్నారు.

News March 23, 2024

అనంత: ఎన్టీఆర్ విగ్రహం పాక్షిక ధ్వంసంపై కేసు నమోదు

image

అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కళాశాల ఎదుట ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు స్వల్పంగా ధ్వంసం చేశారు. అదేవిధంగా విగ్రహం చుట్టూ ఉన్న రెయిలింగ్‌కు చీపుర్లు కట్టి, ఏదో మంత్రం రాశారన్నారు. ఇది గమనించిన టీడీపీ నగర అధ్యక్షుడు ఆకులేటి మారుతి కుమార్ గౌడ్ శుక్రవారం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని సీఐ ధరణి కిషోర్ తెలిపారు.

News March 23, 2024

కర్నూలు: 20 ఏళ్లుగా పనిచేసిన వ్యక్తికి టికెట్ నిరాకరణ

image

మంత్రాలయం నుంచి తిక్కారెడ్డి 2014, 2019లో TDP తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. అయితే 20 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన ఆయనకు కాదని ఈసారి రాఘవేంద్రరెడ్డికి టికెట్ కేటాయించారు. దీంతో తిక్కారెడ్డి వర్గం నిరసనలు చేపట్టింది. మూడో జాబితాలో అయినా తననే అభ్యర్థిగా ప్రకటిస్తారేమోనని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో తిక్కారెడ్డి TDPలోనే కొనసాగుతారా? లేక వేరే పార్టీలోకి వెళ్తారా అనే చర్చ నడుస్తోంది.

News March 23, 2024

ఈ ఎన్నికల్లో సర్వేపల్లి ప్రత్యేకత ఇదే.!

image

సర్వేపల్లి నియోజకవర్గంలో మరోసారి పాత ప్రత్యర్థుల మధ్యే పోరు జరగనుంది. 2014, 19 ఎన్నికల్లో మాదిరిగానే ఈ సారి కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య రసవత్తర పోరు సాగనుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఏ నియోజకవర్గంలోనూ ఇలా పాత ప్రత్యర్థులు ముఖాముఖి తలపడే అవకాశం లేకుండాపోయింది. ఒక్క సర్వేపల్లి అభ్యర్థులకే ఆ అవకాశం దక్కింది.

error: Content is protected !!