Andhra Pradesh

News August 25, 2024

ఏలూరు జిల్లాలో YSR విగ్రహం ధ్వంసం

image

ఏలూరు జిల్లాలో YSR విగ్రహాన్ని ధ్వంసం చేయడం కలకలం రేపింది. జంగారెడ్డిగూడెం మండలం కృష్ణంపాలెం గ్రామంలో YSR విగ్రహాన్ని శనివారం రాత్రి దుండగులు ధ్వంసం చేశారు. ఇవాళ ఉదయాన్నే ఈ ఘటనను గుర్తించారు. ఎంపీటీసీ బిరుదుగట్ల రత్నకుమారి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు గ్రామంలో ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు.

News August 25, 2024

స్వదేశీ దర్శన్ పథకం కింద బొర్రా ఎంపిక

image

ప్రముఖ పర్యాటక కేంద్రం, సహజసిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలు నూతన రూపు సంతరించుకోనున్నాయి. స్వదేశీ దర్శన్ పథకం కింద అభివృద్ధి చేసేందుకు రాష్ట్రంలో బొర్రా గుహలను ఎంపిక చేశారు. దీంతో ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దనున్నారు. బొర్రా రైల్వే స్టేషన్ మొదలుకొని లోపలికి వెళ్లే అన్ని ప్రదేశాలను ఆధునీకరిస్తారు. గుహల లోపల విద్యుత్ వెలుగుల ఏర్పాటు, పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు.

News August 25, 2024

కాకినాడ: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

image

తాళ్లరేవు మండలం పోలేకుర్రు గ్రామం సంకటరేవు రామాలయం వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. యానాం వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్ తాళ్లరేవు వైపు నుంచి వస్తున్న బైక్ ఢీకొన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న కోరంగి ఎస్ఐ సత్యనారాయణ వివరాలు సేకరిస్తున్నారు. మృతుడు గాడిమొగ వాసిగా గుర్తించారు.

News August 25, 2024

ఆదిభట్ల నారాయణదాసు మనుమరాలు కన్నుమూత

image

హరికథ పితామహులు ఆదిభట్ల నారాయణదాసు మనుమరాలు కామేశ్వరమ్మ (88) శనివారం సాయంత్రం కన్నుమూశారు. ఈ రోజు ఉదయం ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతి పట్ల పలువురు సాహితీవేత్తలు, కళాకారులు, పట్టణ ప్రముఖులు సంతాపం తెలిపారు. హరికథాగానం అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన నారాయణదాసు వంశీకులు ఇప్పటికి కూడా విజయనగరంలో ఉండటం విశేషం.

News August 25, 2024

శ్రీకాళహస్తి: ఇలాంటి విషయాల్లో జాగ్రత్త..!

image

అతని వయస్సు పాతికేళ్లు. పెళ్లై ఇద్దరు పిల్లలు. పెడదారి పట్టి చివరకు చనిపోయాడు. శ్రీకాళహస్తి సీఐ గోపి వివరాల మేరకు.. తెలంగాణ(S) సిద్ధిపేట(D) గజ్వేల్‌‌కు చెందిన శివ(26) పెయింటర్‌. ఆరేళ్ల క్రితం వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీకాళహస్తి మహిళతో వివాహేతర సంబంధం ఉండటంతో 2 రోజుల క్రితం ఇక్కడకు వచ్చాడు. ఆమె మందలించగా.. బెదిరించేందుకు పురుగు మందు తాగాడు. చికిత్స పొందుతూ మృతిచెందాడు.

News August 25, 2024

NLR: పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

నెల్లూరు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ప్రభుత్వ పాఠశాలల HMలు, టీచర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో పీవీజే రామారావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 31వ తేదీ సాయంత్రంలోగా ఉప, మండల విద్యా శాఖాధికారుల ద్వారా డీఈవో ఆఫీసుకు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. వివరాలకు  జిల్లా కార్యాలయాన్ని సంప్రదించాలని వివరించారు.

News August 25, 2024

ప.గో జిల్లాలో సగటు వర్షపాతం 17.6 మి.మీ

image

ప.గో జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు 17.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నరసాపురం మండలంలో 62 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మండలాల వారీగా తణుకు- 20. ఆకివీడు- 14.2, ఉండి- 17.2, పాలకోడేరు- 30.2, పెనుమంట్ర- 20.6, ఆచంట- 20.2, పోడూరు- 10.4, వీరవాసరం- 13.4, కాళ్ల- 13.2, మొగల్తూరు- 24.4, పాలకొల్లు- 30.3, యలమంచిలి- 50.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

News August 25, 2024

ఏలూరు జిల్లాలో 7,613 మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా

image

ఏలూరు జిల్లాలో శనివారం మూడు బుకింగ్ సెంటర్ల ద్వారా 1,526 మెట్రిక్ టన్నుల ఇసుకను సరఫరా చేసినట్టు మైనింగ్ డీడీ సునీల్ తెలిపారు. జిల్లాలో ఇంతవరకు మొత్తం 7,613 మెట్రిక్ టన్నుల ఇసుక వినియోగదారులకు సరఫరా చేశామని తెలిపారు. ఇబ్రహీంపేట స్టాక్ పాయింట్ వద్ద మెట్రిక్ టన్ను రూ.210, చేబ్రోలు స్టాక్ పాయింట్ వద్ద రూ.538, వింజరం స్టాక్ పాయింట్ వద్ద పాయింట్ వద్ద టన్ను రూ.362కు ఇసుకను సరఫరా చేశామని వివరించారు.

News August 25, 2024

అమరావతి నిర్మాణ వ్యయం రూ.60వేల కోట్లు

image

రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి 20వేల కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. శనివారం కృష్ణా జిల్లాలో జరిగిన ఓ సదస్సులో పాల్గొని ఆయన మాట్లాడారు. నాలుగేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం నిర్దేశించారని స్పష్టం చేశారు. డిసెంబర్ ఒకటి నుంచి పూర్తిస్థాయిలో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి అన్నారు.

News August 25, 2024

విశాఖ: ‘డిజైన్ లోపంతోనే భారీ ప్రమాదం’

image

అచ్యుతాపురం ఎసెన్సియా ఫార్మా కంపెనీలో పైప్ లైన్ నిర్వహణతో పాటు డిజైన్‌లో లోపాలే పెద్ద ప్రమాదానికి కారణమని రాష్ట్ర విపత్తుల నిర్వహణ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ ఎం.ప్రతాప్ తెలిపారు. పరిశ్రమల తనిఖీల్లో సరైన విధానం పాటించకపోవడం వల్లే ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయన్నారు. నిపుణులైన కార్మికులను నియమించుకోవడం, ఆధునిక సాంకేతికతను అమలు చేయడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చునన్నారు.