Andhra Pradesh

News August 17, 2024

వరికుంటపాడు: పిడుగుపాటుకు వ్యక్తి మృతి

image

వరికుంటపాడు మండలంలో శనివారం సాయంత్రం గాలి వాన బీభత్సం సృష్టించింది. జి కొత్తపల్లి గ్రామ సమీపంలో వరి నాటుతుండగా పిడుగు పడి కోటయ్య(47) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు ఒక భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

News August 17, 2024

విశాఖ: ముగ్గురు పర్యాటకులను కాపాడిన లైఫ్ గార్డ్స్

image

విశాఖలోని రుషికొండ బీచ్‌లో స్నానానికి దిగి మునిగిపోతున్న ముగ్గురు పర్యాటకులను జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ కాపాడారు. హైదరాబాద్‌కు చెందిన 20 మంది శనివారం రిషికొండ బీచ్‌లో సరదాగా గడిపేందుకు వచ్చారు. వారిలో దీపక్ (15), నితిన్ (15), కౌశిక్ (18) సముద్రంలో కొట్టుకుపోతుండగా లైఫ్ గార్డులు సతీష్, రాజు గమనించారు. వెంటనే సముద్రంలోకి వెళ్లి వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు.

News August 17, 2024

విజయనగరంలో టైక్వాండో పోటీలు ప్రారంభం

image

న్యూ ఆంధ్రప్రదేశ్ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ ఇండోర్ స్టేడియంలో టైక్వాండో అంతర్ జిల్లాల రాష్ట్ర స్థాయి పోటీలను మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టైక్వాండో క్రీడ రోజురోజుకు ప్రాచుర్యం పొందుతోందన్నారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పాల్గొన్నారు.

News August 17, 2024

విశాఖ: బీజేపీలో చేరిన వైసీపీ రాష్ట్ర మహిళా నేత

image

వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈగలపాటి యువశ్రీ బీజేపీలో చేరారు. శనివారం విశాఖ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు సమక్షంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ కన్వీనర్ నరసింగరావు ఆధ్వర్యంలో చేరిక జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలన నచ్చి బీజేపీలో చేరినట్లు ఆమె తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వివరించారు.

News August 17, 2024

ప్రభాస్ కొత్త సినిమాకు క్లాప్ కొట్టిన మంత్రి గొట్టిపాటి

image

దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో హీరో ప్రభాస్ సినిమా నేడు ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరయ్యారు. అనంతరం సినిమాకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్బంగా చిత్ర బృందానికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు సినీ నటులు పాల్గొన్నారు.

News August 17, 2024

హిజ్రాల సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అచ్చెన్న

image

హిజ్రాల సమస్యలు పరిష్కరిస్తానని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాలి మండలం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో శనివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. మంత్రిని కలిసిన హిజ్రాలు తమ సమస్యలు వివరించారు. సమాజంలో తమ వర్గాన్ని చిన్నచూపు చూస్తున్నారన్నారు. తమ జీవనం ఏదోలా నెట్టికొస్తున్నామని, సమాజంలో తమకంటూ ఓ గుర్తింపునిచ్చేలా ప్రభుత్వం సహకరించాలని కోరారు.

News August 17, 2024

కాకినాడ: LOVE.. ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదని సూసైడ్

image

తునిలో విషాద ఘటన జరిగింది. ప్రేమించిన అమ్మాయితో ఇంట్లో వారు పెళ్లికి ఒప్పుకోవడం లేదని ఓ యువకుడు ట్రైన్ కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. తుని శివారులోని పెద్ద రైల్వే గేటు సమీపంలో ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు ఎస్‌.అన్నవరం గ్రామానికి చెందిన వడ్లమూరి భాను(22)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

News August 17, 2024

ఏలూరులో దారుణం.. భర్తకు మద్యం తాగించి భార్యపై అత్యాచారం

image

ఏలూరులో దారుణం చోటుచేసుకుంది. కూలి పనుల కోసం భర్తతో కలిసి వచ్చిన మహిళపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. రామకోటి ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. భర్తకు మద్యం తాగించి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసుల ముందు వాపోయింది. సహకరించకుంటే భర్తను చంపేస్తామని బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డారని కన్నీరుపెట్టుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News August 17, 2024

అరకు: గిరిజన సాంప్రదాయంలో సుప్రీంకోర్టు జడ్జి వివాహం

image

అరకు అందాలు అద్భుతంగా ఉన్నాయని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ జేకే మహేశ్వరి అన్నారు. శనివారం జస్టిస్ దంపతులు అరకులో పర్యటించారు. వారికి జేసీ అభిషేక్, ఐటీడీఏ పీవో వి.అభిషేక్ ఘన స్వాగతం పలికారు. ముందుగా జస్టిస్ దంపతులు ట్రైబల్ మ్యూజియం సందర్శించారు. అక్కడ గిరిజన సంస్కృతి సంప్రదాయాలను తిలకించారు. ఆపై గిరిజన సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు.

News August 17, 2024

న్యాయమూర్తులతో వర్చువల్ సమావేశం నిర్మించిన జిల్లా జడ్జి

image

శ్రీకాకుళం జిల్లా కోర్ట్ ఆవరణలో శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా జిల్లాలో గల న్యాయమూర్తులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 14న జరగబోయే లోక్ అదాలత్ కక్షిదారులకు ఒక మంచి అవకాశం అని, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులను, సివిల్ కేసులు, ఫ్రీ లిటిగేషన్ కేసులను ఎక్కువ చేయాలని అతను కోరారు. కార్యక్రమంలో సన్యాసినాయుడు, ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు.