Andhra Pradesh

News August 12, 2024

తుంగభద్ర డ్యామ్‌కు కర్ణాటక సీఎం

image

కర్ణాటక సీఎం సిద్ద రామయ్య తుంగభద్ర డ్యామ్‌ను మంగళవారం సందర్శించనున్నారు. తుంగభద్ర డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోవడంతో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో కలిసి క్షేత్రస్థాయిలో గేటు మరమ్మతుల పనులు పరిశీలించనున్నారు. దీంతో అందుకు తగ్గ ఏర్పాట్లను కొప్పల్, విజయనగర జిల్లాల అధికారులు చేస్తున్నారు. ఇప్పటికే తుంగభద్ర డ్యామ్‌ను ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, రామానాయుడులు పరిశీలించారు.

News August 12, 2024

వేల కోట్ల కేంద్ర నిధులు నిర్వీర్యం చేశారు: దేవినేని ఉమ

image

ఎన్టీఆర్: వైసీపీ పాలకులు వేల కోట్ల రూపాయల కేంద్ర నిధులు నిర్వీర్యం చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్వీట్ చేశారు. జల్ జీవన్ మిషన్ పథకం కింద కేంద్రం రూ.16,483 కోట్లు ఇస్తే, జగన్ తన అసమర్థతతో 20% కూడా ఖర్చు పెట్టలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన తాగునీరు ఇవ్వకుండానే జగన్ తన అవినీతితో అస్మదీయుల జేబులు నింపారని ఉమ ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.

News August 12, 2024

దేశంలో టాప్-5 రాష్ట్రాలతో పోటీపడాలి: చంద్రబాబు

image

పారిశ్రామికాభివృద్ధికి సంబంధించి దేశంలో టాప్-5 రాష్ట్రాలతో పోటీ పడే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన పారిశ్రామికాభివృద్ధి విధానం ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నూతన పారిశ్రామిక విధానం రూపకల్పనలో నీతి ఆయోగ్ ఆలోచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు.

News August 12, 2024

చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం భేటీ

image

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం భేటీ అయింది. ఈ మేరకు రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చించింది. గత రెండు రోజులుగా అమరావతిలో పర్యటిస్తున్న ఈ బృందం.. రాజధాని ప్రాంతంలోని భవనాలు, రహదారులను పరిశీలించింది. ప్రపంచంలోని ఉత్తమ ప్రమాణాలు, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి అమరావతి నిర్మిస్తున్నామని ఆ బృందానికి సీఎం వివరించారు.

News August 12, 2024

విశాఖ MLC ఉపఎన్నిక.. కూటమి అభ్యర్థిపై వీడని ఉత్కంఠ..!

image

విశాఖ స్థానిక సంస్థల MLC ఉపఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. YCP అభ్యర్థి బొత్స సత్యనారాయణ సోమవారం నామినేషన్ దాఖలు చేయగా.. కూటమి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. స్పష్ఠమైన మెజార్టీతో గెలుస్తామని YCP ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే చోడవరం, యలమంచిలి, పాయకరావుపేటలో పలువురు YCP ప్రజాప్రతినిధులు TDPలో చేరారు. నామినేషన్‌కు మంగళవారం ఒక్కరోజే గడువు ఉండడంతో కూటమి అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది.

News August 12, 2024

విజయవాడ: డ్రగ్స్ కేసులో నిందితుడి అరెస్ట్

image

గుంటూరుకు చెందిన రావి మస్తాన్ సాయి అనే యువకుడిని డ్రగ్స్ కేసులో విజయవాడ సెబ్ పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. నిందితుడు డిల్లీ నుంచి డ్రగ్స్ తెప్పించి రెండు తెలుగు రాష్ట్రాల్లో సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన విజయవాడ పశ్చిమ సెబ్ పోలీసులు గుంటూరు వచ్చినట్లు తెలియటంతో సెబ్ పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.

News August 12, 2024

ఈస్ట్ కోస్ట్ రైల్వే ఖాతాలో మరో మైలురాయి

image

ఈస్ట్ కోస్ట్ రైల్వే మరో మైలు రాయిని సాధించింది. ప్రజలతో కూడిన మల్టీ మోడల్ లార్జెస్ట్ పార్ట్ అండ్ కంటైనర్‌ను విశాఖ నుంచి జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ సెంట్రల్ రైల్వేలో విజయవంతంగా లోడ్ చేసింది. పవర్ వ్యాగన్ లతో కూడిన 1,080 టన్నుల రొయ్యలు ఈ కంటైనర్‌లో ఉన్నాయి. ఈ సందర్భంగా సౌరవ్ ప్రసాద్ మాట్లాడుతూ.. సరుకు రవాణా ద్వారా రైల్వే మరింత ఆదాయ మార్గాలను సమకూర్చుకుంటోందని అన్నారు.

News August 12, 2024

తణుకు: బైకు అదుపుతప్పి యువకుడు దుర్మరణం

image

బైక్ అదుపుతప్పి ఓ యువకుడు మృతిచెందిన ఘటన సోమవారం రాత్రి తణుకు పట్టణంలో జరిగింది. ఉండ్రాజువరం జంక్షన్ సమీపంలో జరుగుతున్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో భాగంగా ట్రాఫిక్ మళ్లించేందుకు రోడ్డుకు అడ్డంగా తాడు కట్టారు. అటుగా బైక్‌పై వెళ్తున్న పాలంగికి చెందిన గంగులకుర్తి పూర్ణచంద్ర సాయికుమార్ (22) తాడును గమనించకపోవడంతో అదుపుతప్పి కిందపడ్డాడు. తలకు తీవ్రగాయాలవడంతో మృతి చెందాడు. కేసు నమోదైంది.

News August 12, 2024

117 జీవోను రద్దు చేస్తాం: ఎమ్మెల్సీ

image

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు అన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 22 ఉపాధ్యాయ సంఘాలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను విద్యాశాఖ మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. 117 జీవోను రద్దు చేస్తామని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. వీలైనంత తొందరలో వారి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు.

News August 12, 2024

విజయనగరంలో భారీగా గో మాంసం స్వాధీనం

image

జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్ ఆదేశాల మేరకు విజయనగరం వన్ టౌన్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా పశువుల కబేళాపై రైడ్ చేశారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంటోన్మెంట్ ఏరియాలో స్లాటర్ హౌస్‌‌లో ఈ తనిఖీలు జరిగాయి. 1100 కేజీల గోమాంసంతో పాటు 13 కోసిన, 37 జీవంతో ఉన్న ఆవులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.