India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

శ్రీకాకుళం జిల్లా పోలీసుశాఖలో ఒకేసారి 26 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ మహేశ్వరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆయన తన మార్క్ను చూపించారు. చాలా ఏళ్లుగా జిల్లాలోనే విధులు నిర్వహిస్తున్న పలువురిని విశాఖపట్నం వీఆర్కు పంపారు. అశోక్బాబు (జములూరు), మధుసూదనరావు (వీఆర్ శ్రీకాకుళం), రంజిత్ (పోలాకి) సత్యనారాయణ వీఆర్ (శ్రీకాకుళం) యాసిన్ (హిరమండలం) తదితరాలు ఉన్నారు.

ప.గో. జిల్లా ఆచంట మండలం కోడేరులంకకు చెందిన రమేశ్ తూ.గో. జిల్లా పి.గన్నవరం మండలం L.గన్నవరంలో PMPగా వైద్యం చేస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన వరలక్ష్మిని ప్రేమించాడు. అమ్మాయి తండ్రి రమణకు విషయం చెప్పగా ఒప్పుకోలేదు. దీంతో ఆదివారం వారు ఓ చర్చిలో పెళ్లి చేసుకొని ఇంటికెళ్లారు. విషయం తెలిసిన రమణ మంగళవారం రాత్రి అబ్బాయి ఇంటికెళ్లి కత్తితో దాడి చేసి పారిపోయాడు. రమేష్ ఫిర్యాదుతో కేసు నమోదైంది.

చీరాల సమీపంలోని ఈపూరుపాలెం యువకుడు ఆరిఫ్ హత్య కేసులో మరో ఇద్దరు నిందితులను మంగళవారం అరెస్టు చేసినట్లు DSP జగదీశ్ నాయక్ వెల్లడించారు. ఈ నేరానికి ఉపయోగించిన కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం 8 మందిని నిందితులుగా గుర్తించారు. ఇంతకుముందే ఆరుగురి పట్టుబడగా.. తాజాగా పరారీలో ఉన్న గరిక మహేంద్ర, కర్రెద్దుల వంశీకుమార్ దొరికారు. త్వరలోనే పక్కాగా ఛార్జ్షీట్ వేస్తామని DSP చెప్పారు.

ప.గో. జిల్లా ఆచంట మండలం కోడేరులంకకు చెందిన రమేశ్ తూ.గో. జిల్లా పి.గన్నవరం మండలం L.గన్నవరంలో PMPగా వైద్యం చేస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన వరలక్ష్మిని ప్రేమించాడు. అమ్మాయి తండ్రి రమణకు విషయం చెప్పగా ఒప్పుకోలేదు. దీంతో ఆదివారం వారు ఓ చర్చిలో పెళ్లి చేసుకొని ఇంటికెళ్లారు. విషయం తెలిసిన రమణ మంగళవారం రాత్రి అబ్బాయి ఇంటికెళ్లి కత్తితో దాడి చేసి పారిపోయాడు. రమేష్ ఫిర్యాదుతో కేసు నమోదైంది.

నగరంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 23న ఉదయం 10.30 గంటలకు జాబ్ మేళా జరుగుతుందని జిల్లా ఉపాధి అధికారి ఎమ్.వినయ్ కుమార్ మంగళవారం తెలిపారు. వివిధ కంపెనీలలో ఖాళీ పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. ఆసక్తి గలవారు జాబ్ మేళాకు హాజరు కావాలని తెలిపారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 23న రైల్వేకోడూరు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. గన్నవరం నుంచి ఆయన ఉదయం 9:05 గంటలకు రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉదయం 9:10 గంటలకు మైసూర్ వారి పల్లి చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు మైసూరు వారి పల్లె సభలో పాల్గొంటారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా రాజంపేట మండలం పులపుత్తూరుకు మధ్యాహ్నం 12:45 గంటలకు చేరుకుని వరదల్లో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తారు.

వైఎస్ఆర్ జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రెండేళ్ల క్రితం హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష విధించారు. 2022వ సంవత్సరంలో కొండపేట గ్రామంలో కసువ జ్యోతి అనే మహిళను వివాహేతర సంబంధంతో నాగరాజు అనే వ్యక్తి దిండుతో నులిమి హతమార్చాడు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన న్యాయస్థానం 6వ అదనపు జడ్జి నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించినట్లు సీఐ పురుషోత్తం రాజు తెలిపారు.

TTD ఆసుపత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ఈనెల 29వ తేదీ వాక్-ఇన్ ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది.మొత్తం ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తిరుపతిలో ఉన్న టీటీడీ పరిపాలన భవన ప్రాంగణంలోని సెంట్రల్ హాస్పిటల్ వద్ద ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అర్హత, ఇతర వివరాలకు www.tirumala.org వెబ్సైట్ చూడాలి.

వ్యభిచార కూపం నుంచి విశాఖ యువతులకు విముక్తి లభించిన ఘటన తూ.గో జిల్లాలో వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు.. తూ.గో జిల్లా కొవ్వూరులోని రాజీవ్ కాలనీలో వ్యభిచారం జరుగుతుందనే సమాచారంతో సీఐ విశ్వం దాడి చేశారు. అక్కడ వ్యభిచారం నడిపిస్తున్న లక్ష్మిని అరెస్ట్ చేశారు. అలాగే విశాఖ, రాజమహేంద్రవరానికి చెందిన ఇద్దరు యువతలను ఆమె చెర నుంచి విడిపించారు.

అనంతపురం జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడిపత్రి మండల పరిధిలోని కడప రోడ్డులో లారీ, కారు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు తుదిశ్వాస విడిచారు. ఘటనపై తాడిపత్రి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.