India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తిరుపతి జిల్లాలో పవన్ కళ్యాణ్ ఇవాళ పర్యటించనున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీహరికోటలోని రాకెట్ కేంద్రానికి వెళ్తారు. ఒకవేళ వాతావరణం అనుకూలించకపోతే రోడ్డు మార్గాన వెళ్లడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. షార్లోని ఒకటి, రెండు గేట్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు ఇప్పటికే కాన్వాయ్ రిహార్సల్ చేపట్టారు.

కడప జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 14న కడప కలెక్టరేట్లో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టరేట్లోని జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయ ఆవరణలో ఉదయం పది గంటలకు మొదలయ్యే ఈ ఉద్యోగ మేళాకు పదో తరగతి, అంతకు పైన విద్యార్హత కలిగిన యువతీ-యువకులు తమ ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.

ఎచ్చెర్ల మండలంలో పంచాయతీ కార్యదర్శి ఎం.అప్పల రాజు సస్పెండ్ అయ్యారు. రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ చిలకపాలెంలో పర్యటించారు. పారిశుద్ధ్య పనులు సరిగా చేపట్టక పోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి పంచాయతీ కార్యదర్శిని బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేస్తున్నట్లు డీపీవో ఉత్వర్వులు జారీ చేశారు. అలాగే ఈవోపీఆర్డీ దేవికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు.

తుంగభద్ర డ్యాంలో నీరు పూర్తిగా వృథా కాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 19వ గేటు స్థానంలో స్టాప్లాగ్ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. హొసపేటెలో స్టాప్లాగ్ గేటును కార్మికులు సిద్ధం చేస్తున్నారు. రెండు రోజుల్లో తయారీ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఇక ప్రస్తుతం జలాశయంలో 97 టీఎంసీల నీటినిల్వ ఉంది. గేటు కొట్టుకుపోయిన తర్వాతి నుంచి నిన్న రాత్రి 9 గంటల వరకు 8 టీఎంసీల నీళ్లు ఖాళీ అయ్యాయి.

మానవత్వాన్ని మంటగలిపే ఘటన బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది. సంతమాగులూరు మండలం ఏల్చూరులోని దర్గా సెంటర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఆడ శిశువును పడేశారు. సోమవారం రాత్రి అటుగా వెళ్తున్న స్థానికులు ఇది గమనించి ICDS అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకొని వెంటనే శిశువును స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆడపిల్ల పుట్టిందనే కారణంతోనే ఇలా చేసి ఉంటారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

గుంటూరు జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన గుజ్జనగుండ్లలోని కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రఘు ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాల్లోని నిరుద్యోగ యువత ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

కాకినాడ జిల్లా తుని పట్టణానికి చెందిన వివాహితపై దగ్గరి బంధువైన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సదరు యువకుడు అఖిల్పై కేసు నమోదు చేశామని CI గీతా రామకృష్ణ తెలిపారు. కొన్నేళ్లుగా అసభ్యకరంగా ఫొటోలు తీసి, డబ్బుల కోసం వేధిస్తున్నాడని ఆ మహిళ ఫిర్యాదు చేసింది. జులై 25న ఏలూరులో తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పడంతో అఖిల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

కండ్రికకు చెందిన ఓ బాలిక(17)అదృశ్యమైన ఘటనపై నున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 11.30 గంటలకు తన ఫ్రెండ్ ఇంటికెళ్లి వస్తానని చెప్పిన సదరు బాలిక సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదని బాలిక తండ్రి పోలీసులకు చేశారు. బాలిక అదృశ్యమైన ఘటనపై ప్రమోద్ అనే యువకుడి హస్తముందని ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని నున్న పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.

చంద్రగిరి నియోజకవర్గంలో పని చేయడానికి పోలీసు అధికారులు ఆసక్తిగా చూపడం లేదు. ఎన్నికలకు ముందు ఇక్కడ జరిగిన అల్లర్లే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇప్పటికీ చంద్రగిరికి డీఎస్పీ నియమించ లేదు. మహిళా పీఎస్ డీఎస్పీ నరసింగప్ప ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నారు. పాకాల, భాకరాపేట సీఐలను బదిలీ చేసినా అక్కడ కొత్త వాళ్లను నియమించ లేదు. తిరుచానూరు సీఐగా సునీల్ కుమార్ ఒక్కరే కొత్తగా బాధ్యతలు తీసుకున్నారు.

ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో గుప్త నిధుల కోసం తవ్వకాలు కలకలం రేపాయి. బస్టాండ్ సమీప కుచ్చలమెట్టపై దుండగులు తవ్వకాలు చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకోవడంతో మెట్టపైకి ఎవరూ వెళ్లడం లేదని, గతంలో కొందరు మండప ప్రదేశంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేశారని గుర్తుచేశారు. 2, 3 రోజులుగా రాత్రివేళ తవ్వుతున్నారని, అక్కడ పసుపు, కుంకుమ, గొయ్యి తీసిన ఆనవాళ్లు ఉన్నాయన్నారు.
Sorry, no posts matched your criteria.