India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం పెట్రోల్ బంక్ యజమానులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బాటిళ్లలో పెట్రోలు వేయకూడదని ఆదేశించారు. పెట్రోల్, డీజిల్ను వాహనాలకు మాత్రమే సరఫరా చెయ్యలన్నారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు నిబంధనలు అమలులో వుంటాయన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరించారు.

సాధారణ ఎన్నికలు – 2024లో భాగంగా కౌంటింగ్ ప్రక్రియ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్ కిషోర్ అధికారులకు సూచించారు. ఆదివారం కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఎస్పీ కృష్ణారావుతో కలిసి ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్ల గురించి అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల కౌంటింగ్ కోసం అన్ని విధాల సన్నద్ధంగా ఉండాలన్నారు.

ఈ నెల 24వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఇప్పటి వరకు ఫీజు చెల్లించ లేకపోయిన విద్యార్థులు సోమవారం చెల్లించాలని ఆర్ఐవో ఆదూరి శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆన్లైన్లో తత్కాల్ పథకం కింద రూ.3000 అపరాధ రుసుముతో కలిపి ఫీజు చెల్లించడానికి ఇంటర్ బోర్డు అవకాశం కల్పించిందన్నారు. SHARE IT..

తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో టెక్కలికి చెందిన మల్లిపెద్ది ప్రణవ్ సాయి అనే విద్యార్థి 62వ ర్యాంకు సాధించాడు. తూర్పుగోదావరి జిల్లాలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదివిన ప్రణవ్ సాయి తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో 132.4 మార్కులు సాధించి ఇటీవల విడుదలైన ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 62వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచాడు. విద్యార్థిని పలువురు స్థానికులు అభినందించారు.

మామిడి వ్యాపారులు కొంతమంది చట్టవిరుద్ధంగా కాల్షియం కార్బైడ్ను ఉపయోగించి కాయలను కృత్రిమంగా పండించి మార్కెట్లో అమ్ముతున్నారని జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యులు గొట్టిముక్కల అనంతరావు అన్నారు. ఆదివారం స్థానిక కన్స్యూమర్ వాయిస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అనంతరావు మాట్లాడారు. కాల్షియం కార్బైడ్ అనేది ప్రమాదకరమైన రసాయనమని, దాని వలన మనిషి ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని హెచ్చిరించారు.

చీరాల నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలపై కేసు నమోదు చేసి పలువురి అరెస్టు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కూటమి అభ్యర్థి కొండయ్య వాహనంపై దాడి ఘటనపై ఆరుగురిని, మరొక ఘటనపై ఐదుగురిని, అలాగే చీరాల వేటపాలెం మండలంలో చోటు చేసుకున్న ఘటనలపై ఐదు కేసులు నమోదు చేసి 61 మందిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. శాంతిభద్రతలకు ఎవరైనా విగాథం కలిగిస్తే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

వచ్చే నెల 4న ఎన్నికల ఫలితాలు వెలువడున్న నేపథ్యంలో పోలీస్ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ మురళీకృష్ణ ఆదేశించారు. అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ర్యాలీలు, ఊరేగింపులు పండగల్లో స్టేజ్ ప్రోగ్రాములకు అనుమతులు లేవన్నారు. పెట్రోల్ బంకులలో లూజ్ పెట్రోల్ అమ్మకాలు అనుమతించకూడదన్నారు.

ఈ నెల 24న DEECET-2024 పరీక్షను గాజులరేగలో ఐయాన్ డిజిటల్ జోన్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ప్రేమకుమార్ తెలిపారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12.30 నిమిషాల వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్లను cse.ap.gov.in వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు.

పల్నాడు జిల్లా కలెక్టర్గా లత్కర్ శ్రీకేశ్ బాలాజీ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. జయింట్ కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ ఇతర అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ.. ఎలక్షన్ కమిషన్ ఆదేశానుసారం జిల్లా ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించడం జరిగిందని, ఈ అవకాశాన్ని ఛాలెంజ్గా తీసుకొని పార్టీలకు అతీతంగా విధులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా ఎర్నాకులం (ERS), హెచ్. నిజాముద్దీన్(NZM) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR) పేర్కొంది. నం.06071 ERS- NZM ట్రైన్లను జూన్ 7 నుంచి 28 వరకు ప్రతి శుక్రవారం, నం.06072 NZM- ERS ట్రైన్లను జూన్ 10 నుంచి జూలై 7 వరకు ప్రతి సోమవారం నడపనున్నట్లు SCR తెలిపింది. ఈ ట్రైన్లు ఏపీలో విజయవాడతో పాటు ఒంగోలు, చిత్తూరు, తిరుపతి తదితర స్టేషన్లలో ఆగుతాయి.
Sorry, no posts matched your criteria.