India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

హజ్ యాత్ర నిర్వహణపై కృష్ణా జిల్లా కలెక్టర్ DK బాలాజీ సంబంధిత అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ అంశంపై తాజాగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 25 నుంచి 30 వరకూ గన్నవరం మండలం కేసరిపల్లిలోని జామియా మసీదు వద్ద హజ్ యాత్రికులకై ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. ఈ శిబిరం ద్వారా హజ్ యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

భారతీయ వాయుసేనలో అగ్ని వీర్ వాయు సైనికుల ఉద్యోగం కొరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు, జిల్లా సైనిక సంక్షేమ అధికారిని గుణశీల శనివారం తెలిపారు. పదవ తరగతి తస్సమానమైన అర్హత కలిగి ఉండాలన్నారు. ఫ్లూట్, కీబోర్డ్, పీయానో ఏదైనా సంగీత ప్రావీణ్యత కలిగి ఉండాలన్నారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో ఆసక్తిగల యువకులు మే 22 నుంచి జూన్ 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

ఈ నెల 21 అనగా మంగళవారం నాడు అండర్-16 బాలుర క్రికెట్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఆంధ్రా క్రికెట్ సంఘం జిల్లా కార్యదర్శి ఎంఎల్ఎన్ రాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక పోటీలకు హాజరు కానున్న క్రీడాకారులు స్టడీ, ఆధార్ కార్డులు పట్టుకొని ఆరోజు ఉదయం 6.30 గంటలయ్యేసరికి విజ్జీ మైదానంలో ఉండాలని పేర్కొన్నారు.

ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నూజివీడు నుంచి ఏలూరు వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ మీర్జాపురం వద్దకు రాగానే టైర్ పేలి పోవడంతో అదుపుతప్పి హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు వస్తున్న ఆటోను ఢీ కొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

హీరో శ్రీకాంత్ ఆదివారం అనంతపురం నగర పర్యటన వాయిదా పడింది. నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఓ ప్రైవేట్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించాల్సి ఉంది. అయితే ఎన్నికల నియమావళి, 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో పోలీసుల అనుమతి లభించలేదు. ఈ కారణంగా శ్రీకాంత్ పర్యటన వాయిదా పడినట్లు ఆయన అనుచరులు తెలిపారు.

నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో అందుబాటులో ఉన్న వివిధ ట్రేడ్లలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెంకటేశ్వరపురం బాలికల ఐటీఐ ప్రిన్సిపల్ రిజియ తెలిపారు. విద్యార్థులు జూన్ 10లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న కోర్సులు, సీట్లు తదితర వివరాల కోసం సమీపంలోని ఐటీఐ కాలేజీలను సంప్రదించాలని కోరారు.

బ్రహ్మంగారిమఠంలో ఘోర ప్రమాదం జరగగా, ఒకరు మృతి చెందారు. గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన ఇంద్ర బాబు తన సతీమణి విజయలక్ష్మితో కలిసి బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవాలను చూడడానికి శుక్రవారం మఠం వచ్చారు. రాత్రి ఓ అన్నదాన సత్రం వద్ద పడుకుని ఉండగా హైదరాబాద్ కు చెందిన కారు డ్రైవర్ కారు ఆన్ లో ఉంచి కిందకు దిగాడు. కారులో ఉన్న బాలుడు గేర్ వేయడంతో కారు ఇంద్ర బాబుపైకి దూసుకెళ్లి అక్కడికక్కడే మృతి చెందారు.

కనిగిరి దేవాంగ నగర్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. ఒంగోలు నుంచి కనిగిరి వైపు వస్తున్న కారు, కనిగిరి నుంచి కాశిరెడ్డి కాలనీకి వెళ్తున్న ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న దేవాంగ నగర్కు చెందిన బత్తుల విష్ణు (57) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ జరిపించాలని MLA చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన నిన్న తిరుపతి కలెక్టర్ను కలిశారు. పాకాల మండలం నేలదానిపల్లి, రామచంద్రాపురం మండలం చిన్నరామాపురం, చంద్రగిరి మండలం ఎగువ కాశిపెంట్ల, కల్ రోడ్డ్ పల్లిలో తిరిగి ఎన్నికల్లు నిర్వహించాలని కోరారు. పోలింగ్ సిబ్బంది, ఏజెంట్ల తరఫున ఫిర్యాదులు లేకపోవడంతో తాము ఏమీ చేయలేమని కలెక్టర్ చెప్పారని సమాచారం.

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు పెట్రోల్ బంకు వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు వెళ్తున్న లారీని, కనిగిరి నుంచి వస్తున్న బస్సు వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. పది మందికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.