India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి పలువురు వైసీపీ కార్పొరేటర్లు గురువారం ఎమ్మెల్యే సుజనా చౌదరిని కలిశారు. కార్పొరేటర్లు రాజేశ్, మహదేవ్ అప్పాజీ, అర్షద్, నరేంద్ర, రత్నకుమారి, లావణ్య, ఆదిలక్ష్మి ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విజయవాడ వైసీపీ అగ్రనాయకత్వం తమను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమాను నిహారిక కొణిదెల నిర్మించారు. శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ పాలకమండలి సభ్యురాలు పేడాడ రమణి కుమారి చిన్న కుమారుడు సందీప్ సరోజ్ ఈ సినిమాతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. గోదావరి జిల్లాలో 11 మంది యువకుల నేపథ్యంలో ఈ సినిమాను దర్శకుడు యదు వంశీ తెరక్కెకించారు. పలువురు ఆయనకు శుభకాంక్షలు తెలుపుతున్నారు.

అనంతపురం జిల్లా గుత్తి జీఆర్పీ పరిధిలోని రాయలచెరువు రైల్వే స్టేషన్ వద్ద రైల్వే కూలీ (ప్యాకింగ్ మిషన్ కూలీ) మనోహర్(23) గురువారం తెల్లవారుజామున రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్పీ ఎస్ఐ నాగప్ప చెప్పారు. నంద్యాల జిల్లా బేతంచెర్లకు చెందిన మనోహర్ కొన్ని రోజులుగా గుత్తి జీఆర్పీ పరిధిలో రైల్వే పనులు చేస్తున్నాడు. అయితే అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

గుత్తి జీఆర్పీ పరిధిలోని రాయలచెరువు రైల్వే స్టేషన్ వద్ద రైల్వే కూలి (ప్యాకింగ్ మిషన్ కూలి) మనోహర్(23) గురువారం తెల్లవారుజామున రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్పీ ఎస్ఐ నాగప్ప చెప్పారు. నంద్యాల జిల్లా బేతంచెర్లకు చెందిన మనోహర్ కొన్ని రోజులుగా గుత్తి జీఆర్పీ పరిధిలో రైల్వే పనులు చేస్తున్నాడు. అయితే అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఉమ్మడి అనంత జిల్లాలోని జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి నిధులు కేటాయిస్తూ రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గుత్తి-తాడిపత్రి 67వ జాతీయ రహదారికి రూ.15 కోట్లు, NH42 రాప్తాడు-బత్తలపల్లి మధ్య రూ.15 కోట్లు, NH42 కళ్యాణదుర్గం- మోలకమురు మధ్య రూ.29 కోట్లు, మరిన్ని రోడ్లకు నిధులు మంజూరు చేసింది.

ఏయూ సైన్స్ కళాశాల పరిధిలో న్యూక్లియర్ ఫిజిక్స్, బయో కెమిస్ట్రీ, అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మైక్రోబయాలజీ, మెరైన్ బయాలజీ అండ్ ఫిషరీస్, బొటనీ, బయోటెక్నాలజీ, కోస్టల్ ఆక్వాకల్చర్, హ్యూమన్ జెనెటిక్స్, అప్లైడ్ జియాలజీ, మెరైన్ బయోటెక్నాలజీ, మీటీరియాలజీ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేశారు. పరీక్షల ఫలితాలను ఏయూ వెబ్ సైట్లో పొందుపరిచారు.

ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లా ప్రజలకు దొంగలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. బుధవారం రాత్రి రూరల్ పరిధిలోని దర్గామిట్టలోని ఓ ఇంట్లో సుమారు 2.3 లక్షల నగదు దోచుకెళ్లారు. అదేవిధంగా వేంకటేశ్వర పురంలోని విజయ డెయిరీ మాజీ ఉద్యోగి గోళ్ళ సుబ్బారావు ఇంట్లో బంగారం, వెండి, నగదు మొత్తం కలిపి రూ.10 లక్షల విలువ గల సొత్తు చోరీ జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

అమలాపురం నియోజకవర్గానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయాలని అమలాపురం ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు మంత్రి నారా లోకేశను కోరారు. ఈ మేరకు మంత్రి లోకేశ్ను రాష్ట్ర సచివాలయంలో ఆయన కలిసి పలు సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. అదే విధంగా అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఆయన మంత్రి నారా లోకేశ్కు పలు విషయాలను తెలియజేశారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ కళాశాల పరిధిలోని ఎం.కామ్ మూడవ సెమిస్టర్, ఎం.ఏ ఏన్షియంట్ హిస్టరీ ఆర్కియాలజీ మొదటి సెమిస్టర్ రీవాల్యుయేషన్, ఎంబీఏ (బి.ఎఫ్.ఎస్) నాలుగో సెమిస్టర్, ఎంబీఏ (ఆర్.ఎం) 4వ సెమిస్టర్, ఎంబీఏ (ఎఫ్.టి) నాలుగో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఎంబీఏ విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోగా రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవాలి.

ప్రయాణీకుల రద్దీ మేరకు శ్రీకాకుళం, పలాస మీదుగా తిరునల్వేలి – షాలిమార్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. నం.06087 TEN- SHM ట్రైన్ను ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 9 వరకు, నం.06088 SHM- TEN ట్రైన్ను ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 7 వరకు పొడిగించినట్లు SCR తెలిపింది. ఈ ట్రైన్లు ఏపీలో విజయనగరం, దువ్వాడ, రాజమండ్రి,విజయవాడ తదితర స్టేషన్లలో ఆగుతాయని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.