India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విజయనగరంలోని ఓ ప్రైవేట్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా పని చేస్తున్న ప్రవీణ్ కుమార్ ఖాతాదారులు చెల్లించిన సొమ్మును బ్యాంక్లో జమ చేయకుండా సొంత అవసరాలకు వాడేసుకున్నారు. హోమ్ లోన్లు తీసుకున్న ఖాతాదారులు చెల్లించిన డబ్బులు సుమారు రూ.34 లక్షలు వాడేసుకున్నారు. ఇది గుర్తించిన బ్యాంక్ యాజమాన్యం వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ప్రవీణ్ కుమార్ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామని S.I హరిబాబు తెలిపారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని బిఆర్క్ సెకెండ్ ఇయర్ రెండో సెమిస్టర్ పరీక్షలను ఆగస్టు ఒకటి నుంచి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ రిజిస్ట్రార్ (పరీక్షలు) జె.రత్నం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. సబ్జెక్టుల వారిగా పరీక్షా తేదీలను ఆంధ్ర విశ్వవిద్యాలయం వెబ్ సైట్లో ఉంచినట్లు వెల్లడించారు.

మంత్రి నారా లోకేశ్ సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. సాధారణంగా తెల్ల చొక్కాతో కనిపించే ఆయన ఇవాళ పసుపు చొక్కాలో మెరిశారు. ఆయన లాగే కొందరు పసుపు దుస్తులతో రాగా, మరికొందరు కండువాలతో సమావేశాలకు హాజరయ్యారు. మరోవైపు, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తుండగా, వైసీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. మంత్రులు పయ్యావుల, సవిత, సత్యకుమార్ యాదవ్ ముందు వరుసలో కూర్చుకున్నారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. అలాగే జిల్లాకు అవసరమైన ప్రాజెక్టులు, వివిధ పనులపై అసెంబ్లీ వేదికగా గళం విప్పేందుకు జిల్లా ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు.

బారాషాహీద్ దర్గాలో రొట్టెల పండుగకు సమర్థవంతంగా విధులు నిర్వహించిన సిబ్బందిని ఎస్పీ జి.కృష్ణకాంత్ అభినందించారు. 2వేల మంది పోలీసు సిబ్బంది 24 గంటలూ విధుల్లో ఉంటూ దర్గాకు విచ్చేసిన భక్తులు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేశారన్నారు. రద్దీలో తప్పిపోయిన 472 మంది చిన్నారులకు సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించామని చెప్పారు. క్రైమ్ పార్టీ పోలీసులు 17 మంది జేబు దొంగలను అదుపులోకి తీసుకున్నారన్నారు.

ధవలేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయిందని డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. మంగళవారం నాటికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందన్నారు. సోమవారం జిల్లా, మండల స్థాయి ప్రత్యేకాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి వరదలపై సమీక్షించారు. భద్రాచలం నుంచి ధవలేశ్వరం బ్యారేజీకి భారీగా వరద వస్తుందన్నారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు సిద్ధంగా ఉంచాలన్నారు.

కొనకనమిట్ల మండలానికి చెందిన 108 వాహనం ఈనెల 10న కనిగిరి మున్సిపాలిటీలోని టకారిపాలెం వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొనగా అతడు మృతి చెందాడు. ఆ అంబులెన్స్కు ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ లేకపోవడంతో కనిగిరి పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. డ్రైవర్పై కేసు నమోదు చేశారు. జిల్లాలోని పదుల సంఖ్యలో అంబులెన్స్లకు ఈ ధ్రువపత్రాలు లేవని పలువురు చెప్తున్నారు.

టీడీపీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నుంచి మూడో సారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ రోజు నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆయన 20 ఏళ్ల తర్వాత అధ్యక్షా..అని పలకబోతున్నారు. 1994, 1999 ఎన్నికల్లో గెలిచిన ఆయన తిరిగి 2024 ఎన్నికల్లో విజయం సాధించారు. సర్వేపల్లి నుంచి మూడో సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాయకుడు కూడా సోమిరెడ్డే.

మామిడి శాస్త్రీయ నామం మాంజిఫెర ఇండికా. మామిడి భారతదేశ జాతీయ పండు. ప్రతి ఏడాది జూలై 22న జాతీయ మామిడి దినోత్సవంగా జరుపుకుంటున్నాము. పండ్లలో రాజుగా మామిడిని పిలుస్తారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా భౌగోళిక పరిస్థితులు మామిడి సాగుకు ఎంతగానో అనుకూలం. జిల్లాలో మామిడి ఉత్పత్తులకు మంచి వ్యాపారం, మార్కెటింగ్ ఉంది. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున సరఫరా అవుతుంది. మీకు నచ్చిన మామిడి రకం కామెంట్ చేయండి.

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 17 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తమ గళం వినిపించనుండగా.. వారిలో నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్ మంత్రులుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మరి మీ నియోజకవర్గ MLA అసెంబ్లీలో ఏ సమస్యపై ప్రస్తావించాలనుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి.
Sorry, no posts matched your criteria.