Andhra Pradesh

News July 23, 2024

బాపట్ల: ‘స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు’

image

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు బాపట్ల జిల్లాలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌ను ఆయన పరిశీలించి, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించడానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ తుషార్ డూడి, జాయింట్ కలెక్టర్ సుబ్బారావు, ఆర్డీవో రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

News July 23, 2024

ఆసుపత్రుల నిర్మాణ పనులపై ప.గో కలెక్టర్ సమీక్ష

image

పాలకొల్లు, ఆకివీడు ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణ పనులపై సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లతో ప.గో కలెక్టర్ చదలవాడ నాగరాణి సమీక్షించారు. సోమవారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ నందు ఆమె మాట్లాడుతూ.. ఆగస్టు 5 నాటికి ఎట్టి పరిస్థితుల్లో పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి పనులను పూర్తి చేయాలన్నారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆసుపత్రుల నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

News July 22, 2024

కృష్ణా: TODAY TOP NEWS

image

*జగ్గయ్యపేటలో సందడి చేసిన హీరోయిన్
*బ్రాహ్మణిపై అనుచిత వ్యాఖ్యలు.. కేసు నమోదు
* విజయవాడ: యువతి ప్రైవేట్‌ ఫొటోలు షేర్‌
* నూజివీడు IITలో నేడు కౌన్సెలింగ్
* విజయవాడలో నిత్య పెళ్లికొడుకు అరెస్ట్
*కొడాలి నాని PAపై దాడి
*నూజివీడు IIIT విద్యార్థులకు లోకేశ్ భరోసా
* ఎన్టీఆర్: ‘బాబాయి హత్య గుండెపోటుగా చిత్రీకరణ’

News July 22, 2024

గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు కలెక్టర్ సూచనలు

image

భద్రాచలంలో నీటిమట్టం పెరిగిందని, రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయిన నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప.గో కలెక్టర్‌ CH.నాగరాణి సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం వివిధ శాఖల అధికారులతో సమావేశమైన కలెక్టర్.. గోదావరి వరద పరిస్థితిపై సమీక్షించారు. భద్రాచలం నుంచి వదులుతున్న నీటితో వశిష్ట గోదావరి నీటిమట్టం గంట గంటకూ పెరుగుతుందన్నారు. ముంపు బాధితులకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.

News July 22, 2024

గుంటూరు: TODAY TOP NEWS

image

*వైసీపీకి మాజీ MLA రాజీనామా
*అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ ఎంట్రీ
*అసెంబ్లీ వద్ద జగన్ ఆగ్రహం
*అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన జగన్
*నరసరావుపేట: 16 బైకులు స్వాధీనం
*వినుకొండ హత్యపై షర్మిల సంచలన వ్యాఖ్యలు
*జగన్‌పై మరోసారి ఫైరైన MLA జీవీ
*నగరం: రూ.60 లక్షలు మాయం
*అమెరికాలో తెనాలి వైద్యురాలి మృతి
*అసెంబ్లీకి పసుపు చొక్కాతో మంత్రి లోకేశ్

News July 22, 2024

శ్రీకాకుళం జిల్లాలో TODAY TOP NEWS

image

➣ ఈనెల 23 నుంచి జిల్లా వ్యాప్తంగా ఆధార్ క్యాంపులు➣ టెక్కలిలో టీడీపీ ఫ్లెక్సీల చించివేత➣ వరద నీటిపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ స్వప్నిల్ ➣ కేసులకు భయపడేవారు ఎవరూ లేరు: స్పీకర్ తమ్మినేని➣ఎచ్చెర్లలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య➣ మీకోసం పరిష్కార వేదికకు 151 అర్జీలు➣ పోటీ పరీక్షల్లో రాణించి జిల్లా ఖ్యాతిని పెంచాలి: రామ్మోహన్➣ ఐటీడీఏ పీవోగా రాహుల్ కుమార్ రెడ్డి➣ జలుమూరులో రూ.9 లక్షల నగదు చోరీ

News July 22, 2024

కోనసీమ జిల్లాలో రేపు విద్యాసంస్థలకు సెలవు

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో భారీ వర్షాల వల్ల గోదావరికి వరద పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు అమలాపురంలోని కలెక్టరేట్‌ నుంచి సోమవారం రాత్రి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తల్లిదండ్రులు వారి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, వాగులు, చెరువుల వైపు వెళ్లనివ్వొద్దని కలెక్టర్ సూచించారు. SHARE IT..

News July 22, 2024

కడప: డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి విశేష స్పందన

image

కడప కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు కలెక్టర్‌ శివ శంకర్ లోతేటి నిర్వహించిన ఈ కార్యక్రమంలో 13 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలను విన్నవించారు. ఫిర్యాదులకు సంబంధించిన శాఖల అధికారులతో కలెక్టర్ మాట్లాడి.. తక్షణమే చర్యలు తీసుకోవాలని వారిని ఆదేశించారు.

News July 22, 2024

బొమ్మనహాల్: ఎగువ కాలువకు నీటిని విడుదల చేసిన అధికారులు

image

బొమ్మనహాల్ మండలంలోని తుంగభద్ర జలాశయం నుంచి సోమవారం ఎగువ కాలువకు తుంగభద్ర బోర్డు సెక్రటరీ వారికి రెడ్డి, ఎస్ ఈ శ్రీకాంత్ రెడ్డి, ఈఈ రవిచంద్ర నీటిని విడుదల చేశారు. మొదట 100 క్యూసెక్కుల నీటిని ఎగువ కాలువకు విడుదల చేశారు. గంట గంటకు పెంచుకుంటూ పోతూ 500 క్యూసెక్కుల నీటిని వదులుతామని తుంగభద్ర బోర్డ్ అధికారులు తెలిపారు.

News July 22, 2024

గుంటూరులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

గుంటూరు శివారు ప్రాంతంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు సమీపంలోని ఉప్పలపాడు-తగరపాలెం అడ్డరోడ్డు దగ్గర గోపాలకృష్ణ రోడ్డు దాటుతున్నాడు. వేగంగా వచ్చిన లారీ అతణ్ని ఢీకొనడంతో గోపాలకృష్ణ రెండు టైర్లకింద నలిగి అక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పెదకాకాని పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.