Andhra Pradesh

News May 18, 2024

ఆగి ఉన్న గూడ్స్ రైలు బొగ్గు వ్యాగన్ నుంచి పొగలు

image

గజపతినగరం రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలు బొగ్గు వ్యాగన్ నుంచి శుక్రవారం సాయంత్రం పొగలు రావడంతో విజయనగరం అగ్నిమాపక కేంద్రం లీడింగ్ ఫైర్ మేన్ పి.మహేష్ సిబ్బంది పొగలను నివారించారు. రాయగడ నుంచి విశాఖ వెళ్తున్న గూడ్స్ రైలు గురువారం రాత్రి వచ్చింది. లోకో పైలట్ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో వ్యాగన్ నుంచి పొగలు రావడంతో అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఈ మేరకు పొగలను నివారించారు.

News May 18, 2024

సీఈసీతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్

image

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. విజయవాడ నుంచి నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో విశాఖ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డా. ఏ మల్లికార్జున, పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈవీఎంలు భద్రపరచడం, ఎలక్షన్ కౌంటింగ్ తదితర అంశాలపై చర్చించారు.

News May 18, 2024

ఓట్ల లెక్కింపుకు అన్ని విధాలా సన్నద్ధం కావాలి: కలెక్టర్

image

ఓట్ల లెక్కింపుకు అన్ని విధాలా సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన నెల్లూరు నుంచి రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులతో వెబెక్స్ సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ నిర్వహణకు సంబంధించిన ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.

News May 18, 2024

గుంటూరు: స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన పోస్టర్ బ్యాలెట్లు

image

గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ (ఈటీపిబిఎస్) ద్వారా ఓటింగ్ చేసి, పోస్ట్ చేసిన కవర్లను శుక్రవారం కలక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి పోస్టల్ శాఖాధికారులు అందించారు. కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పర్యవేక్షణలో పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో ట్రెజరీ కార్యాలయంలోని స్ట్రాంగ్‌ రూములో భద్రపరిచినట్లు తెలిపారు.

News May 18, 2024

కృష్ణా జిల్లాలో 18.9మి.మీల సరాసరి వర్షపాతం

image

అల్పపీడన ద్రోణి ప్రభావంతో కృష్ణా జిల్లాలో 18.9మి.మీల సరాసరి వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. గడిచిన 24గంటల్లో ఈ వర్షపాతం నమోదైందని అన్నారు. అత్యధికంగా అవనిగడ్డలో 49.8 మి.మీలు నమోదవ్వగా అత్యల్పంగా గన్నవరంలో 4.4మి.మీలు నమోదైందని తెలిపారు. జిల్లాలోని 25 మండలాల్లోనూ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు.

News May 17, 2024

నరసన్నపేట: కలెక్టర్‌కు ప్రత్యేక ఆహ్వానం

image

నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలకు జిల్లా కలెక్టర్ మనజీర్ జీలాని సమూన్‌కు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఆలయ కమిటీ సభ్యులతో పాటు ఆలయ ధర్మకర్త పొట్నూరు కృష్ణ ప్రసాద్ ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకొని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.

News May 17, 2024

మన గుంటూరు గురించి ఇది తెలుసా..!

image

దేశభాషలందు తెలుగు లెస్స!.. దీనిని శ్రీకృష్ణదేవరాయలు మొదట అన్నారని మనకి తెలుసు. కానీ ఆయన 16వ శతాబ్దానికి చెందినవారు. కానీ ఈ వాక్యాన్ని మొట్టమొదటిసారి 15వ శతాబ్దంలో మన గుంటూరు జిల్లాకు చెందిన వినుకొండ వల్లభ రాయుడు “జనని సంస్కృతంబు సకల భాషలకును, దేశభాషలందు తెలుగు లెస్స” అని క్రీడాభిరామం అనే ప్రముఖ వీధి నాటకంలో రాశారు. కాగా వినుకొండ వల్లభరాయల పూర్వులు గుంటూరు సీమలోని వినుకొండ వాస్తవ్యులు.

News May 17, 2024

నంద్యాల: అదృశ్యమైన మహిళ.. రైలు కిందపడి మృతి

image

బేతంచెర్లకు చెందిన వై.లక్ష్మీదేవి ఈనెల 16న అదృశ్యం కాగా 17న కడప జిల్లా ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్ సమీపంలో ఆమె మృతదేహాం లభ్యమైందని బంధువులు తెలిపారు. మతిస్థిమితం లేని ఆమె కోయిలకుంట్ల నుంచి ట్రైన్‌కు వెళ్లి ఉంటుందని వారు భావిస్తున్నారు. ప్రమాదవశాత్తు రైలు కిందపడిందా.. ఆత్మహత్య చేసుకుందా అనేది తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదుచేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని ప్రొద్దుటూరుకు తరలించారు.

News May 17, 2024

టీడీపీ ఆత్మీయ సమావేశాన్ని అడ్డుకున్న పోలీసులు

image

నల్లజర్ల మండలం అనంతపల్లిలో శుక్రవారం ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా ఆత్మీయ సమావేశం పెట్టకూడదని హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో 144 సెక్షన్ అమలులో ఉందని, ఇలాంటి సమయంలో ముందస్తు అనుమతులు లేకుండా ఎటువంటి సమావేశాలకు అనుమతి లేదని కొవ్వూరు డీఎస్పీ రామారావు తెలిపారు.

News May 17, 2024

అప్రమత్తంగా ఉండండి: డీకే బాలాజి

image

కృష్ణా జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ, పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా రెవెన్యూ అధికారికి చంద్రశేఖర రావుతో కలిసి రెవెన్యూ, పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.