Andhra Pradesh

News August 7, 2024

ఇడుపులపాయ IIITలో చీరాల విద్యార్థిని ఆత్మహత్య

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థిని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఆత్మహత్య చేసుకుంది. చీరాలకు చెందిన యువతి(17) ఇడుపులపాయలో ఉన్న ఒంగోలు క్యాంపస్‌లో చదువుతోంది. ఈక్రమంలో మంగళవారం రాత్రి బాత్ రూంలో ఉరేసుకుంది. విద్యార్థులు, సిబ్బంది గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News August 7, 2024

ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య

image

వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఉన్న ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో విద్యార్థిని జమీషా ఖురేషి (17)అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు ట్రిపుల్ ఐటీ అధికారులు తెలిపారు. మంగళవారం అర్థరాత్రి క్యాంపస్‌లోని బ్రాత్ రూంలో తన చున్నీతో ఉరి వేసుకొన్న సంఘటనను విద్యార్థులు, సిబ్బంది గమనించి అధికారులకు సమాచారం అందించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 7, 2024

కార్వేటినగరం: డీఎల్ఈడీ ఫెయిల్ వారికి గమనిక

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రైవేటు డీఎల్ఈడీ కాలేజీల్లో 2018-20 రెగ్యులర్, స్పాట్ అడ్మిషన్లో ఫెయిల్ అయిన విద్యార్థులు, ఆ కళాశాల మూతపడినట్లయితే కార్వేటినగరం ప్రభుత్వ డైట్ కళాశాలను సంప్రదించాలని ప్రిన్సిపల్ శేఖర్ సూచించారు. ప్రభుత్వ డైట్ కళాశాలలో సంప్రదించి పరీక్ష ఫీజు కట్టి రాయవచ్చన్నారు. మరిన్ని వివరాలకు కార్వేటినగరం డైట్ కాలేజీని సంప్రదించాలని సూచించారు.

News August 7, 2024

తూ.గో.: మురుగు కాల్వల అభివృద్ధికి రూ.9.8 కోట్లు

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మురుగు కాలువల్లో పెరిగిపోయిన గుర్రపు డెక్క, తూడు తొలగింపునకు ప్రభుత్వం రూ.9.8 కోట్లు నిధులు మంజూరు చేసిందని అధికారులు తెలిపారు. ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ ద్వారా ఈ నిధులను మంజూరు చేశారు. కోనసీమ జిల్లాలో 76 పనులను రూ.7.1 కోట్లు, కాకినాడ జిల్లాలో 22 పనులను రూ.1.9 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాలో ఒక పనికి రూ.80 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి.

News August 7, 2024

విజయనగరంలో ఈ నెల 9న జాబ్ మేళా

image

పట్టణంలోని స్థానిక మహారాజా కళాశాలలో ఈ నెల 9న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనశాఖ అధికారి అరుణ తెలిపారు. సంగీత మొబైల్స్, డెక్కన్ ఫైన్ కెమికల్స్, రిలయన్స్ జియో ఫైబర్, క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ లిమిటెడ్ తదితర సంస్థల్లో కొలువుల భర్తీకి ఎంపికలుంటాయని చెప్పారు. 18 నుంచి 35 ఏళ్ల లోపు వారు అర్హులని.. నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News August 7, 2024

రాయచోటి: ఒంటెల అక్రమ రవాణా

image

అన్నమయ్య జిల్లాలో ఒంటెల వ్యాపారం కలకలం రేపుతోంది. సంబేపల్లె పోలీసుల వివరాల ప్రకారం.. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ నుంచి ఒంటెలను తెచ్చి రాయచోటి, మదనపల్లె, పీలేరు, బెంగళూరు ప్రాంతాల్లో విక్రయిస్తూన్నట్లు తెలిసింది. రాయచోటి వద్ద గుట్టల్లో ఉంచిన 16 ఒంటెలను రక్షించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. రాయచోటికి చెందిన ఓ బడా వ్యాపారి ఈ విక్రయాలు జరుపుతున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేశామని SI రామకృష్ణ తెలిపారు.

News August 7, 2024

అవినీతి నిరూపిస్తే తప్పుకుంటా: పీలేరు సర్పంచ్

image

తనపై <<13792038>>అవినీతి <<>>ఆరోపణలు నిరూపిస్తే పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధమని పీలేరు సర్పంచ్ జీనత్ షఫీ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ‘నేను పదవిలోకి వచ్చినప్పటి నుంచే పంచాయతీ అప్పుల్లో ఉంది. అయినా పారిశుద్ధ్య కార్యక్రమాలు, తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నా. పార్టీలకు అతీతంగా బాధ్యతతో పాలన చేశా’ అని చెప్పారు. పీలేరు రూ.కోట్లలో అవినీతి జరిగిందని నిన్న ఎంపీడీవో ప్రకటించిన విషయం తెలిసిందే.

News August 7, 2024

చీరాలలో కలకలం రేపుతున్న వరుస హత్యలు

image

వరుస హత్యలతో చీరాల అట్టుడుకుతోందని 2 నెలల వ్యవధిలో 4 హత్యలు జరిగాయని స్థానికులు భయపడుతున్నారు. ఈపూరుపాలెంలో ఇద్దరు మహిళలు, చీరాల పట్టణంలో ఇద్దరు యువకులు హతమయ్యారు. ఈపూరుపాలెంలో సుచరిత అనే యువతి హత్యాచారానికి గురవ్వగా, రిటైర్డ్ టీచర్ లలితమ్మ దుండగుడి కత్తి దాడికి బలైంది. చీరాలలో సంతోష్ అనే కర్రీస్ పాయింట్ యజమాని, <<13794466>>తాజాగా ఈపూరుపాలెం యువకుడు ఆరిఫ్ హతమవ్వగా<<>> పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు.

News August 7, 2024

ఉరవకొండ: పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం

image

ఉరవకొండ : మండలంలోని నెరిమెట్ల గ్రామానికి చెందిన హనుమంతు అనే రైతు ఇంటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News August 7, 2024

VZM: అగమ్య గోచరంగా గృహ నిర్మాణాలు

image

ఏపీలో రెండవ అతిపెద్ద జగనన్న లేఅవుట్ విజయనగరం గుంకలాం లే అవుట్. సాక్షాత్తు మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ లేఔట్‌కు శంకుస్థాపన చేశారు. సుమారు 12 వేల గృహ నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రభుత్వం మారడం, కూటమి ప్రభుత్వం రావడంతో అసంపూర్తిగా మిగిలిపోయిన ఇక్కడ ఇళ్ల నిర్మాణాలపై తీవ్ర ప్రభావం పడింది. ఇక్కడ ఇళ్ల నిర్మాణా బిల్లులు విడుదల అవుతాయో, లేదోనన్న సందిగ్ధత నెలకొంది.