Andhra Pradesh

News May 17, 2024

మామిడి చెట్టుపై గుండెపోటు.. కిందపడి వ్యక్తి మృతి

image

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఉప్పలపాడులో విషాదం నెలకొంది. గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నల్లమిల్లి సత్తిరాజు కుమారుడు కృష్ణప్రసాద్ HYDలో ప్రైవేట్ జాబ్ చేస్తాడు. ఓటింగ్ కోసం స్వగ్రామానికి వచ్చిన కృష్ణప్రసాద్.. ఈ రోజు మామిడికాయలు కోయడానికి చెట్టెక్కాడు. కాయలు కోస్తున్న క్రమంలో గుండెపోటు రాగా పైనుంచి రాయిపై పడి, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

News May 17, 2024

బొండపల్లిలో ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి

image

బొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దేవుపల్లి గ్రామం జీపీ అగ్రహారం వద్ద పొలంలో ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతిచెందాడు. గంటా గురుమూర్తి (44) శుక్రవారం పొలానికి వెళ్లాడు. పొలం పనులు చేస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ట్రాక్టర్ కింద ఇరుక్కుపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. అతని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.

News May 17, 2024

వడమాలపేట: ఎమోషనల్ అయిన మంత్రి రోజా

image

వడమాలపేట మండలం గూళూరు చెరువులో ప్రమాదవశాత్తు నీట మునిగి గురువారం ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి చెందిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం మంత్రి రోజా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కాసేపు ఎమోషనల్ అయ్యారు. ధైర్యంగా ఉండాలని వారి కుటుంబ సభ్యులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి రోజాతో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News May 17, 2024

స్ట్రాంగ్ రూమ్‌లను కలెక్టర్, ఎస్పీ

image

కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలను ఎస్పీ కృష్ణకాంత్‌తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ జీ.సృజన పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. స్ట్రాంగ్ రూముల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఎదైనా సమస్య అనిపిస్తే తమకు సమాచారం అందించాలని తెలిపారు.

News May 17, 2024

చింతమనేని ప్రభాకర్ రావుపై కేసు నమోదు

image

దెందులూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ రావుపై పెదవేగి పోలీస్ స్టేషన్లో గురువారం కేసు నమోదైందని SI దుర్గాప్రసాద్ శుక్రవారం తెలిపారు. పెదవేగి మండలం కొప్పులవారిగూడెంలో టీడీపీ- వైసీపీ గొడవల నేపథ్యంలో రాజేష్ అనే వ్యక్తిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన చింతమనేని ప్రభాకర్ రావు అక్కడికి వెళ్లి రాజేష్‌ను తీసుకువెళ్లాడు. దీంతో పోలీసులు చింతమనేనిపై కేసు నమోదుచేశారు.

News May 17, 2024

పాడేరు మోదకొండమ్మ ఉత్సవాలు వాయిదా

image

జూన్ 9, 10, 11 తేదీల్లో పాడేరు మోదకొండమ్మ జాతర మహోత్సవాలు జరపడానికి నిర్ణయించారు. ఈనెల 19, 20, 21 తేదీల్లో మోదకొండమ్మ జాతర మహోత్సవాలు జరపడానికి ముందుగా నిర్ణయించి, ఏర్పాట్లు చేయగా, రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉండటంతో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు అధికారులు అనుమతులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఉత్సవాలను జూన్ నెలకు మార్చారు.

News May 17, 2024

కోడూరు: కృష్ణా నదిలో గుర్తు తెలియని మృత దేహం లభ్యం

image

మండలలోని ఉల్లిపాలెం గ్రామ సమీపాన కృష్ణా నదిలో గుర్తు తెలియని మృత దేహం లభ్యమైందని కోడూరు ఎస్ఐ శిరీష తెలిపారు. శుక్రవారం రాత్రి ఉల్లిపాలెం పడవల రేవు సమీపంలో మృతదేహం కని పంపించిందని స్థానికులు అందిన సమాచారం మేరకు మృతదేహాన్ని పరిశీలించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుని వయస్సు 40-45 సంవత్సరాలు ఉంటుందని, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఖననం చేశామని చెప్పారు.

News May 17, 2024

కర్నూలు: కరెంటు షాక్‌తో 11 ఏళ్ల బాలుడి మృతి

image

పెద్దకడబూరు మండలం చిన్నతుంబళం గ్రామానికి చెందిన చాకలి శివ(11) శుక్రవారం కరెంటు షాక్‌తో మృతిచెందాడు. చాకలి లక్ష్మి, రామాంజి కొడుకు శివ ఉదయం మిద్దెపైన వేలాడుతున్న కరెంటు వైర్ తాకడంతో షాక్ తగిలింది. కుటుంబ సభ్యులు వెళ్లి చూసేలోగా అప్పటికే శివ మృతిచెందాడు. కొడుకు మృతితో తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు.

News May 17, 2024

అర్ధరాత్రి శ్రీకాకుళంలో దారుణ హత్య

image

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని గూనపాలెంలో దారుణ హత్య జరిగింది. స్థానికంగా నివాసముంటున్న సీర సురేశ్ (34) గురువారం అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు అతడి గొంతు కోసి హతమార్చారు. మృతుడు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.

News May 17, 2024

తూ.గో.: జాతీయరహదారిపై ACCIDENT.. యువకుడు మృతి

image

డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం వద్ద 216వ నంబర్ జాతీయరహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడని ఎస్సై శ్రీనునాయక్ తెలిపారు. ఆత్రేయపురం మండలం ర్యాలీకి చెందిన బర్రె నాగరాజు (21) బైక్‌పై రావులపాలెం నుంచి మూలస్థాన అగ్రహారం వైపు వస్తుండగా కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.