Andhra Pradesh

News July 29, 2024

సారవకోట: త్వరలో ఉపాధి హామీ క్షేత్ర సహాయకుల పోస్టుల భర్తీ

image

సారవకోట మండలంలోని అంగూరు, అన్నుపురం, గొర్రిబంద క్షేత్ర సహాయకుల పోస్టుల భర్తీ ప్రక్రియ వచ్చే నెల 3వ తేదీలోగా పూర్తిచేయాలని ఉన్నతాధికారులు సూచించినట్లు ఉపాధిహామీ పథకం ఏపీవో నారాయణరావు తెలిపారు. అంగూరు క్షేత్ర సహాయకుడు మృతి చెందగా ఆ పోస్టు ఖాళీ అయ్యిందని, అన్నుపురం, గొర్రిబంద క్షేత్ర సహాయకులు ఇటీవల రాజీనామా చేసినట్లు చెప్పారు. కిడిమి పోస్టు ఖాళీగా ఉన్నప్పటికీ న్యాయస్థానంలో విచారణలో ఉందన్నారు.

News July 29, 2024

ప్రకాశం: NMMS మెరిట్ జాబితా విడుదల

image

గతేడాది డిసెంబర్‌లో జరిగిన NMMS పరీక్షలో ప్రతిభకనబరిచిన వారి జాబితాను deoprakasam.co.in వెబ్సైట్‌లో ఉంచినట్లు DEO సుభద్ర తెలిపారు. ఎంపికైన విద్యార్థులు వెబ్సైట్ నుంచి మెరిట్ కార్డును డౌన్‌‌లోడ్ చేసుకుని వారిపేరు, పుట్టినతేదీ, తండ్రి లేదా తల్లి పేరును సరిచూసుకోవాలన్నారు. వివరాలు సరిగా ఉన్నట్లయితే న్యూడిల్లీ వారి స్కాలర్షిప్ పోర్టల్‌లో ఆగస్టు 31లోగా అప్లోడ్ చేయాలన్నారు.

News July 29, 2024

పరారీలో పెద్దిరెడ్డి PAలు..?

image

సోమల మండలం ఆవులపల్లె దగ్గర 165 ఎకరాల భూమిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి PA శశిధర్ బలవంతంగా కాజేశారని కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ కోసం హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి అధికారులు వెళ్లారు. అరెస్ట్ భయంతో శనివారమే అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు అధికారిక PAగా పని చేసిన తుకారం విదేశాలకు పారిపోయారని తెలుస్తోంది. తిరుపతిలోని ఆయన నివాసంలో 12 రికార్డులు సీజ్ చేశారు.

News July 29, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాలో నేడు వర్షాలు పడే అవకాశం

image

ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో నేడు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలలో సైతం రేపు అక్కడక్కడ వర్షాలు పడతాయని APSDMA అధికారులు పేర్కొన్నారు.

News July 29, 2024

రాష్ట్ర స్థాయి పోటీలకు ప్రొద్దుటూరు విద్యార్థులు

image

నంద్యాలలో నేడు జరిగిన జిల్లా స్థాయి జంప్ రోప్ పోటీలలో ప్రొద్దుటూరులోని ఓ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు పసిడి, రజతం, కాంస్య పథకాలు సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ షేక్ ఇలియాస్ తెలిపారు. ఆగస్టు నెలలో మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగే రాష్ట్రస్థాయి జంప్ రోప్ పోటీలలో వీరు పాల్గొంటారని చెప్పారు. అనంతరం పాఠశాల సిబ్బంది విద్యార్థులను అభినందించారు.

News July 29, 2024

ఒలింపిక్స్ క్రీడాకారులకు అశోక్ గజపతిరాజు శుభాకాంక్షలు

image

ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఇండియా క్రీడాకారులకు కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఒలింపిక్‌ క్రీడాకారులకు మద్దతుగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తీసుకొచ్చిన చీర్‌ ఫర్‌ భారత్‌ సెల్ఫీపాయింట్‌ను ఆదివారం స్థానిక అశోక్‌ బంగ్లా కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఒలింపిక్స్‌లో భారత్‌ క్రీడాకారులు ఎక్కువ పతకాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

News July 29, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాలో నేడు వర్షాలు పడే అవకాశం

image

ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో సోమవారం అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలలో సైతం రేపు అక్కడక్కడ వర్షాలు పడతాయని APSDMA అధికారులు పేర్కొన్నారు.

News July 29, 2024

రౌడీ షీటర్లకు నంద్యాల ఎస్పీ వార్నింగ్

image

నంద్యాల జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లకు, సస్పెక్ట్ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఆళ్లగడ్డ, నంద్యాల, ఆత్మకూరు, డోన్ సబ్ డివిజన్ పరిధిలోని రౌడీ షీటర్లు ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నిబంధనలు పెడచెవిన పెట్టిన 15 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు తెలిపారు.

News July 29, 2024

కడప ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణ

image

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామని జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు తెలిపారు. ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలో ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని, వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని ప్రజలు ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు.

News July 29, 2024

మడకశిర: సీఎం పర్యటనలో కట్టుదిట్టమైన భద్రత

image

మడకశిర నియోజకవర్గంలో ఆగస్టు 1న సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్న సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. ఆదివారం ఎస్పీ మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని గుండుమలలో సీఎం బహిరంగ సభ నిర్వహిస్తున్నారని ఆ ప్రాంతంతో పాటు హెలిప్యాడ్ వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు.