Andhra Pradesh

News July 26, 2024

మార్కాపురం: పోలీస్ స్టేషన్ ఎదుటే దొంగతనం

image

మార్కాపురంలో అర్థరాత్రి దొంగలు రెచ్చిపోయారు. స్థానిక గడియారస్థంభం వద్ద ఉన్న హాల్ సేల్ పూల దుకాణంలో దొంగలు చోరీకి తెగబడ్డారు. దుకాణం షట్టర్ తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న రూ.1.50 లక్ష నగదు అపహరించినట్లు దుకాణ యజమాని ఖాజాహుస్సేన్ పోలీసులకు పిర్యాదు చేశాడు. దొంగతనం జరిగిన షాప్ ఎదురుగానే పోలీసు స్టేషన్ ఉండడం గమనార్హం. అయితే బాగా తెలిసిన వారే చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

News July 26, 2024

జొన్నాడ టోల్ గేటు తరలించాలని కేంద్రమంత్రికి లేఖ

image

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గురువారం లేఖ రాశారు. జొన్నాడ సమీపంలోని ఏర్పాటు చేసిన టోల్ గేట్‌ను కొత్తగా నిర్మించిన విజయనగరం బైపాస్ రహదారిలోకి తరలించాలని ఎంపీ ఆ లేఖలో పేర్కొన్నారు. జొన్నాడ టోల్ గేట్ వలన వాహన డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారని, పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

News July 26, 2024

REWIND: చంద్రబాబుపై 17 కేసులు నమోదు

image

గురువారం అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శాంతి భద్రతలపై శ్వేత పత్రం విడుదల చేశారు. ఇందులో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో చంద్రబాబుపై 17 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా సీఐడీ నమోదు చేసినవే కావడం గమనార్హం. వీటిలో అంగళ్లు అల్లర్లపై రెండు హత్యాయత్నం కేసులు కట్టారు. ఇవి అన్నీ కూడా అత్యధికంగా పుంగనూరు నియోజకవర్గంలోని స్టేషన్లలో నమోదయ్యాయన్నారు.

News July 26, 2024

ఏయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన‌లో కొత్త కోర్సులు

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం నుంచి ఈ సంవత్సరం బీఈడి, ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్మెంట్, బీకాం కంప్యూటర్ సైన్స్, బిబిఏ, ఎం.ఎస్సీ జియో ఇన్ఫర్మేటిక్స్ ప్రారంభిస్తున్నట్లు ఇన్ ఛార్జ్ వీసీ ఆచార్య జి.శశిభూషణరావు తెలిపారు. దూరవిద్యలో 75 వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారని వీరి సంఖ్యను లక్షకు చేర్చడం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. డిమాండ్ ఉన్న కోర్సులకు ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.

News July 26, 2024

చెన్నై-సంత్రాగచ్చి మధ్య అన్ రిజర్వడ్ ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చెన్నై సెంట్రల్, సంత్రాగచ్చి మధ్య ఒక వైపు అన్ రిజర్వడ్ ప్రత్యేక రైలు నడపనున్నట్లు వాల్తేరు సీని యర్ డీసీఎం కె. సందీప్ తెలిపారు. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- సంత్రాగచ్చి (02842) అన్ రిజర్వడ్ ప్రత్యేక రైలు ఈనెల 25 తేదీ రాత్రి 11.45 గంటలకు చెన్నైలో బయలుదేరి తరువాత నేటి మధ్యాహ్నం 1.54 గంటలకు దువ్వాడ వచ్చి.. 1.59 గంటలకు వెళుతుందని తెలిపారు.

News July 26, 2024

ఒంగోలు: 34 మంది తహశీల్దార్లు రిలీవ్

image

సార్వత్రిక ఎన్నికల సమయంలో సొంత జిల్లాలో విధులు నిర్వహిస్తున్న తహశీల్దార్లను మరొక జిల్లాకు ఉన్నతాధికారులు బదిలీ చేశారు. ఆ మేరకు బదిలీపై ప్రకాశం జిల్లా వచ్చిన 34 మంది తహశీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ తమిమ్ అన్సారియా ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన తహశీల్దారులు వారి బాధ్యతలను కార్యాలయంలోని ఉప-తహసీల్దారులకు అప్పగించాలని పేర్కొన్నారు.

News July 26, 2024

నెల్లూరు: గురుకులాల్లోకి ఉపాధ్యాయులు కావాలి

image

నెల్లూరు జిల్లాలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తాత్కాలిక పద్ధతుల నియామకానికి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు గురుకుల విద్యాలయాల జిల్లా కోఆర్డినేటర్ హేమలత తెలిపారు. ఈనెల 29వ తేదీన ఉదయం 10 గంటలకు కొత్త కోడూరు గురుకుల విద్యాలయంలో డెమో ఇంగ్లిష్ లో ఇవ్వాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. అభ్యర్థులు పీజీ బీఈడీ టెట్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలన్నారు.

News July 26, 2024

ఒలింపిక్స్‌లో విశాఖ క్రీడా ‘జ్యోతి’

image

సాధించాలనే తపన ఉంటే పేదరికం అడ్డురాదని యర్రాజీ జ్యోతి నిరూపించారు. పేదరికాన్ని పక్కకు నెట్టి పారిస్ ఒలింపిక్స్‌లో 100మీ హర్డిల్స్‌లో పోటీ పడుతున్న తొలి భారత అథ్లెట్‌గా రికార్డు సృష్టించారు. 100 మీ. హర్డిల్స్‌లో దేశంలోనే ఫాస్టెస్ట్ ఉమెన్ అథ్లెట్‌గా గుర్తింపు సాధించారు. 40 ఏళ్ల తర్వాత విశాఖ నుంచి ఒలింపిక్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న మన జ్యోతి.. ‘స్వర్ణ జ్యోతి’గా తిరిగి రావాలని ఆశిద్దాం.

News July 26, 2024

పాతపట్నం: ఆటో బోల్తా పడి డ్రైవర్ మృతి

image

పాతపట్నంలోని శివశంకర్ కాలనీ జంక్షన్ సమీప జాతీయ రహదారిపై గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో బోల్తా పడిన ఈ ఘటనలో డ్రైవర్ బచ్చల గోపి (37) మృతి చెందాడు. పాతపట్నం నుంచి పర్లాకిమిడి వెళ్తుండగా రోడ్డుపై కుక్కలు రావడంతో ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. తలకు గాయాలైన గోపిని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 26, 2024

కడప: షార్ట్ ఫిలిం పోటీల్లో గెలిస్తే రూ.2 లక్షల బహుమతి

image

నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో షార్ట్ ఫిలిం నిర్మాణ పోటీలను నిర్వహించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఫిల్మ్ మేకర్లు మానవ హక్కులపై చిత్రం తీసి ఆగస్టు 30 లోపు తమకు చేరేలా పంపాలన్నారు. ఈ పోటీ ద్వారా మేకర్స్‌లోని సృజనాత్మకతను గుర్తిస్తామని అన్నారు. గెలుపొందిన వారికి మొదటి బహుమతి రూ.2 లక్షలు, ద్వితీయ రూ.1.50 లక్షలు, తృతీయ లక్ష ఇవ్వనున్నారు. వివరాలకు htpp://nhrc.nic.in సంప్రదించాలన్నారు.