Andhra Pradesh

News March 23, 2024

ప్రకాశం: వైసీపీ MLAపై కేసు నమోదు

image

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారనే ఆరోపణలపై గిద్దలూరు MLA రాంబాబుపై శుక్రవారం రాత్రి కేసు నమోదైంది. ఈ నెల 18న మార్కాపురంలో షాదీఖానా స్లాబ్ నిర్మాణ పనుల్లో ఆయనతోపాటు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ అలిబేగ్, 20వ వార్డు కౌన్సిలర్ షేక్ సలీం పాల్గొన్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన రిటర్నింగ్ అధికారి, సబ్ కలెక్టర్ రాహుల్ మీనా వారిపై కేసు నమోదు చేయించారు.

News March 23, 2024

శ్రీకాకుళం: ఘోరం.. ఎలుగు దాడిలో ఇద్దరు మృతి

image

వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లి, చీపురుపల్లి సమీపంలో ఘోర ఘటన జరిగింది. ఎలుగుబంటి దాడిలో ఇద్దరు మృతి చెందగా.. ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. జీడి తోటలో పనులకు వెళ్లిన సీహెచ్.లోకనాథం, అప్పికొండ కుమార్ అనే రైతులు మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 23, 2024

పట్టుకోసం కూటమి.. ఆ రెండూ వదలమంటున్న వైసీపీ!

image

ఉమ్మడి ప.గోలోని 15 నియోజకవర్గాల్లో 2చోట్ల మాత్రమే ఇప్పటి వరకు వైసీపీ MLAలు గెలవలేదు. గత ఎన్నికల్లో 13 స్థానాల్లోనూ వైసీపీ సత్తా చాటినా.. పాలకొల్లు(నిమ్మల), ఉండి(మంతెన రామరాజు)లో TDP జెండానే ఎగిరింది. ఇక కొవ్వూరులో 2012, 19 ఎన్నికల్లో ప్రసన్నకుమార్.. పోలవరంలో 2012, 19లో తెల్లం వైసీపీ నుంచి 2సార్లు MLAలుగా గెలిచారు. ఈసారి జిల్లాపై పట్టుకోసం కూటమి.. ఆ 2 వదిలేది లేదంటూ వైసీపీ పథక రచన చేస్తున్నాయి.

News March 23, 2024

ఎన్టీఆర్‌: భర్త గొంతు కోసిన భార్య

image

వత్సవాయిలో భర్త గొంతును భార్య బ్లేడుతో కోసిన ఘటన కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన ఏడుకొండలు, పార్వతీ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. అయితే గత కొంతకాలం నుంచి దంపతులు మధ్య కలహాలు జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య మాట మాటా పెరగడంతో భార్య పార్వతీ తన దగ్గర ఉన్న బ్లేడుతో భర్త గొంతు కోసింది. గమనించిన స్థానికులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. 

News March 23, 2024

కర్నూలు: తహశీల్దార్, వీఆర్ఓలపై కేసు 

image

నకిలీ దస్త్రాలను సృష్టించి భూమిని సొంతం చేసుకునేందుకు సహకరించిన తహశీల్దార్ కుమారస్వామి, వీఆర్వో బీటీ సురేశ్‌పై శుక్రవారం కేసు నమోదైందని పెద్దకడుబూరు ఎస్ఐ మహేశ్ కుమార్ తెలిపారు. ఆదోనికి చెందిన స్వామినాథన్‌కు చిన్నతుంబళం గ్రామంలో 2.52 ఎకరాల భూమీ విషయంలో నకిలీ పత్రాల సృష్టించి బెదిరింపులకు పాల్పడ్డారనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News March 23, 2024

మంగళగిరిలో 1952 ఎన్నికల్లోదే భారీ మెజార్టీ

image

మంగళగిరిలో అసెంబ్లీకి ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. కాగా, తొలిసారి 1952లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి డి.లక్ష్మయ్యకు వచ్చిన మెజార్టీ(17,265)నే ఇప్పటివరకు అత్యధికం. ఆ తర్వాత 14 సార్లు జరిగిన ఎన్నికల్లో ఎవరూ ఈ మెజార్టీని దాటలేకపోయారు. 2014 ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి 12 ఓట్ల మెజార్టీ ఇక్కడ అత్యల్పం. ఈసారి మంగళగిరి ఎన్నికల బరిలో నారా లోకేశ్, మురుగుడు లావణ్య బరిలో ఉన్నారు.

News March 23, 2024

సికింద్రాబాద్- సంత్రాగచ్చి మధ్య ప్రత్యేక రైలు

image

హోలీ పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్- సంత్రాగచ్చి- సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె. త్రిపాఠి తెలిపారు. సికింద్రాబాద్- సంత్రాగచ్చి (07645) ప్రత్యేక రైలు ఈ నెల 23వ తేదీ రాత్రి 9.05 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మర్నాడు ఉదయం 9.35కు దువ్వాడ చేరుకొని ఇక్కడి నుంచి 9.40కు బయలుదేరి వెళుతుందన్నారు.

News March 23, 2024

కృష్ణా: డీఎడ్ విద్యార్థులకు ముఖ్య గమనిక

image

గుడ్లవల్లేరు మండలం అంగలూరులోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ పరిధిలోని డీఎడ్ విద్యార్థులు (2022- 24 బ్యాచ్) రాయాల్సిన సెకండియర్ 3వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 22 నుంచి 27 మధ్య ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగ సంచాలకులు దేవానందరెడ్డి అధికారిక ఉత్తర్వులు జారీచేశారు.

News March 23, 2024

అనంత: అత్యాచారం కేసులో నిందుతుడికి పదేళ్ల జైలు

image

గార్లదిన్నెలో కూరగాయల మండీలో కూలీగా అస్సాం రాష్ట్రానికి చెందిన పప్పుబాగ్ (రాజు) పని చేసేవాడు. ఈక్రమంలో 16 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. 4నెలల గర్భవతిగా ఉండగా 2023 మే 26న బాలిక తల్లిదండ్రులు గార్లదిన్నె పోలీసుల ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు. నేరం రుజువు కావడంతో పదేళ్లు జైలు, రూ.3 వేలు పొక్సో కోర్టు న్యాయమూర్తి రాజ్యలక్ష్మి తీర్పు వెల్లడించింది

News March 23, 2024

ప్రకాశం జిల్లాలో YCP ఇప్పటివరకూ గెలవని స్థానాలు

image

2019లో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా 151 సీట్లు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 9 స్థానాలు కైవసం చేసుకుంది. కానీ వైసీపీ ఆవిర్భావం నుంచి జిల్లాలో ఇప్పటికీ కొన్ని చోట్ల ఆ పార్టీ గెలవలేకపోయింది. అవే చీరాల, కొండపి, పర్చూరు స్థానాలు. అభ్యర్థుల మార్పుతో ఎలాగైనా ఈసారి గెలవాలని గట్టి పట్టుదలతో అధిష్ఠానం భావిస్తోంది. దీంతో ఈ సారి ఎన్నికల్లో ఆ స్థానాల్లో జెండా ఎగురవేయాలని భావిస్తోంది.

error: Content is protected !!