Andhra Pradesh

News May 15, 2024

స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద స్ట్రాంగ్ సెక్యూరిటీ ఏర్పాటు చేశాం: ఎస్పీ

image

కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలోని 3 బ్లాకులలో, 16 స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల భద్రతను కర్నూలు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ బుధవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి స్ట్రాంగ్ రూమ్ పరిసరాలలో సిసి టివి కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ ఇంజన్లను కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

News May 15, 2024

శ్రీసత్యసాయి జిల్లాలో 144 సెక్షన్ విధింపు

image

శ్రీ సత్య సాయి జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయ్యేవరకు సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఘర్షణలకు దారితీసే విధంగా ప్రకటనలు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేవరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.

News May 15, 2024

గుంటూరు: ఎన్నికల ఫలితాలపై రూ.లక్షల్లో పందేలు

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో పోలింగ్ ముగియగా.. జూన్ 4న వెలువడనున్న ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో పందేలు జోరందున్నట్లు తెలుస్తోంది. పార్టీలకు వచ్చే సీట్లపై, అభ్యర్థుల గెలుపోటములపై భారీగా బెట్టింగులు నడుస్తున్నట్లు సమాచారం. మరోవైపు, మంగళగిరిలో లోకేశ్ గెలుపు, మెజార్టీలపై రూ.లక్షల నుంచి రూ.కోట్లలో పందేలు వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

News May 15, 2024

ఉలవపాడు మార్కెట్లో పెరిగిన సపోటా ధరలు

image

ఉలవపాడు మండలంలోని అంతర్రాష్ట్ర సపోటా మార్కెట్లో మంచి ధరలు పలుకుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఫారిన్ రకం రూ.800, పాల రకం రూ.700, బిళ్ల రకానికి రూ.550 పలుకుతున్నాయి. రోజుకు 1,000 నుంచి 1,200 బస్తాల వరకు ఎగుమతి అవుతున్నాయి. మార్కెట్ ప్రారంభం నుంచి బస్తాకు రూ.200 చొప్పున పెరిగిందని రైతులు చెబుతున్నారు.

News May 15, 2024

రాజంపేటలో ఏ పార్టీ గెలిస్తే వారిదే అధికారం

image

రాజంపేట నియోజకవర్గంలో 34 యేళ్లుగా ఓ రికార్డు కొనసాగుతోంది. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందో వారిదే అధికారం. 1985 TDP నుంచి రత్నసభాపతి, 1989లో కాంగ్రెస్ మదన్ మోహన్ రెడ్డి, 1994, 1999లో పసుపులేటి బ్రహ్మయ్య, 2004లో కాంగ్రెస్ నుంచి ప్రభావతమ్మ గెలుచారు. 2009(కాంగ్రెస్)లో ఆకేపాటి, 2014లో TDP ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి గెలుపొందారు. 2019లో YCP నుంచి మేడా గెలిచారు. మరి ఈసారి ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా.

News May 15, 2024

జేసీ ప్రభాకర్ రెడ్డికి అస్వస్థత

image

తాడిపత్రిలో నిన్న జరిగిన వైసీపీ-టీడీపీ ఘర్షణ యుద్ధ వాతవరణాన్ని తలపించింది. ఈ ఘర్షణను అదుపు చేయడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌‌లో చికిత్స పొందుతున్నారు

News May 15, 2024

పిడుగురాళ్లలో 3 రోజులు వ్యాపార కార్యకలాపాలు బంద్

image

పిడుగురాళ్లలో 3 రోజులు పాటు వ్యాపార కార్యకలాపాలు బంద్ చేయాలని పోలీసులు సూచనలు జారీ చేశారు. పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ప్రజలు గుమిగూడొద్దని, బయటి వ్యక్తులు సొంత ప్రాంతాలకు వెళ్లాలని ప్రత్యేక మొబైల్ వ్యాన్ ద్వారా ఆదేశించారు. పల్నాడులో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య అల్లర్లు జరిగాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు పై విధంగా చెబుతున్నారు.

News May 15, 2024

టీటీడీ జూనియర్ కళాశాలల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తుల

image

తిరుప‌తిలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల‌లో 2024 – 25 విద్యా సంవత్సరానికి ప్ర‌వేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి మే 15 నుంచి 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టీటీడీ విద్యాశాఖాధికారి డా. భాస్కర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు admission.tirumala.org వెబ్ సైట్ ద్వారా గడువుకు ముందే సరైన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని తెలిపారు.

News May 15, 2024

విజయనగరం జిల్లా ఓటరు ఎటువైపు?

image

సోమవారం జరిగిన పోలింగ్ ప్రక్రియపై విభిన్న ఊహాగానాలు, విశ్లేషణలు ప్రచారం జరుగుతున్నాయి. ఉమ్మడి విజయనగరంలో ఉదయం ప్రభుత్వ వ్యతిరేక ఓటుబ్యాంకు బాగా పోలైందని, సాయంత్రం నుంచి ప్రభుత్వ అనుకూల ఓటింగ్ భారీగా నమోదయిందని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. పోలింగ్ విధానాన్ని విశ్లేషిస్తూ ఆయా పార్టీల నాయకులు విజయం తమదంటే.. తమదంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మరి మీ జిల్లాలో ఓటర్లు ఎటువైపు ఉన్నారో కామెంట్ చెయ్యండి?

News May 15, 2024

నెల్లూరు రూరల్ రూలర్ ఎవరో..?

image

నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఏలబోయే నాయకుడెవరనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. జిల్లాలో నువ్వా-నేనా అన్నట్లు పోటీపడుతున్న స్థానాల్లో రూరల్ ఒకటి. 66.18 శాతం మంది ఓటర్లు ఓటు వేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆదాల ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్ని ప్రయత్నాలు చేశారు. ప్రజలు మాత్రం సైలెంట్‌గా ఓటేసి తమ బాధ్యతను నిర్వర్తించారు. జూన్ 4 తర్వాత రూరల్ రూలర్ ఎవరో తేలనుంచి.