Andhra Pradesh

News July 24, 2024

విశాఖ: నవోదయలో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

కొమ్మాదిలోని జవహర్ నవోదయ విశ్వవిద్యాలయంలో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. సెప్టెంబర్ 16వ తేదీలోగా www.navodaya.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. 2003 మే 1 నుంచి 2017 జులై 31 మధ్య జన్మించిన వారు అర్హులు. 2025 జనవరి 18న ఉదయం 11:30 నుంచి 1:30 వరకు పరీక్ష నిర్వహిస్తారు. 75 శాతం గ్రామీణ విద్యార్థులకు, 25 శాతం పట్టణ విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. > Share it

News July 24, 2024

చీరాల: రిటైర్డ్ ఉపాధ్యాయిని హత్య

image

చీరాల మండలంలోని ఈపూరుపాలెంలో వృద్ధురాలు దారుణహత్యకు గురైంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న పి.లలిత (80) స్థానిక పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయినిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. పదేళ్ల క్రితం భర్త మృతి చెందాడు. ఈమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఒంటరిగా ఉంటున్న లలితమ్మను గుర్తుతెలియని దుండగులు గొంతు కోసి హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకొన్న SP తుషార్ డూడీ విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News July 24, 2024

ప్రకాశం బ్యారేజీ గేట్ల క్లోజ్

image

ప్రకాశం బ్యారేజీ గేట్లను ఈ మధ్య కురిసిన వరదల వల్ల ఎత్తిన విషయం తెలిసిందే. కాగా మంగళవారం సాయంత్రం 4 గంటలకు అధికారులు వాటిని మూసివేశారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకల ద్వారా వరద నీరు రావడంతో ఈ నెల 20వ తేదీ బ్యారేజీ గేట్లను ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ఈ ప్రవాహం 4 రోజులు కొనసాగింది. కృష్ణా నది దిగువున వరద నీరు తగ్గడంతో బ్యారేజీ గేట్లను మూసివేశారు.

News July 24, 2024

ఆగస్టు 4లోగా ఫీజు చెల్లించాలి: జయశ్రీ

image

వచ్చేనెల 4వ తేదీలోగా డిప్లమో ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ 2018–20 బ్యాచ్‌లో మేనేజ్‌మెంట్‌, స్పాట్‌ అడ్మిషన్లలో మొదటి సంవత్సరం ఒకసారి ఫెయిలైన అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని తూ.గో జిల్లా ప్రభుత్వ విద్యా శిక్షణ సంస్థ ప్రిన్సిపల్‌ జయశ్రీ తెలిపారు. పరీక్ష ఫీజును సంబంధిత ప్రభుత్వ, ప్రైవేటు డీఈఎల్‌ఈడీ కళాశాలల ప్రిన్సిపల్స్‌కు చెల్లించాలన్నారు. వివరాలకు సంబంధిత ప్రిన్సిపల్స్‌ను సంప్రదించాలన్నారు.

News July 24, 2024

VZM: ముద్రా రుణాలు.. గతేడాది ఎంతమందికి ఇచ్చారంటే?

image

కేంద్ర బడ్జెట్‌లో ముద్రా రుణ పరిమితిని రూ.20 లక్షల వరకు పెంచిన సంగతి తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరంలో విజయనగరం జిల్లాలో 57,066 మందికి రూ.480.45 కోట్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 13,923 కోట్లు ముద్రా రుణాలు ఇచ్చారు. త్రీ, ఫోర్ వీలర్ కొనుగోలు, జిమ్, బ్యూటీ పార్లర్, షాపులు, తయారీ, ట్రేడింగ్, సేవారంగాల్లో రుణాలు ఇస్తారు. అర్హత, వ్యాపారాలను బట్టి రూ.50 వేల నుంచి లోన్‌కు అప్లే చేసుకోవచ్చు.

News July 24, 2024

నిడదవోలు: వ్యభిచారం.. ముగ్గురి అరెస్ట్

image

నిడదవోలులోని తీరుగూడెంలో వ్యభిచార ముఠాను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఇంటిపై దాడి చేసినట్లు ఎస్ఐ పులపా అప్పారావు తెలిపారు. నిర్వాహకుడు నాగేశ్వరరావుతో పాటు ఆంజనేయపురానికి చెందిన ఓ విటుడు, రాజమహేంద్రవరానికి చెందిన మహిళను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

News July 24, 2024

తూ.గో: వ్యభిచారం.. ముగ్గురి అరెస్ట్

image

తూ.గో జిల్లా నిడదవోలులోని తీరుగూడెంలో వ్యభిచార ముఠాను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఇంటిపై దాడి చేసినట్లు ఎస్ఐ పులపా అప్పారావు తెలిపారు. నిర్వాహకుడు నాగేశ్వరరావుతో పాటు ఆంజనేయపురానికి చెందిన ఓ విటుడు, రాజమహేంద్రవరానికి చెందిన మహిళను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

News July 24, 2024

శ్రీకాకుళం: జీడి పరిశ్రమలు బంద్

image

శ్రీకాకుళం జిల్లాలో పలాస-కాశీబుగ్గతో పాటు పలు చోట్ల పారిశ్రామిక వాడలోని జీడికర్మాగారాలు బంద్ అయ్యాయి. ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ జీడిపప్పు ఎగుమతి లేదని జీడి వ్యాపారులు సోమవారం నుంచి బంద్ పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలాస- కాశీబుగ్గతోపాటు పారిశ్రామిక వాడలోని సుమారు 200 కర్మాగారాల్లో బాయిలింగ్ పనులు నిలిపివేశారు. దీనివల్ల కార్మికులకు ఉపాధిలేని పరిస్థితి ఏర్పడింది.

News July 24, 2024

నెల్లూరు జిల్లాలో 34 మంది తహశీల్దార్లు బదిలీలు

image

నెల్లూరు జిల్లాలో మొత్తం 34 మంది తహశీల్దార్లను బదిలీ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆనంద్ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలకు ముందు వీరిని ప్రకాశం, బాపట్ల, గుంటూరు జిల్లా నుంచి నెల్లూరుకు మార్చారు. ఎన్నికలు ముగియడం సాధారణ పరిస్థితి రావడంతో తిరిగి తహశీల్దార్లను ప్రకాశం, గుంటూరులోని సొంత మండలాలకు బదిలీ చేశారు.

News July 24, 2024

తిరుపతి: దిండుతో అదిమి భర్తను చంపేసిన భార్య

image

పాడిపేట పంచాయతీ శివపురంలో దారుణం చోటుచేసుకుంది. ఆటో డ్రైవర్ నరేశ్ (35) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. కొన్ని రోజులుగా భార్య ధనలక్ష్మి, నరేశ్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో నరేష్ మృతి చెందడంతో స్థానికులు తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మే హరి అనే వ్యక్తితో కలిసి తండ్రిని దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు కుమార్తె నిదిశ్రీ పోలీసులకు తెలిపింది.