Andhra Pradesh

News July 22, 2024

సత్యసాయి జిల్లా బాలికకు గోల్డ్ మెడల్

image

శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన బాలిక సోహన్వికా రెడ్డి బంగారు పతకంతో మెరిశారు. బెంగళూరులో నిర్వహించిన సౌత్ జోన్ సబ్ జూనియర్స్ తైక్వాండో విభాగంలో ఈ పతకాన్ని సాధించారు. తలుపుల మండలం గంజివారిపల్లెకు చెందిన గుణరంజన్ రెడ్డి కుమార్తె సోహన్వికా చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆసక్తి కనబరుస్తున్నారు.

News July 22, 2024

విజయవాడలో నిత్య పెళ్లికొడుకు అరెస్ట్

image

మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో మారు పేర్లతో ప్రొఫైల్‌ అప్‌లోడ్‌ చేసుకొని ఒంటరి మహిళలకు వల వేసిన నిత్య పెళ్లికొడుకును గవర్నర్ పేట పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణకు చెందిన మోహన్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తానంటూ పలు మ్యాట్రిమోనీ సైట్లలో ఒంటరి మహిళలను మోసం చేసి నగదు వసూలు చేసి పారిపోయేవాడు. పలు ఫిర్యాదులు రావడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. 

News July 22, 2024

జలుమూరులో భారీ చోరీ.. రూ.9లక్షల నగదు అపహరణ

image

జలుమూరు మండలం సురవరంలో ఆదివారం చోరీ జరిగింది. సురవరం గ్రామానికి చెందిన శివప్రసాద్ వృత్తిరీత్యా శ్రీకాకుళంలో నివాసం ఉంటున్నారు. ఆయన తల్లి గ్రామంలో ఉండేది. ఆమె ఇటీవల హైదరాబాద్‌లోని చిన్నకుమారుడి వద్దకు వెళ్లింది. శివప్రసాద్ ఆదివారం ఇంటికి వచ్చి చూసేసరికి బీరువా తలుపులు తెరచి ఉండటాన్ని గుర్తించారు. బీరువాలోని రూ.9 లక్షల నగదు, వెండి వస్తువులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News July 22, 2024

భారీ వర్షాలు.. ప.గో. జిల్లాలో ఇదీ పరిస్థితి

image

భారీ వర్షాలకు ఉమ్మడి ప.గో. జిల్లా అతలాకుతలం అవుతోంది. వరినాట్లు నీటమునగడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడికక్కడ కాలువలు, నదులు ఉద్ధృతంగా ప్రవహించడంతో పలుప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అధికారులు సహాయక చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా..
☛ జంగారెడ్డిగూడెంలోని ఎర్రకాలువ
☛ భీమవరంలోని యనమదుర్రు డ్రైన్
☛ గోపాలపురం మండలం కొవ్వూరుపాడు – సాగిపాడు గ్రామాల మధ్య అల్లిక కాలువలు ఉగ్రరూపం దాల్చాయి.

News July 22, 2024

విశాఖపట్నం ఉక్కుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం..!

image

విశాఖ ఉక్కు కర్మాగారంలో ముడిసరకు కొరతను నివారణకు రాష్ట్ర ప్రభుత్వం సహాయాన్ని అందించడానికి ముందుకు వచ్చింది. ఉక్కు కర్మాగారానికి అవసరమైన గర్భాంలోని మాంగనీసు, సరిపల్లిలోని ఇసుక గనుల లీజుపై విశాఖ ఎంపీ శ్రీభరత్, గాజువాక ఎమ్మెల్యే శ్రీనివాసరావు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే సీఎం స్పందిస్తూ సత్వరమే లీజుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు అందించారు.

News July 22, 2024

VZM: నిండు కుండల్లా జలాశయాలు

image

కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి విజయనగరం జిల్లాలో జలాశయాలు నిండుకుండాల్లా మారాయి. తోటపల్లి పూర్తి స్థాయి నీటిమట్టం 105 మీటర్లు కాగా.. ప్రస్తుతం 104 మీటర్ల వరకు నీరు చేరింది. వట్టిగెడ్డలో 121.62 M.కి 115.82మీ., పెద్దగెడ్డలో 213.80 M.కి 213.82 M., వెంగళరాయ‌సాగర్‌లో 161మీ.కి 157.45మీ., జంఝావతిలో 124మీ.కి 122.56 M నీటిమట్టం ఉంది. దీంతో నదీ తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

News July 22, 2024

అమెరికాలో తెనాలి వైద్యురాలి మృతి.. అసలేం జరిగిందంటే.?

image

తెనాలిలోని ఐతానగర్‌కు చెందిన వైద్యురాలు హారిక(24) అమెరికాలో పశువైద్య విభాగంలో MS చేస్తున్నారు. గత ఆగస్టులో అక్కడికి వెళ్లిన ఆమె ఆదివారం ప్రమాదానికి గురై మృతిచెందిన విషయం తెలిసిందే. అసలేం జరిగిందంటే.. హారిక విధుల అనంతరం సహచరులతో కలిసి కారులో ఇంటికి బయల్దేరారు. వీరి వాహనం ముందు బైకు కిందపడటంతో కారు నిలిపేశారు. దీంతో వెనక నుంచి వస్తున్న 3వాహనాలు హారిక కారును ఢీకొనగా, వెనక కూర్చున్న ఆమె మృతిచెందారు.

News July 22, 2024

కాకినాడ: రొయ్యల కూర వండలేదని సూసైడ్

image

భార్యపై అలిగి భర్త సూసైడ్ చేసుకున్న ఘటన గొల్లప్రోలులో జరిగింది. SI జాన్ బాషా తెలిపిన వివరాలు.. మండలకేంద్రంలోని ఎస్సీపేటకు చెందిన బుచ్చిరాజు(23) శనివారం ఉదయం భార్యతో పచ్చిరొయ్యల కూర వండమని చెప్పాడు. బయటకెళ్లి తిరిగొచ్చాక కోడిగుడ్ల కూర వండటంతో భార్యతో గొడవపడి వెళ్లిపోయాడు. రాత్రి 11 గంటలకు తిరిగొచ్చి పురుగుమందు తాగాడు. కాకినాడ GGHకు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదైంది.

News July 22, 2024

ప్రకాశం: గేదెలు అడ్డురావడంతో ఇద్దరి మృతి

image

మార్కాపురం మండలం తిప్పాయపల్లెం వద్ద ఉన్న జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. గేదెలు అడ్డంగా రావడమే ఈ ప్రమాదానికి కారణమని బాధితులు తెలిపారు. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు గేదెలను తప్పించబోయి పక్కనే ఉన్న పొలంలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. గేదెలను మేతకోసం పశుపోషకులు వదిలేస్తున్నారని, అవి రోడ్డుపై తిరగడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.

News July 22, 2024

అనంతపురం జిల్లాలో ఐదుగురి అరెస్ట్

image

అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం వీరన్నపల్లికి చెందిన రెడ్డప్పరెడ్డి పొలంలో మామిడి చెట్లు నరికివేసిన ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై చిన్న రెడ్డప్ప తెలిపారు. గ్రామానికి చెందిన వైసీపీ మద్దతుదారులు వెంకటస్వామి, నాగభూషణం, శ్రీనివాసులు, రాఘవేంద్ర, గోపాల్‌లు రెడ్డప్ప రెడ్డి పొలంలో 150 మామిడి చెట్లు నరికి వేశారని వివరించారు. నిందితులను రిమాండ్‌కు పంపినట్లు ఎస్ఐ తెలిపారు.