India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలో జాతీయ విద్యావిధానం (ఎన్ఐపీ) 2020లో భాగంగా సోమవారం నుంచి 28వ తేదీ వరకు అన్ని పాఠశాలల్లో శిక్షా సప్తాహ్ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి పి.శైలజ తెలిపారు. ఎన్ఐపీలో భాగంగా పరివర్తనాత్మక సంస్కరణలు, దేశవ్యాప్తంగా విద్యాభివృద్ధి చేయడంలో నిబద్ధతను తెలియజేయడమే కార్యక్రమం ఉద్దేశం అన్నారు.

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉమ్మడి జిల్లాలోని అరకు, పాడేరు, విశాఖ వెస్ట్ ఎమ్మెల్యేలు తొలిసారి అసెంబ్లీలో గళం వినిపించనున్నారు. పాయకరావుపేట MLA అనిత హోం మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గంటా, బండారు, కొణతాల వంటి మాజీ మంత్రులు.. KSN రాజు, పల్లా వంటి సీనియర్లు ఉన్నారు. మరి మీ MLA అసెంబ్లీలో ఏ సమస్యపై ప్రస్తావించాలనుకుంటున్నారో కామెంట్ చెయ్యండి.

శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ ITIలో మొదటి విడత కౌన్సిలింగ్లో మిగిలిన సీట్లకు రెండో విడత కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ప్రవేశాల కన్వీనర్ సుధాకర్ రావు తెలిపారు. ఈ మేరకు అర్హులైన 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈనెల 24వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దీని కోసం ముందుగా https://iti.ap.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇప్పటివరకు 826 ప్రవేశాలు జరగగా 2782 సీట్లు ఉన్నాయి.

అల్పపీడన ద్రోణి ప్రభావంతో రానున్న 3 రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకలకుంట వాతావరణ శాస్త్రవేత్త గుత్తా నారాయణస్వామి తెలిపారు. గాలులు గంటకు 30-40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఉదయగిరి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు మధ్యలో ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఉదయగిరి నుంచి ఉదయం 5.30 గంటలకు నెల్లూరుకు బయల్దేరింది. వాసిలి – సంగం నడిరోడ్డుపై పెద్ద శబ్దంతో టైరు పంక్చరైంది. ప్రత్యామ్నాయంగా మరో బస్సు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులకు నిరీక్షణ తప్పలేదు. ఉదయగిరి డిపోలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 5 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశముంది. ఈ క్రమంలో కర్నూలు, నంద్యాల జిల్లాలకు అవసరమైన ప్రాజెక్టులు, వివిధ పనులపై అసెంబ్లీ వేదికగా గళం విప్పేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. రోడ్లకు మరమ్మతులు, పరిశ్రమల ఏర్పాటు, తాగునీటి తదితర సమస్యలను పరిష్కరించేలా జిల్లా ప్రజాప్రతినిధులు ప్రభుత్వం <<13679639>>దృష్టికి<<>> తీసుకెళ్లాలని ప్రజలు ఆశిస్తున్నారు.

★ ఆత్మకూరు వద్ద 38.5 కి.మీ మేర అటవీ మార్గం విస్తరణపై దృష్టి పెట్టాలి
★ కర్నూలు పశ్చిమ ప్రాంతంలో తీవ్రంగా సాగు, తాగునీటి సమస్య
★ కొన్ని రహదారుల నిర్మాణాలకు దశాబ్దాలుగా పెండింగులో ఉన్న ప్రతిపాదనలు
★ ఓర్వకల్లులో మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు కృష్టి చేయాలి
★ గుండ్రేవుల, ఆర్డీఎస్, వేదవతి ప్రాజెక్టుల నిర్మాణం
★ కర్నూలులో ఉర్దూ వర్సిటీ నిర్మాణం పూర్తి చేయాలి
★ జిల్లాలోని బస్టాండ్ల ఆధునికీకరణ

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉమ్మడి జిల్లాలోని ఏడుగురు ఎమ్మెల్యేలు తొలిసారి అసెంబ్లీలో గళం వినిపించనుండగా.. వారిలో కొండపల్లి శ్రీనివాస్, గుమ్మిడి సంధ్యారాణి మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎస్.కోట నుంచి కోళ్ల, చీపురుపల్లి నుంచి కిమిడి వంటి సీనియర్లు ఉన్నారు. మరి మీ MLA అసెంబ్లీలో ఏ సమస్యపై ప్రస్తావించాలనుకుంటున్నారో కామెంట్ చెయ్యండి.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విభాగంలో అగ్ని వీర్ వాయు పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఇంటర్/ ఇంజినీరింగ్, డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://agnipathvayu.cdac.in/ వెబ్ సైట్ లో పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ జూలై 28.

భార్యను బెదిరించాలన్న ఉద్దేశంతో గడ్డి మందు తాగిన వ్యక్తి మృతిచెందిన ఘటన కరప మండలంలో జరిగింది. SI రామకృష్ణ తెలిపిన వివరాలు.. మండలంలోని గొర్రిపూడి పీటీపుంతకు చెందిన శ్రీనివాస్ (50) వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నెల 15న మద్యం తాగి ఇంటికెళ్లగా భార్య పార్వతితో గొడవ అయింది. భార్యను బెదిరించేందుకు గడ్డిమందు తాగాడు. కాకినాడలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ చనిపోయాడు.
Sorry, no posts matched your criteria.