India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏడాది వయసున్న బాలుడు ఇంటి దగ్గర ఆడుకుంటూ సైకిల్ ట్యూబ్ వాల్ పిన్ మింగేసాడు. అది గొంతులో ఇరుక్కుపోవడంతో విలవిల్లాడాడు. బాలుడు ఏడుస్తూ అస్వస్థతకు గురవ్వటంతో.. తల్లిదండ్రులు హుటాహుటిన రాజాం పట్టణంలోని ఓ హాస్పిటల్కి తరలించారు. డాక్టర్ ఎండోస్కోపి ద్వారా బాలుడు అన్నవాహికలో ఇరుక్కున్న వాల్ పిన్ జాగ్రత్తగా బయటకు తీశారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
తాడేపల్లిగూడెం మండలం కడియద్ద శివారులో కారు ఢీకొని పద్దాలు (48) అనే వ్యక్తి మృతి చెందినట్లు రూరల్ పోలీసులు శనివారం రాత్రి తెలిపారు. మృతుడు అరటి పండ్ల వ్యాపారం నిమిత్తం వెళ్లి స్వగ్రామం కృష్ణాపురం సైకిల్పై వస్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతునికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు శివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖ స్టీల్ప్లాంట్లో 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించింది. ఇప్పటికే అఖిలపక్ష కార్మిక సంఘాలు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సమ్మె నోటీసులు ఇచ్చారు. అయితే మరో పక్కన స్టీల్ సీఐటీయూ గౌరవాధ్యక్షుడు అయోధ్యరామ్కు యాజమాన్యం షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని అణగదొక్కేందుకు కార్మిక సంఘాల ప్రతినిధులపై ఉక్కు యాజమాన్యం కుట్రలు చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు.
ఆటో ఢీకొని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజమండ్రిలోని స్వరూప్ నగర్కు చెందిన విశ్రాంత ఏఆర్ SI త్రిమూర్తులు (65) శనివారం మృతిచెందాడు. బొమ్మూరు ఎస్ఐ ప్రియకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి ఆయన స్కూటీపై వెళుతుండగా శ్రీరామ్పురం ఫారెస్టు రోడ్డులో ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన త్రిమూర్తులు ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించాడు.
నెల్లూరు జిల్లాలో సీనియర్ రాజకీయ నేత, శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం మాజీ ఛైర్మన్, కొచ్చిన్, గోవా పోర్టు ట్రస్ట్ మాజీ సభ్యులు పత్తి రవీంద్రబాబు అనారోగ్య సమస్యల కారణంగా శనివారం రాత్రి మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో సీనియర్ రాజకీయ నేతగా ఆయన పలు పదవులను పొంది పలువురి మన్ననలు కూడా అందుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
వైసీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శిగా అనంతపురం నగరానికి చెందిన కేఎల్ దేవి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం సాయంత్రం వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ.. తనకు పార్టీలో ఉన్నత స్థాయి అవకాశాన్ని కల్పించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. పార్టీ కోసం కృషి చేస్తానని, మహిళా హక్కుల కోసం పోరాడతానని ఆమె పేర్కొన్నారు.
అనంతపురం జిల్లా పోలీసు జాగిలం ‘డాలీ’ అందించిన సేవలు మరువలేనివి ఎస్పీ జగదీశ్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో డాలి పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు. పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. 11 ఏళ్లు జిల్లా పోలీస్ శాఖకు సేవలందించిందని కొనియాడారు. జిల్లాలో జరిగిన అనేక హత్యలు, దొంగతనాల కేసుల్లో నేరస్థులను పట్టించిందన్నారు. డాలీ పదవీ విరమణ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలో మహిళ నిరుద్యోగులకు రూడ్ సెట్ శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 4 నుంచి మే 3వ తేదీ వరకు ఉచితంగా ఎస్కే యూనివర్సిటీ పక్కన ఆకుతోటపల్లి శిక్షణ కార్యాలయంలో జర్దోసి మగ్గం, కుట్టు మిషన్లలో శిక్షణ ఇవ్వనున్నట్లు డైరక్టర్ విజయలక్షి తెలిపారు. నెల రోజుల పాటు ఉచిత వసతి, భోజనం సౌకర్యాలు ఉంటాయన్నారు. మరిన్ని వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
రైతులకు గిట్టుబాటు ధర లేక బంతిపూలను కుప్పం పురపాలక సంఘం పూలు మార్కెట్ నుంచి రైతులు టాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డ్కు తరలిస్తున్నారు. బంతి పూలను జంతువులకు ఆహారంగా పెడుతున్నారు. మార్కెట్లో బంతిపూలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం వెంటనే పూల రైతులను ఆదుకోవాలని, ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
అనంతపురం నగరంలోని మున్సిపాలిటీ పరిధిలోని అరవింద్ నగర్లో AG&P కంపెనీ వారు చేయుచున్న ఇంటింటా గ్యాస్ పైప్ లైన్ పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంటింటా గ్యాస్ పైప్ లైన్ పనులలో ఎలాంటి అవకతవకలు జరగకూడదని కలెక్టర్ కాంట్రాక్టర్లకు సూచించారు. పైప్ లైన్ పనులు సజావుగా సాగాలని, పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు.
Sorry, no posts matched your criteria.