Andhra Pradesh

News July 23, 2024

తూ.గో జిల్లాలో వర్షపాత వివరాలు ఇలా..!

image

గడచిన 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో 95 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని మంగళవారం అధికారులు తెలిపారు. గోకవరంలో అత్యధికంగా 21.6 మిల్లీ మీటర్లు, ఉండ్రాజవరంలో 0.8mm అత్యల్ప వర్షపాతం నమోదయిందన్నారు. రాజమహేంద్రవరం అర్బన్ లో 9.2, తాళ్లపూడి 9.0, బిక్కవోలు 7.6, కొవ్వూరు 6.0, కడియం 5.2, రాజానగరం 4.8, అనపర్తి 4.8, కోరుకొండ 4.4, రంగంపేట 4.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది అని తెలిపారు.

News July 23, 2024

కర్నూలు: దొంగను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు

image

కర్నూలు జిల్లా కోసిగిలో సోమవారం అర్ధరాత్రి దొంగతనానికి యత్నించిన వ్యక్తిని స్థానికులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెంకటేశ్ నాలుగు రోజుల కిందట కుటుంబంతో కలిసి వేరే ఊరెళ్లారు. గ్రామానికి చెందిన భీమయ్యతో పాటు మరో ఇద్దరు చోరీకి యత్నించారు. ఇది గమనించిన స్థానికులు భీమయ్యను పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చోరీకి యత్నించిన వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

News July 23, 2024

అనంతపురం జిల్లాకు హెలికాప్టర్ల తయారీ సంస్థ రాబోతుందా?

image

భారత్‌లో H125 హెలికాప్టర్ల కోసం ఫైనల్‌ అసెంబ్లీ లైన్‌ ఏర్పాటు చేసేందుకు ఎయిర్‌బస్‌ 8 ప్రదేశాలను ఎంపిక చేసింది. 2015-16 మధ్య ఉమ్మడి అనంతపురం జిల్లా గోరంట్ల మం. పాలసముద్రం దగ్గర ఈ ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రభుత్వంతో చర్చలు జరిగాయి. 250 ఎకరాలు కేటాయించేందుకు సర్కారు సిద్ధమైంది. ఇప్పుడు ఫైనల్ అసెంబ్లీ లైన్ ఏర్పాటు కోసం ఎయిర్‌బస్ 8 ప్రాంతాలను ఎంపిక చేయటంతో అందులో అనంతపురం ఉందా అనేది ఆసక్తికరంగా మారింది.

News July 23, 2024

మార్కాపురం: దరఖాస్తుల ఆహ్వానం

image

మార్కాపురం ఆకాశవాణి కేంద్రంలో అనౌన్సర్ల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రోగ్రామ్ హెడ్ పి. ప్రశాంత్ కిరణ్ తెలిపారు. మార్కాపురం, పరిసర ప్రాంతాల వారై ఉండాలన్నారు. తెలుగు భాషపై పూర్తి అవగాహన, మంచి కంఠస్వరం, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి సమకాలిన రాజకీయ, ఆర్థిక అంశాలపై పట్టు ఉండాలన్నారు. ఆసక్తి గల వారు వచ్చే నెల 5 లోపు తమని సంప్రదించాలన్నారు. రాత, స్వర పరీక్షలతో ముఖాముఖీ ఉంటుందన్నారు.

News July 23, 2024

కడప ఉక్కు పరిశ్రమకు నిధులు వచ్చేనా?

image

కడప జిల్లా ప్రజలు ఎన్నో ఏళ్లగా ఉక్కు పరిశ్రమ స్థాపనకై ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రులు మారుతున్నా శంకుస్థాపనలకే పరిమితం అయిందనే విమర్శలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి నేడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు నిధులు కేటాయిస్తారో లేదో అని అని జిల్లా ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. దీనిపై మీరేమంటారు.

News July 23, 2024

Miss Universe Andhra గా చిత్తూరు జిల్లా యువతి

image

మిస్‌ యూనివర్స్‌ తెలంగాణ, AP, కర్ణాటక స్టేట్‌ 1వ ఆడిషన్‌ ఫినాలే పోటీలు హైదరాబాదులోని శ్రీనగర్‌కాలనీలో ఆదివారం నిర్వహించారు. ఇందులో శాంతిపురం మండలానికి చెందిన చందన జయరామ్‌ మిస్‌ యూనివర్స్‌ ఏపీగా ఎంపికయ్యారు. శాంతిపురం(మం) ఎంకేపురంలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన చందన హైదరాబాద్‌లో టూరిజం-హాస్పటాలిటీ కోర్సు పూర్తి చేశారు. ఈ కిరీటాన్ని సొంతం చేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

News July 23, 2024

గోదావరి వరదలపై కలెక్టర్ మండల అధికారులతో సమీక్ష

image

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మంగళవారం ఉదయం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. భద్రాచలం వద్ద గోదావరి వరద నీరు నెమ్మదిగా పెరుగుతున్న నేపథ్యంలో రానున్న 48 గంటల్లో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందన్నారు. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News July 23, 2024

మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో ఫైళ్ల దగ్ధంపై కొనసాగుతున్న విచారణ

image

మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో ఫైళ్ల దగ్ధంపై విచారణ కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో విచారణకు మరికొందరు అధికారులు వెళ్లనున్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియాను వెళ్లాలని ఆదేశించినట్లు సమాచారం.

News July 23, 2024

ఆయన పేరు మధుసూధన్ రావు కాదట.. టీడీపీ పోస్ట్

image

అసెంబ్లీ వద్ద వైసీపీ అధినేత <<13680502>>జగన్<<>> సోమవారం పోలీసు అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మధుసూదనరావు అని సంబోధిస్తూ జగన్ మాట్లాడిన వీడియో నిన్న వైరల్ అయింది. కాగా, ఆయన పేరు మధుసూదన్ రావు కాదనే వార్తను టీడీపీ తన అధికారిక ‘X’లో పోస్ట్ చేసింది. ‘ఫేకు జగన్.. మరోసారి బకరా అయ్యారు’ అని అందులో పేర్కొంది.

News July 23, 2024

ఓజిలి క్రాస్ రోడ్డు వద్ద ప్రమాదం.. ఒకరి మృతి

image

ఓజిలి క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును లారీ ఢీకొన్న ఘటనలో శ్రీనివాసులు అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. అరుణాచలం దైవ దర్శనానికి వెళ్లి స్వగ్రామమైన ఒంగోలుకు వెళ్తున్న క్రమంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.