Andhra Pradesh

News July 27, 2024

విద్యార్థి మృతిపై మంత్రి నారాయ‌ణ తీవ్ర దిగ్భ్రాంతి

image

నెల్లూరులోని KNR ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్థి మ‌ర‌ణించార‌న్న విష‌యం తెలుసుకున్న మంత్రి నారాయ‌ణ తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. అమరావతిలోని తన ఛాంబర్‌లో ఉన్న మంత్రి నారాయ‌ణ‌కు ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ ప్రమాద విషయాన్ని తెలిపారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ఘటనపై విచారణ చేయాలని డీఈవోకు మంత్రి ఆదేశించారు.

News July 27, 2024

విశాఖ: ‘సకాలంలో ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలి’

image

ఉద్యోగులు సకాలంలో ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలని ఇన్కమ్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ శేషగిరిరావు సూచించారు. విశాఖ నగరం దొండపర్తి డీఆర్ఎం కార్యాలయంలో పన్ను చెల్లింపుదారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్ఎం మనోజ్ కుమార్ సాహు పాల్గొన్నారు.

News July 27, 2024

పార్వతీపురం: ‘ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు’

image

ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. ఉచిత ఇసుక పంపిణీ పధకం అమలు పై భూగర్భ గనుల శాఖ కమీషనర్ ప్రవీణ్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం ఇసుకను లబ్దిదారులకు ఉచితంగా అందిస్తున్నాదన్నారు. ఈ కాన్ఫిరెన్స్‌లో కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, జేసీ శోభిక పాల్గొన్నారు.

News July 27, 2024

ఏలూరు జిల్లాలో 151 ఫోన్స్ రికవరీ: ఎస్పీ

image

ఏలూరు జిల్లా వ్యాప్తంగా 2024 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు 151 మొబైల్ ఫోన్స్ రికవరీ చేశామని ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. IMEI నెంబర్లతో వాటి జాడ కనుగొని, బాధితులకు అందజేసినట్లు పేర్కొన్నారు. వాటి మొత్తం ఫోన్ల విలువ రూ.21,14,000 వరకు ఉంటుందన్నారు.

News July 27, 2024

సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సూచించారు. సైబర్ నేరగాళ్లు బ్యాంక్ అకౌంట్, పాన్‌కార్డు, ఇతర అకౌంట్లు బ్లాక్ అవుతున్నాయని భయపెట్టి వ్యక్తిగత సమాచారం తీసుకుంటున్నారని, ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. ఏదైనా సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930, డయల్ 100కు కాల్ చేస్తే పోగొట్టుకున్న డబ్బులను చాలా వరకు తిరిగి పొందే అవకాశం ఉంటుందన్నారు.

News July 27, 2024

పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేయాలి: అనంత కలెక్టర్

image

పరిశ్రమలు జిల్లా ఆర్థిక ప్రగతికి ఆయువు పట్టు అని, జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. అధికారులను ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో 49వ జిల్లా పరిశ్రమలు & ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ & ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ, DIEPC) సమావేశం నిర్వహించారు.

News July 27, 2024

ఉచిత ఇసుక విధానం అమలుకు చర్యలు: కలెక్టర్ బాలాజీ

image

జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ బాలాజీ తెలిపారు. శుక్రవారం సచివాలయం నుంచి ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా ఉచిత ఇసుక విధానం అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానాన్ని జిల్లాలో అమలు చేస్తున్నామని తెలిపారు.

News July 27, 2024

జాయింట్ కలెక్టర్‌ను కలిసిన జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు

image

జాయింట్ కలెక్టరుగా గుంటూరు విచ్చేసిన భార్గవ తేజ IASను జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు శుక్రవారం కలిశారు. జిల్లా వినియోగదారుల ప్రొటెక్షన్ కౌన్సిల్ ఏర్పాటు చేసి, మీటింగులు నిర్వహించలేదని గర్తపురి వినియోగదారుల సమితి అధ్యక్షుడు హరిబాబు జేసీ దృష్టికి తీసుకెళ్లారు. గుంటూరు జిల్లాలో సంబంధిత అధికారులు అమలు జరిపే విధంగా చూడాలని కోరారు. ఆయన వెంట నాగేశ్వరరావు, మల్లికార్జునరావు, కవిత తదితరులు ఉన్నారు.

News July 26, 2024

గుంటూరు జిల్లా TODAY TOP NEWS

image

* సత్తెనపల్లిలో వైసీపీ కౌన్సిలర్ బైక్‌ దహనం
* తాడేపల్లిలో వైఎస్ జగన్ ప్రెస్‌మీట్
* వినుకొండ: రషీద్ హత్య.. నిందితులకు 30 ఏళ్ల లోపే!
* పల్నాడులో ఆగని టీడీపీ దాష్టీకాలు: వైసీపీ
* గుంటూరు: అమరులైన వీర జవానులకు నివాళి
* వినుకొండ హత్యపై మరోసారి స్పందించిన జగన్
* అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్లు గ్రాంట్‌గా ఇవ్వాలి: సీపీఐ
* అమెరికాలో మృతి.. తెనాలి చేరుకున్న రవితేజ మృతదేహం

News July 26, 2024

ATMలలో జమ చేయాల్సిన డబ్బుతో ఉద్యోగి పరారీ

image

ATMలలో డిపాజిట్ చేయాల్సిన డబ్బుతో ఉద్యోగి పరారైన ఘటన రాజమండ్రిలో శుక్రవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన ఉద్యోగి అశోక్ కుమార్ ATMలలో నగదు డిపాజిట్ కోసం వెళ్లాడు. అయితే.. వాటిని డిపాజిట్ చేయకుండా ఉడాయించడంతో పోలీసులకు సమాచారం వచ్చింది. అశోక్ దాదాపు రూ.2.40 కోట్లతో పరారైనట్లు తెలిపారు. దీంతో పోలీసులు చెక్‌పోస్టుల వద్ద సిబ్బందిని అలర్ట్ చేసి అతడి కోసం గాలిస్తున్నారు.