India's largestHyperlocal short
news App
            Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా సికింద్రాబాద్కు సోమవారం సాయంత్రం ప్రత్యేక ట్రైన్ నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే ట్రైన్ నం.07098 సోమవారం అర్ధరాత్రి ఒంటి గంటకు విజయవాడ చేరుకొని రేపు ఉదయం 8.15కి సికింద్రాబాద్ చేరుకుంటుందన్నారు. ఏపీలో ఈ ట్రైన్ విజయవాడతో పాటు కృష్ణా కెనాల్, సత్తెనపల్లి, గుంటూరుతో పాటు ఇతర ప్రధాన స్టేషన్లలో ఆగుతుందన్నారు.

ఉమ్మడి విజయనగరం జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. కాగా కొన్నిపోలింగ్ కేంద్రాల్లో ప్రధాన పార్టీలకు చెందిన నాయకుల మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు జరగగా పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. సా.5గంటలకు కురుపాం, సాలూరులో పోలింగ్ ముగిసింది. మరో గంటలో మిగిలిన చోట్లు పోలింగ్ ముగుస్తున్న నేపథ్యంలో ఓటర్లు త్వరగా ఓటేసేందుకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఓటు వేయనట్లయితే త్వరగా వెళ్లండి. >SHARE IT

ఉమ్మడి విశాఖ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. కాగా కొన్నిపోలింగ్ కేంద్రాల్లో ప్రధాన పార్టీలకు చెందిన నాయకుల మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు జరగగా పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. ఇప్పటికే అరకు, పాడేరులో పోలింగ్ ముగియగా.. మరో గంటలో మిగిలిన చోట్లు పోలింగ్ ముగియనున్న నేపథ్యంలో ఓటర్లు త్వరగా ఓటేసేందుకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఓటు వేయనట్లయితే త్వరగా వెళ్లండి.
> SHARE IT

రాజాం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న టీచర్ రమణ ఉష్ణోగ్రత తీవ్రత, ఒత్తిడికి గురై సోమవారం అక్కడకక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే తోటి సిబ్బంది హుటాహుటిన రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య కోసం విజయనగరం తీసుకెళ్లారు. టీచర్ రమణ విజయనగరం వాసి.

ఓటు వేయడం మనందరి బాధ్యత అని గుంటూరు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఏం.వేణుగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి 171వ పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును కుటుంబ సమేతంగా వచ్చి వినియోగించుకున్నారు. అనంతరం అక్కడ ఓటర్లకు కల్పించిన సదుపాయాలను పరిశీలించి, సిబ్బందికి తగిన సూచనలు చేశారు.

ఉమ్మడి ప.గో. జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. కాగా కొన్నిపోలింగ్ కేంద్రాల్లో ప్రధాన పార్టీలకు చెందిన నాయకుల మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు జరగగా పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనున్న నేపథ్యంలో ఓటర్లు త్వరగా ఓటేసేందుకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఓటు వేయనట్లయితే త్వరగా వెళ్లండి.
– SHARE IT

కారంచేడు మండల పరిధిలో ఆదివారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో వీవోఏగా పనిచేస్తున్న గర్నెపూడి చిట్టెమ్మ భర్త సింగయ్య సోమవారం అనారోగ్యంతో చనిపోయాడు. అయినప్పటికీ ఆమె ఆ బాధను దిగమింగుకుని ఓటు వేసేందుకు కారంచేడు గ్రామంలోని 178వ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఘటన తెలిసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.

డోన్ వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన అనుచరులతో తనపై దాడి చేశారని స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పీఎన్ బాబు ఆరోపించారు. ఎన్నికల పరిశీలనలో భాగంగా బేతంచెర్లకు వెళ్తుండగా అదే సమయంలో అటుగా వెళ్తున్న బుగ్గన తన కారు ఆపి అనుచరులతో దాడిచేసి, కులం పేరుతో దూషించారని ఆరోపించారు. దీనిపై బేతంచెర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని వెల్లడించారు.

శ్రీకాకుళం నియోజకవర్గంలో మధ్యాహ్నం 3 గంటలకు మొత్తం 54.87 పోలింగ్ శాతం నమోదైందని సోమవారం అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఇచ్ఛాపురం :52.04%, పలాస:52.48%, టెక్కలి: 60.00%, పాతపట్నం: 53.45%, శ్రీకాకుళం 54.00%, ఆమదాలవలస: 56.16%, ఎచ్చెర్ల: 54%, నరసన్నపేట: 57.13% నమోదైందని వారు పేర్కొన్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

కృష్ణా జిల్లా కంకిపాడులోని స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కేంద్రంలో, సోమవారం సినీ నటి శ్రీరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేసి వెళ్లారు. పంచాయతీ బూత్లో ఓటింగ్ కార్యక్రమం సజావుగా కొనసాగుతోంది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో మళ్లీ మంచి ప్రభుత్వం ఏర్పడుతోందని తెలిపారు.
Sorry, no posts matched your criteria.