India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మొగల్తూరు మండలంలోని కేపీపాలెం సౌత్ గ్రామంలో చిట్టీల పేరిట ఘరానా మోసం జరిగింది. గ్రామానికి చెందిన ఎస్.శ్రీనివాస్ నమ్మించి మోసం చేశాడని మంగళవారం పలువురు ఆరోపించారు. సుమారు 150 మంది సభ్యుల నుంచి గత కొన్నేళ్లుగా చిట్టీలు వసూలు చేస్తూ సుమారు రూ.4 కోట్ల మేర ముంచేశాడని బాధితులు వాపోయారు.

ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరులో ప్రాధాన్యం కలిగి ఉండాలని, ఆ మేరకు 100 రోజుల ప్రణాళికను అధికారులు అందజేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఇన్ఛార్జి జేసీ జి.నరసింహులుతో కలిసి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం విజన్, 2047పై రాష్ట్ర చంద్రబాబు దిశానిర్దేశం చేయడం జరిగిందని పేర్కొన్నారు.

విశాఖ పోర్ట్ ట్రస్ట్ డైమండ్ జూబ్లీ స్టేడియంలో ఈ నెల 23 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీపై ఆర్మీ, జిల్లా అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆయన మాటాడుతూ.. రాష్ట్రంలో 13 జిలాలకు చెందిన 8వేల మంది యువత ఈ ర్యాలీలో పాల్గొంటున్నట్లు తెలిపారు.

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 20వ తేదీ నుంచి పీజీ M.A/M.Sc/M.Com ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభం అవుతాయని తిరుపతి ప్రాంతీయ కార్యాలయ కోఆర్డినేటర్ మల్లికార్జునరావు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు www.braouonline.in వెబ్సైట్ చూడాలని సూచించారు. వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్లు పొందవచ్చని చెప్పారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

➤ ప్రకాశం కలెక్టర్, ఎస్పీలకు సీఎం అభినందనలు➤ ప్రకాశం జిల్లాలో ఉచితంగా డీఎస్సీ కోచింగ్➤ టూలేట్ బోర్డు చూసి.. ఇంట్లోకి వచ్చి దాడి➤ సచివాలయ సెక్రటేరియట్పై దాడి ➤ అద్దంకిలో రాగి తీగ దొంగలు అరెస్టు➤ శ్రీశైలం డ్యాం అందాలను చూద్దాం రండి➤ అద్దంకి: మా పిల్లలు తప్పు చేయలేదు➤ త్వరలో మార్కాపురాన్ని జిల్లా చేస్తాం: ఎమ్మెల్యే కందుల➤ నాటి చరిత్రకు సాక్ష్యంగా వేటపాలెం గ్రంథాలయం

కర్నూలులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల(GGH)కు గత ఆరు నెలలతో పోలిస్తే జూలై నెలలో క్షేత్రస్థాయిలో ఓపిలు పెరిగాయని GGH సూపరింటెండెంట్ డా.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ప్రతి రోజు 2700 నుంచి 3000 వరకు ఓపీలు జారీ చేస్తున్నామన్నారు. అత్యుత్తమ డాక్టర్లు, సిబ్బందిచే అధునాతన పరికరాలతో కూడిన వైద్య సేవలు, డయాగ్నొస్టిక్ సేవలను నిరంతరాయంగా అందించడం జరుగుతోందని స్పష్టం చేశారు.

పాఠశాల విద్యలో దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తూ ఏపీ మోడల్ రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో మంగళవారం రాత్రి మంత్రి అధికారులతో సమీక్షించారు. కేజీబీవీ స్కూళ్లలో పూర్తిగా ప్రతిభ ఆధారంగానే పోస్టులు వేయాలన్నారు. గురుపూజోత్సవం రోజున ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారాలు ఘనంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

విశాఖ-సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ రైలుకు సామర్లకోటలో ప్రయోగాత్మకంగా ఈనెల 3వ తేదీ నుంచి హాల్ట్ సౌకర్యం కల్పించినట్లు వాల్తేర్ రైల్వే డివిజన్ డిప్యూటీ కమర్షియల్ మేనేజర్ కే.సందీప్ తెలిపారు. 6 నెలలపాటు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సీతారాంపురంలో విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి గారపాటి చెన్నకేశవులు (42) మృతి చెందారు. సీతారాంపురంలోని కోట వీధిలో నివాసం ఉంటున్న చెన్నకేశవులు ఓ ఇంటి వద్ద కరెంటు పనిచేసేందుకు వెళ్లాడు. అంకాలమ్మ గుడి దగ్గర ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫారం లైన్ మార్చే క్రమంలో షాక్కు గురై అక్కడే మృతి చెందారని స్థానికులు తెలిపారు.

ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఏఆర్ దామోదర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షించాలని ఎస్పీకి సూచించారు. వారితోపాటు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిశారు.
Sorry, no posts matched your criteria.