India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వంశధార నదిలో మునిగి బాలిక మృతి చెందిన ఘటన శనివారం హిరమండలంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని కొమనాపల్లికి చెందిన తెంబూరు సంజనశ్రేయ(9) తల్లిదండ్రులతో కలిసి రుగడ గ్రామ సమీపంలోని వంశధారకు స్నానానికి వెళ్లింది. ప్రమాదవశాత్తు నదిలో లోతు ప్రాంతానికి వెళ్లి నీటిలో మునిగి మృతి చెందింది. తండ్రి వసంతరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు.

ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కొన్ని రోజులుగా తూ.గో జిల్లాలోని సాధారణ ప్రజలకు దొరికిన ఉపాధికి ఈ వారాంతంలో బ్రేక్ పడింది. అభ్యర్థులు తమ ప్రచారాల కోసం గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా ప్రజలను సమీకరించారు. కూలి చెల్లించి తమ వెంట తిప్పుకున్నారు. పూల వ్యాపారులతో మొదలై, టెంట్లు, టీ, టిఫిన్ సెంటర్లకు సైతం తాజా ఎన్నికల నేపథ్యంలో కొంత ఆదాయం లభించింది. ప్రచార పర్వానికి తెరపడటంతో ఇప్పుడు ఆ ఉపాధికి బ్రేక్ పడింది.

13వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు 48 గంటల పాటు 144 సెక్షను అమల్లో ఉంటుందని అనంతపురం ఎస్పీ బర్దర్ తెలిపారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, సభలు, ర్యాలీలు నిర్వహించరాదన్నారు. ఎన్నికల కమిషన్ డ్రైడే ప్రకటించడంతో శనివారం నుంచి మద్యం దుకాణాలు బంద్ చేయించామన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే డయల్ 100 లేదా జిల్లా పోలీసు ఎన్నికల విభాగం 93929 18293కు తెలియజేయాలన్నారు.

జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఓటుకు నోటు తెరలేసింది. పట్టును బట్టి డబ్బు.. డిమాండ్ చేస్తే మరింత పెంపు. ఇప్పుడు జిల్లా అంతా ‘అన్నా మీ ఊరిలో ఓటుకు ఎంత ఇస్తున్నారే’ అనే పదం చక్కర్లు కొడుతుంది. ఓటుకు రూ.2,000 నుంచి రూ.5,000 వరకు నగదు. పైగా బంగారం, బియ్యం ప్యాకెట్లు, వెండి, చీరలు ఇస్తున్నారని సమాచారం.
* ఓటరా.. గుర్తు పెట్టుకో నోటుతో నీ అమూల్యమైన ఓటును అమ్ముకొని ప్రశ్నించే తత్వాన్ని కోల్పోకు.

జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఓటుకు నోటు తెరలేసింది. పట్టును బట్టి డబ్బు.. డిమాండ్ చేస్తే మరింత పెంపు. ఇప్పుడు జిల్లా అంతా ‘అన్నా మీ ఊరిలో ఓటుకు ఎంత ఇస్తున్నారే’ అనే పదం చక్కర్లు కొడుతుంది. ఓటుకు రూ.2,000 నుంచి రూ.5,000 వరకు నగదు. పైగా బంగారం, బియ్యం ప్యాకెట్లు, వెండి, చీరలు ఇస్తున్నారని సమాచారం.
* ఓటరా.. గుర్తు పెట్టుకో నోటుతో నీ అమూల్యమైన ఓటును అమ్ముకొని ప్రశ్నించే తత్వాన్ని కోల్పోకు.

సీతానగరం మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన గవర ముసలినాయుడు (సాయి)(24) భూపాలపల్లిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రామగుండంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్న సాయి..శనివారం తన స్నేహితులను దిగబెట్టడానికి వరంగల్ బస్టాండ్కు బైక్పై వెళ్లాడు. బస్సు కోసం ఎదురుచూస్తున్న సమయంలో వారిని టిప్పర్ ఢీకొట్టింది. సాయితో పాటు అతని స్నేహితుడు కూడా మరణించాడు. వీరు ఓటేసేందుకు వస్తున్నట్లు సమాచారం.

తూ.గో జిల్లా కడియం మండలం కడియపుసావరంలో శనివారం రాత్రి ఓ వ్యక్తి నగదు పంపిణీ చేస్తున్నాడని స్థానికులు డయల్ 100కు ఫిర్యాదు చేశారు. సీఐ తులసీధర్ ఆధ్వర్యంలో సిబ్బంది వెళ్లి పరిశీలించి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ.64 వేలు స్వాధీనం చేసుకుని, ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అనంత జిల్లాలో జరిగే ఎన్నికలకు 3,940 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. జిల్లాకు చెందిన సివిల్ 1,400 మంది, ఏఆర్ 420, హోంగార్డులు 438 విధుల్లో పాల్గొంటారని ఎస్పీ తెలిపారు. సీఆర్పీఎఫ్ 85 మంది, బీఎస్ఎఫ్ A380, నాగాలాండ్ స్పెషల్ ఆర్మ్డ్ పోలీసులు 420 మందితో పాటు కర్ణాటక సివిల్ పోలీసులు 200 మంది, కర్ణాటక హోంగార్డులు 440 మందిని నియమించారు.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈనెల 13న వేతనంతో కూడిన సెలవును మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు కార్మిక శాఖకు ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు సంస్థలు, కంపెనీలు, ఉద్యోగులకు కార్మికులకు అనుమతి ఇవ్వాలని ఆదేశించారు.

ప్రొద్దుటూరులో ఓటర్లను ప్రలోభపెట్టడానికి ఓటుకు నోటుకు తెరెత్తారని కూటమి MLA అభ్యర్థి వరదరాజుల రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. MLA పంపిణీ చేసిన డబ్బులో దొంగనోట్లు ఉన్నాయేమో ప్రజలు గమనించుకోవాలన్నారు. బంగారు కమ్మలు సైతం ఇస్తున్నారని.. అందులో నకిలీ కూడా ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. మీ భూములను దోచుకునేందుకే ఇంకో అవకాశం ఇవ్వమని వైసీపీ నాయకులు అడుగుతున్నారని చెప్పుకొచ్చారు.
Sorry, no posts matched your criteria.