India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏటా ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించాలని ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక డిమాండ్ చేసింది . GO-3ను పక్కాగా అమలు చేయాలని, గిరిజన హక్కులు, చట్టాలను కాపాడాలన్నారు. మాజీ ఎమ్మెల్యే కోలక లక్ష్మణమూర్తి మాట్లాడుతూ.. రోజురోజుకు ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

పారిస్ ఒలింపిక్స్ 2024లో సోమవారం జరగనున్న ఆర్చరీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వీక్షణకు విజయవాడలోని చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీలో స్క్రీన్ ఏర్పాటు చేయనున్నారు. అకాడమీలో శిక్షణ పొందిన బొమ్మదేవర ధీరజ్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం జరిగే మ్యాచ్లో భారత జట్టు దేశానికి పతాకం అందించడం ఖాయమని అకాడమీ అధ్యక్షుడు చెరుకూరి సత్యనారాయణ తెలిపారు.

గుడ్లవల్లేరులోని AANM & VVRSR పాలిటెక్నిక్ కాలేజీలో సోమవారం కృష్ణా జిల్లాలోని ప్రావిడెంట్ ఫండ్ వినియోగదారుల కోసం “ప్రావిడెంట్ ఫండ్ మీ ముంగిట” సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారి శ్రీకాంత్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశంలో భవిష్యనిధి పరిధిలోకి వచ్చే యజమానులు, ఉద్యోగులు, పింఛనుదారులు, వాటాదారులకు లభించే సేవలు, పథకాల గురించి అవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు.

పాచిపెంట మండలం పద్మపురానికి చెందిన కంటా రమేశ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని ఎస్సై పి.నారాయణరావు తెలిపారు. ఈ నెల 23న పనులు నిమిత్తం వెళ్లిన రమేశ్ ఇంటికి రాకపోవడంతో తమకు ఫిర్యాదు అందిందని చెప్పారు. ఈమేరకు ఒడిశా సరిహద్దు ప్రాంతం ఈతమనువలస సమీపంలో ఆదివారం మృత దేహాన్ని గుర్తించి, పోస్ట్ మార్టం నిమిత్తం సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.

గడివేముల మండలంలో ట్రాక్టర్, బైక్ ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందాడు. ఎల్కే తండాకి చెందిన రాజునాయక్ తన భార్యతో కలిసి పాణ్యంలో చదువుతున్న కొడుకుని చూసేందుకు బైక్ పై వెళ్లాడు. తిరిగి వస్తున్న క్రమంలో దేవనూరు గ్రామానికి క్రషర్ లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఎదురుగా రావడంతో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదంలో రాజునాయక్ భార్య కళ్లెదుటే మృతిచెందాడు. ఘటనపై గడివేముల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఓబులవారిపల్లి మండలం కొర్లకుంటలో ముగ్గు రాళ్ల కుప్ప కింద ఓ మృతదేహం కలకలం రేపింది. మృతుడు మంగంపేట ఎస్టీ కాలనీకి చెందిన వెలుగు రాజేంద్ర (35)గా స్థానికులు గుర్తించారు. మృతుడికి భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కోటవురట్ల ప్రభుత్వ హైస్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు (1964-69) 55 ఏళ్ల తర్వాత తిరిగి అదే స్కూల్లో కలుసుకున్నారు. కౌమార దశలో విడిపోయిన వారు వృద్ధాప్యంలో కలుసుకోవడం విశేషం. ముఖకవళికలు మారిపోయి ఒకరికొకరు గుర్తుపట్టలేకపోయారు. చదువుకున్న రోజులను గుర్తుచేసుకుని ఆనందంతో పులకించిపోయారు. అందరూ కలిసి భోజనాలు చేశారు. రాజుపేటకు చెందిన ఎల్లపు వెంకటరమణ వీరందరి కలయికకు కృషి చేశారు.

టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదివారం సాయంత్రం తిరుమలలోని పలు ప్రాంతాలను, దర్శన క్యూ లైన్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆల్వార్ ట్యాంక్ అతిథి గృహాల వద్ద ఉన్న ఏస్ఎస్డీ క్యూలైన్లు, టోకెన్ తనిఖీ కేంద్రాలను పరిశీలించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్- 1,2లోని కంపార్ట్మెంట్లు, సుపథం వద్ద చిన్నపిల్లల తల్లిదండ్రులు, దాతలతోపాటు వివిధ దర్శనాలను సంబంధిత అధికారులు ఆయనకు క్షుణ్ణంగా వివరించారు.

‘అరకాసుపల్లి కోటకు ఆరుగురు రెడ్లు, ఒక్కో రెడ్డికి ఆరుగురు భోగంసానులు’ అని కథలుగా చెప్పుకొన్న ఆ కోట నేడు కనుమరుగైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా రామసముద్రం(M) ఎలవానెల్లూరు పంచాయతీలో ఉన్న ఈ కోటపై పలువురి కన్నుపడింది. కోనేరు, నగారా రాయి, ధ్వజస్తంభం గుప్తనిధుల అన్వేషకులు నాశనం చేశారు. కోటను కొందరు ఆక్రమించి చదును చేసి తమ పొలంలో కలిపేసుకున్నారు.

తేడాది డిసెంబర్లో జరిగిన NMMS పరీక్షలో ప్రతిభకనబరిచిన వారి జాబితా, www.deoprakasm.co.in వెబ్సైట్లో ఉంచినట్లు DEO సుభద్ర తెలిపారు. ఎంపికైన విద్యార్థులు వెబ్సైట్ నుంచి మెరిట్ కార్డును డౌన్లోడ్ చేసుకుని వారిపేరు, పుట్టినతేదీ, తండ్రి లేదా తల్లి పేరును సరిచూసుకోవాలన్నారు. వివరాలు సరిగా ఉన్నట్లయితే న్యూడిల్లీ వారి స్కాలర్షిప్ పోర్టల్లో ఆగస్టు 31లోగా అప్లోడ్ చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.