India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గోపాలపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాద <<13228485>>మృతిని వివరాలను<<>> పోలీసులు వెళ్లడించారు. ఏ కొండూరు మండలం అట్లపడ గ్రామానికి చెందిన నల్లగట్ల అఖిల్ (24)గా గుర్తించారు. అఖిల్ తిరువూరు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. ఏ కొండూరు ఎస్సై చల్లా కృష్ణ తన సిబ్బందితో వెళ్లి వివరాలను సేకరించి, కేసు నమోదు చేశామన్నారు.

ఈవీఎంల ధ్వంసానికి పాల్పడినా, ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందిపై ఘర్షణకు పాల్పడినా వారిపై అత్యంత తీవ్రమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటివరకు రూ.5.30కోట్ల విలువైన నగదు, మద్యం, బంగారు, వెండి ఆభరణాలు, ఇతర వస్తువులను, వాహనాలను సీజ్ చేశామన్నారు. వీటిలో నగదు రూ.1.70కోట్లు, రూ.50లక్షల విలువైన 26,751 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు పేర్కొన్నారు

ప్రజాస్వామ్య భారతదేశంలో ఓటు వజ్రాయుధమని తిమ్మాపురం గ్రామం రెవిన్యూ అధికారి సురేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. మహానంది మండల కేంద్రం తిమ్మాపురం గ్రామంలోని పోలింగ్ కేంద్రాలలో పండుగ వాతావరణం ఉట్టిపడేలా మామిడాకులు, అరటి చెట్ల తోరణాలు అలంకరించి, ఓటర్లకు స్వాగతం ఏర్పాట్లు చేశారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని ఆయన కోరారు.

రాజకీయ నాయకుడి జీవితాన్ని జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థితో పోలిస్తే.. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలు (జాబ్ నోటిఫికేషన్). నేటితో ముగిసిన నెల రోజుల ప్రచారం ప్రిపరేషన్ అన్నమాట. ఇక నేతలందరికీ 13న పరీక్ష(ఓటింగ్). 22 రోజులకే ఫలితాలు. ఉమ్మడి తూ.గో.లో 19 జాబ్స్ (MLA స్థానాలు) ఉండగా.. మొత్తం 234 మంది (నామినేషన్లు) పరీక్ష రాశారు. వీరిలో టాప్ ర్యాంక్తో జాబ్ కొట్టేవారు ఎవరెవరో కామెంట్ చేయండి.

ఎన్నికల ప్రచార గడువు ముగియనుండగా తాయిలాల పర్వానికి తెర లేచింది. నగదు పంపిణీకి ఆయా పార్టీలు సిద్ధమయ్యాయి. దీంతో DV సత్రం, నాయుడుపేట, సూళ్లూరుపేటలో ఇప్పటికే చాలా చోట్ల డబ్బు పంచుతున్నట్లు సమాచారం. ప్రధాన పార్టీలైన కూటమి, వైసీపీలకు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారిన వేళ ఖర్చుకు వెనకాడటం లేదని తెలుస్తోంది. ఓటుకు టీడీపీ రూ.వెయ్యి ఇస్తుంటే, దానికి పైచేయిగా YCP రూ.2 వేలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రాజకీయ నాయకుడి జీవితాన్ని జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థితో పోలిస్తే.. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలు (జాబ్ నోటిఫికేషన్). నేటితో ముగిసిన నెల రోజుల ప్రచారం ప్రిపరేషన్ అన్నమాట. ఇక నేతలందరికీ 13న పరీక్ష(ఓటింగ్). 22 రోజులకే ఫలితాలు. ఉమ్మడి ప.గో.లో 15 జాబ్స్ (MLA స్థానాలు) ఉండగా.. మొత్తం 181 మంది (నామినేషన్లు) పరీక్ష రాశారు. వీరిలో టాప్ ర్యాంక్తో జాబ్ కొట్టేవారు ఎవరెవరో కామెంట్ చేయండి.

భారతదేశ అతిపెద్ద ప్రజాస్వామ్య ఓట్ల పండుగలో ప్రతి ఒక్కరు ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ శనివారం పిలుపునిచ్చారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి ఈనెల 13వ తేదీ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలో జరగనున్న పోలింగ్ కోసం బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

ఈనెల 13వ తేదీన నిర్వహించిన పోలింగ్కు సంబంధించిన ఈవీఎంలు, వివి ప్యాట్లను అధికారులు పంపిణీకి సిద్ధం చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంకు ఈవీఎం, వివి ప్యాడ్ ఇతర సామాగ్రిని ఒక ప్రత్యేక బ్యాగులో ఏర్పాటు చేశారు. గుంటూరు లాడ్జి సెంటర్లోని పంపిణీ కేంద్రాలను గుంటూరు పశ్చిమ రిటర్నింగ్ అధికారిని రాజ్యలక్ష్మి శనివారం పరిశీలించారు. పశ్చిమ పరిధిలోని 292 పోలింగ్ కేంద్రాలకు ఆదివారం ఈవీఎంల పంపిణీ చేస్తామన్నారు.

నేటి సాయంత్రం 6:00 గంటల నుంచి 14వ తేదీ సాయంత్రం 6:00 గంటల వరకు పల్నాడు జిల్లా వ్యాప్తంగా.. 144 సెక్షన్ విధిస్తూ పల్నాడు జిల్లా కలెక్టర్ లోతోటి శివశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. నేటి సాయంత్రంతో ప్రచారం ముగియడంతో ఎన్నికలు ముగిసే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఎవరూ కూడా ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడి ఉండకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

ఎన్నికల సంగ్రామంలో ప్రచార ఘట్టం నేటితో ముగిసింది. నాయకులు కొద్దిరోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల మద్దతును కూడగట్టుకున్నారు. ప్రచారంలో విమర్శలు, హామీలతో తమదైన రీతిలో ఓట్లు అభ్యర్థించారు. అభ్యర్థుల కుటుంబీకులు సైతం ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఓటర్లు ఎవరికి మొగ్గుచూపుతారో వేచి చూడాల్సి ఉంది. మరి మీ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చెయ్యండి.
Sorry, no posts matched your criteria.