Andhra Pradesh

News August 14, 2024

గవర్నర్ విందుకు నరసాపురం పారిశుద్ధ్య కార్మికుడు

image

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ రాజ్‌భవన్‌లో గవర్నర్ విందు ఇవ్వనున్నారు. దీనికి నరసాపురం మున్సిపాల్టీకి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు ఎంపికయ్యారు. వివిధ విభాగాల్లో సేవలు చేస్తున్న పలు వర్గాల వ్యక్తులకు ఎట్ హోమ్ కార్యక్రమంలో భాగంగా గవర్నర్ విందు ఇవ్వడం ఆనవాయితీ. ఈక్రమంలో కరోనా సమయంలో విస్తృత సేవలు అందించిన గుమ్మడి స్వామినాయుడును విందుకు ఆహ్వానించారు.

News August 14, 2024

చెల్లని చెక్కు కేసులో వైద్యురాలికి జైలు శిక్ష

image

చెల్లని చెక్కు కేసులో ఓ వైద్యురాలికి 6 నెలల జైలు శిక్ష విధించారు. ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ పద్మజ, మంగళగిరికి చెందిన కుమార్ వద్ద రూ.10లక్షల అప్పు తీసుకొని 2019లో రూ.6లక్షలు చెక్కు ఇవ్వగా, నగదు లేక ఆ చెక్కు చెల్లలేదు. కుమార్ చెక్కు బౌన్స్ కేసు వేయగా న్యాయమూర్తి సురేశ్ బాబు వైద్యురాలికి 6 నెలలు జైలు శిక్ష, రూ.6లక్షలు చెల్లించాలని తీర్పు వెల్లడించారు.

News August 14, 2024

తంబళ్లపల్లెలో పరువు హత్య!

image

తంబళ్లపల్లె మండలంలో పరువు హత్య కలకలం రేపుతోంది. వివరాలు..తంబళ్లపల్లె(M)మండలానికి చెందిన ఓ బాలిక అదే ఊరికి చెందిన విష్ణువర్ధన్‌ను ప్రేమించింది. తల్లిదండ్రులు మైనర్‌కు పెళ్లి చేయకూడదని మేజర్ అయ్యాక చేస్తామని చెప్పారు.దీంతో బాలిక పెద్దమండెం(M), బండ్రేవువద్ద చున్నీతో ఊరేసుకుని మృతి చెందింది. తల్లిదండ్రులు ఆ శవాన్ని గుట్టుచప్పుడు కాకుండా కాల్చేయడంతో పరువుహత్య కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

News August 14, 2024

అనంతపురం.. 62 మంది సీఐల బదిలీ

image

అనంతపురం, కర్నూలు జిల్లాల రేంజ్ పరిధిలో 62 మంది సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి, అనంతపురం, గుంతకల్లు రైల్వే, అనంతపురం ఎస్పీ కార్యాలయాల్లో ఉన్న సీఐలను కర్నూలు, కడప, అన్నమయ్య, నంద్యాల జిల్లాలకు బదిలీ చేశారు. వారు త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. పలువురిని వీఆర్‌కు పంపారు.

News August 14, 2024

పత్తికొండ వద్ద టీడీపీ నేత హత్య

image

కర్నూలులో జిల్లాలో దారుణ హత్య జరిగింది. పత్తికొండ మండలం హోసూరులో బుధవారం తెల్లవారుజామున టీడీపీ మాజీ సర్పంచ్ శ్రీనివాసులును దుండగులు హత్య చేశారు. కళ్లలో కారం పొడి చల్లి వేట కొడవళ్లతో నరికినట్లు తెలుస్తోంది. గ్రామంలో పోలీసులు భారీగా మొహరించారు. హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

News August 14, 2024

తిరుపతి ఐఐటి 61వ స్థానం

image

దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తాజాగా విడుదల చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (NIRF) -2024 డేటాను రూపొందిస్తుంది. ఇందులో ఏర్పేడు సమీపంలోని ఐఐటి (IIT) తిరుపతి ఇంజనీరింగ్ విభాగంలో 61 స్థానంలో నిలిచింది. ఐఐటి మద్రాస్ వరుసగా 6వ సారి మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

News August 14, 2024

శ్రీకాకుళం: డెంగ్యూ వ్యాధితో పీజీ విద్యార్థిని మృతి

image

కోటబొమ్మాళి మండలం నిమ్మాడ కాలనీకి చెందిన పీజీ విద్యార్థి కొంచాడ నీలమ్మ (22) డెంగ్యూ వ్యాధితో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. జ్వరం రావడంతో పీహెచ్‌స్సీకీ తరలించగా రక్త పరీక్షలు నిర్వహించి ప్లేట్‌లేట్స్‌ తక్కువగా ఉన్నాయని గుర్తించారు. టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని డాక్టర్‌ సూచించారు. అంతలోనే ఆమె మరణించింది. వైద్యులు నిర్లక్ష్యంతోనే నీలమ్మ మృతి చెందిందని బంధువులు ఆరోపించారు.

News August 14, 2024

వైవీయూ బీటెక్ ఆరో సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల

image

వైఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాల బీటెక్ ఆరో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను వీసీ ప్రొ. కృష్ణారెడ్డి, కులసచివులు ప్రొ. రఘునాథరెడ్డి, సీఈ ప్రొ. ఈశ్వర్ రెడ్డి, ప్రిన్సిపల్ ప్రొ. జయరాంరెడ్డితో కలిసి విడుదల చేశారు. సివిల్ ఇంజినీరింగ్(86.36శాతం), కంప్యూటర్ సైన్స్(100శాతం), ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ (88.89శాతం), ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ (100శాతం), మెకానికల్ విద్యార్థులు 75శాతం మంది పాసయ్యారు.

News August 14, 2024

శృంగవరపుకోట: కన్నబిడ్డల కళ్లెదుటే తల్లి హత్య

image

కన్నబిడ్డల ఎదుటే భార్యను, భర్త హత్య చేసిన ఘటన విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో జరిగింది. సీఐ నారాయణమూర్తి వివరాల మేరకు.. మూలబొడ్డవర పంచాయతీకి చెందిన డి.దేముడు భార్యపై అనుమానంతో ఆదివారం రాత్రి టేకు చెక్కతో దాడి చేశాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగా..స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందింది. దీనిపై కేసు దర్యాప్తులో ఉందని, నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.

News August 14, 2024

యూరప్‌లో ప్రకాశం వ్యక్తి మృతి.. సహచరుల తీరుపై అనుమానాలు

image

దోర్నాల మండలం హసనాబాద్‌కి చెందిన శివన్నారాయణ యూరప్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అతని సహచరుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘రూ. 2 లక్షలు పంపితే వీడియో కాల్ ద్వారా మృతదేహాన్ని చూపిస్తాం, రూ.10 లక్షలు పంపితే ఇండియాకు తీసుకొస్తాం’ అంటూ ఫోన్లు చేశారని, తర్వాత ఫోన్లు స్విచ్చాఫ్ చేశారని తల్లిదండ్రులు తెలిపారు. ప్రభుత్వం స్పందించాలని వారు కోరుతున్నారు.