India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఈట మాపురంలో ప్రమాదవశాత్తు కింద పడి ఓ బాలుడు మృతిచెందాడు. కుటుంబ సభ్యుల వివరాలు మేరకు.. మహేశ్వర్ రాజు, అశ్వనిల మొదటి కుమారుడు కుశాల్ కుమార్ రాజు (7) తాత వద్ద ఉన్న సెల్ ఫోన్ చూస్తూ వెనుకకు జరుగుతూ అరుగుపై నుంచి కిందపడ్డాడు. తల వెనుక భాగం ముందుగా నేలను తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గల్ఫ్ లో ఉన్న మహేశ్వర్ రాజు విషయం తెలియగానే ఇంటికి వచ్చి కన్నీరు మున్నీరుగా విలపించాడు.

ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. అభ్యర్థులు పార్టీ శ్రేణులను ఓటర్ల చెంతకు పరుగులు పెట్టిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటు తమకే వేయాలని అభ్యర్థిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్ల వివరాలు సేకరించి వారిని రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో పడిన ఓట్ల ఆధారంగా ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఓటర్లు ఎక్కడుంటే అక్కడికే వెళ్లి తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

భారత సైన్యంలో అగ్నివీర్ రిక్రూట్ మెంట్ జరుగుతోందని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని నెల్లూరు జిల్లా ఉపాధి అధికారి రామాంజనేయులు తెలిపారు. 17 నుంచి 21 ఏళ్ల లోపు వారు అర్హులని వెల్లడించారు. నేవీలో పోస్టుకు పదో తరగతి, ట్రేడ్ మాన్ పోస్టులకు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఆన్ లైన్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ సందీప్ తెలిపిన వివరాల మేరకు కంకిపాడు పులిరామారావు వీధికి చెందిన శ్రావ్య ఐదు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతోందన్నారు. ఎన్ని మందులు వాడిన ఫలితం లేకపోవడంతో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం సాయంత్రం ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

తిరుపతిలో ఎన్నికల ప్రచారం నిమిత్తం నారా లోకేశ్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. నారా లోకేశ్కు టీడీపీ శ్రేణులు స్వాగతం పలికారు. కాగా శనివారం నాగబాబు, జేపీ నడ్డాతో కలిసి లోకేశ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రేణిగుంట నుంచి ఆయన రోడ్డు మార్గాన తిరుపతి బయలుదేరి వెళ్లారు.

శ్రీ పద్మావతి మహిళ యూనివర్సిటీలో (SPMVV) గత ఏడాది డిసెంబర్లో బిటెక్ (B.Tech) తృతీయ సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలైనట్లు పరీక్షల విభాగ నియంత్రణ అధికారిణి పేర్కొన్నారు. ఫలితాలను https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

గుంటూరు జిల్లాలో ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఎక్సైజ్ ఈఎస్ వెంకట్రామిరెడ్డి శుక్రవారం తెలిపారు. మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బులు, టూరిజం క్లబ్బులు, దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలో అతిక్రమించి ఎవరైనా దుకాణాలు, బార్లు తెరిచినా, అమ్మకాలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కడప జిల్లాలో ఓట్ల పండగ జరగనుంది. నేటితో ప్రచారం ముగియనుండగా, ఓటర్లను నాయకులు ప్రభావితం చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో ఓటుకు రూ.2వేలు ఇస్తున్నట్లు సమాచారం. కడప, బద్వేలు, కోడూరులో 1000 నుంచి 1500 ఇస్తుండగా, రాజంపేటలో గరిష్ఠంగా రూ.4 వేలు ఇస్తున్నట్లు సమాచారం. దీంతో అభ్యర్థులు పోటాపోటీగా డబ్బులు పంచడానికి సిద్ధమవుతున్నారని టాక్ నడుస్తోంది.

విజయవాడ పార్లమెంట్ స్థానంలో ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్న అన్నదమ్ముల పోటిపై ఆసక్తి నెలకొంది. వైసీపీ నుంచి కేశినేని నాని, టీడీపీ నుంచి నాని తమ్ముడు కేశినేని చిన్ని బరిలోకి దిగుతున్నారు. 2014, 19లో టీడీపీ నుంచి గెలుపును సొంతం చేసుకున్న నాని ఈ సారి పార్టీ మారి వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన చిన్ని, నాని హ్యాట్రిక్ను అడ్డుకుంటారా, మీ అభిప్రాయం కామెంట్ చేయండి.

టెక్కలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు గెలుపొందారు. 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలో నిలిచిన ఎన్టీఆర్ 40,890 ఓట్ల మెజారిటీతో టెక్కలి ఎమ్మెల్యేగా గెలిచారు. నాటి నుంచి నేటి వరకు జిల్లాలో ఏ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కూడా అంత మెజారిటీతో గెలవలేదు. ఎన్టీఆర్ పోటీ చేసిన నేలగా టెక్కలికి గుర్తింపు ఉంది.
Sorry, no posts matched your criteria.