Andhra Pradesh

News March 9, 2025

ఉచిత బస్సు తుస్సు.. గ్యాస్ సిలిండర్లు. బుస్సు: కాకాణి

image

ఉచిత బస్సు తుస్సు – గ్యాస్ సిలిండర్లు బుస్సు అని టీడీపీ సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌పై మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి సెటైర్లు వేశారు. పొదలకూరు మండలంలో ఆయ‌న శ‌నివారం ప‌ర్య‌టించారు. కూటమి పాలన బాగా లేదంటే కాకాణి సమక్షంలో ప్ర‌జ‌లు పెదవి విరిచారు. చంద్రబాబుకి మోసం చేయడంతోనే కలిసి వస్తుందని కాకాణి ఎద్దేవా చేశారు.

News March 9, 2025

VZM: విజయవంతంగా జాతీయ లోక్ అదాలత్

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. స్థానిక కోర్టులో శనివారం ఆయన మాట్లాడుతూ.. రాజీయే రాజమార్గం నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. కక్షిదారులకు డబ్బు, సమయం ఆదా చేసామన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో మోటార్ ప్రమాద బీమా క్లెయిమ్‌కు సంబంధించి రూ. 70 లక్షల చెక్కును పంపిణీ చేశామన్నారు.

News March 9, 2025

నాటు సారా రహిత జిల్లాగా శ్రీకాకుళం: కలెక్టర్

image

నాటు సారా రహిత జిల్లాగా శ్రీకాకుళాన్ని తీర్చిదిద్దేందుకు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వం చేపట్టిన నవోదయం వెలుగు 2.0 పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ప్రస్తుతం జిల్లాలో 110 గ్రామాలను నాటు సారా ఊరులగా గుర్తించామన్నారు. వీటిని ఏ, బీ, సీ, లుగా విభజించి సారాతో కలిగే అనర్థాలపై అవగాహన సదస్సు నిర్వహిస్తామన్నారు. 

News March 9, 2025

విశాఖ: ఇన్‌ఛార్జ్ మంత్రితో సమావేశమైన జిల్లా కలెక్టర్, సీపీ

image

విశాఖలో శనివారం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామిని పోర్ట్ గెస్ట్ హౌస్‌లో జిల్లా కలెక్టర్ హ‌రేంధిర ప్ర‌సాద్, విశాఖ సీపీ శంఖ బ్రాత బాగ్చి కలిశారు. జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు గూర్చి మంత్రి అడిగి తెలుసుకున్నారు. P4 సర్వే సమర్థవంతంగా జరిగేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News March 9, 2025

జాతీయ లోక్ అదాలత్‌‌కు 49,056 కేసులు పరిష్కారం

image

జాతీయ లోక్ అదాలత్‌లో 49,056 కేసులు పరిష్కారం అయినట్టు న్యాయ సేవాధికార సంస్థ జస్టిస్ ధీరత్ సింగ్ ఠాగూర్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తెలహరి, హైకోర్టు న్యాయ సేవ కమిటీ చైర్మన్ రావు రఘునందన్ రావు శనివారం తెలిపారు. రెండో శనివారం హైకోర్టులో, రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాల్లో లోకదాలత్ నిర్వహించబడిందన్నారు. రూ.3,260 కోట్లు పరిహారం చెల్లించుటకు అవార్డులు జారీ చేసినట్టు కార్యదర్శి భబిత తెలిపారు.

News March 9, 2025

గుడివాడ: ఉత్తమ వార్డు అందుకున్న శక్తి టీమ్

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ శక్తి టీమ్ విద్యార్థులు, మహిళల భరత్ భద్రతపై శ్రమిస్తున్నందుకుగాను.. వారి సేవలను గుర్తించి కలెక్టర్ డీకే బాలాజీ శనివారం అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా శక్తి టీమ్ సిబ్బందికి పోలీస్ అధికారులు, పట్టణ ప్రజలు, పట్టణ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. 

News March 9, 2025

కడప జిల్లాలో వెనుకబడిన వర్గాలను బలోపేతం చేయాలి: మంత్రి

image

జిల్లాలో వెనుకబడిన తరగతుల వర్గాలను బలోపేతం చేసి ముందుకు నడిపించాలని బలహీన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. శనివారం కడపలోని ఆర్& బి అతిధి గృహంలో.. బీసీ సంక్షేమ శాఖాధికారులు, చేనేత జౌళిశాఖ అధికారులతో.. సమీక్షా సమావేశం నిర్వహించారు. సవిత మాట్లాడుతూ.. జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందాలన్నారు.

News March 8, 2025

కావలి వైసీపీ నేత సుకుమార్ రెడ్డి సస్పెండ్

image

కావలి నియోజకవర్గం YCP నేత, కావలి మాజీ ఏఎంసీ ఛైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డిని పార్టీ అధిష్ఠానం సస్పెండ్ చేసినట్లు శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫారసుల మేరకు సస్పెండ్ చేసినట్లు పేర్కొంది. సుకుమార్ రెడ్డి సస్పెన్షన్ లేఖను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

News March 8, 2025

చిత్తూరు: వైసీపీ మహిళా విభాగంలో జిల్లా వాసుల నియామకం

image

చిత్తూరు జిల్లాకు చెందిన పలువురికి రాష్ట్ర మహిళా అనుబంధ విభాగంలో చోటు లభించింది. రాష్ట్ర మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా గీతా యాదవ్, జనరల్ సెక్రటరీలుగా గాయత్రీ దేవి, దాక్షాయిణి, స్పోక్స్ పర్సన్‌గా శ్రీదేవి రెడ్డి, కార్యదర్శులుగా మేరీ జయరాం, సరస్వతమ్మ, కల్పలత రెడ్డి, యమునమ్మ, ధనలక్ష్మిని నియమిస్తూ పార్టీ కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

News March 8, 2025

మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: వాసంశెట్టి

image

మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కృష్ణా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాశ్ అన్నారు. ఈ ఏడాది వార్షిక బడ్జెట్లో మహిళా సంక్షేమానికి రూ.4,392 కోట్లు బడ్జెట్లో కేటాయింపులు జరిపామన్నారు. శనివారం స్థానిక జడ్పీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.