India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కురబలకోట మండలం ముదివేడు క్రాస్ వద్ద గురువారం రాత్రి టిప్పర్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ముదివేడు ఎస్ఐ మల్లికార్జున రెడ్డి కథనం.. ముదివేడు గ్రామం, సాయిబులపల్లెకు చెందిన మహబూబ్ బాషా(35), సొంత పనిపై ముదివేడు క్రాస్ రోడ్డు వద్దకు వెళ్లగా టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ బాధితుణ్ని మదనపల్లెకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉందని ఎస్ఐ తెలిపారు.
వెయిటింగ్ లిస్ట్లో ఉన్న ప్రయాణికుల కోసం ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే పలు ట్రైన్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.12749 మచిలీపట్నం- బీదర్ (మే 9 నుంచి11), నం.12750 బీదర్- మచిలీపట్నం (మే 10 నుంచి12) ట్రైన్లకు ఒక స్లీపర్ కోచ్, ఒక థర్డ్ ఏసీ కోచ్ అదనంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదనపు బోగీల ద్వారా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నవారికి బెర్తులు లభిస్తాయన్నారు.
ఉదయగిరిలో టీడీపీ తరఫున ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కోసం తను నమ్మిన సిద్ధాంతం కోసం ఉమ్మడి కూటమితో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యానన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తున్నారని, అసెంబ్లీకి వెళ్లడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
మండలంలోని తిప్పలకట్ట దగ్గర కృష్ణానదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం దొరికినట్లు ఎస్సై రవీంద్రారెడ్డి గురువారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు కృష్ణానదిలో సుమారు 70ఏళ్ల వయస్సు ఉన్న మగ శవం వుండటంతో వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు దేహాన్ని పోలీస్ స్టేషన్లో తెలపాలని ఎస్సై వెల్లడించారు.
ఎన్నికలొచ్చాయంటే పోటీలో నిలిచే నాయకులంతా తమకే ఓటు వేసి గెలిపించాలంటూ ఇంటింటా తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తుంటారు. కొందరు ఓటు వేయండని నగదు సైతం పంపిణీ చేస్తారు. అయితే ప.గో. నరసాపురం మండలం రుస్తుంబాద గ్రామానికి చెందిన మొహమ్మద్ జాన్ అలైజా అనే యువకుడు ‘మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు’ అనే కరపత్రం ఇంటిగేటుకు అతికించాడు. నిజాయితీగా పనిచేసే రాజకీయ నాయకుడికి తమ కుటుంబం ఓటు వేస్తుందని చెబుతున్నారు.
ఏఐసీసీ సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ నగరంలో ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. శుక్రవారం ఆయన పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడనున్నట్లు విశాఖ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి వెల్లడించారు. ఇందుకోసం ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
మండలంలోని పాత మగులూరు సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు మిర్చి యార్డుకు మిరపకాయలు తీసుకొని వెళ్తున్న మినీ లారీ అదుపుతప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. అందులో ఉన్నవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే రహదారిపై మినీ ఆటో బోల్తాపడడంతో కాసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని లారీని పక్కకు తీసి ట్రాఫిక్ని క్లియర్ చేశారు.
ఓబులవారిపల్లి మండలం చిన్న ఓరంపాడు భద్రావతి నగర్కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి మడి తొట్టి సుబ్బ నరసయ్య (27) ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం సాయంత్రం జడ్పీ హై స్కూల్ మిద్దె పైన పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకోవడంతో మంటలు అంటుకొని తట్టుకోలేక కిందకు దూకడంతో మృతి చెందారు. పోలీసులు శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల మూల్యాంకనంతోపాటు వేగవంతమైన ఫలితాలు విడుదలలో పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి పాత్ర ప్రశంసనీయమని ఉపాధ్యాయుడు వెంకటేశ్ అన్నారు. దేవానందరెడ్డి పరీక్షల విభాగం డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరీక్షల విభాగం మొత్తాన్ని ప్రక్షాళన చేశారన్నారు. సమస్యాత్మకమైన సెంటర్లపై దృష్టి పెట్టడంతో మెరుగైన ఫలితాలు వచ్చాయని చెప్పారు.
ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని సినీనటుడు శివాజీ అన్నారు. గురువారం సాయంత్రం ఆయన తాళ్ళపూడి మండలం గజ్జరంలో కొవ్వూరు కూటమి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురందీశ్వరి తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి రాకపోతే ఇండియా మ్యాప్లో ఏపీ కనుమరుగవుతుందన్నారు.
Sorry, no posts matched your criteria.