India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిరుపతి ఎంపీ ఉపఎన్నికలో భారీగా దొంగ ఓట్లు వేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఆయా సంఘటనలపై ఈసీ కఠిన చర్యలు తీసుకుని పలువురు ఉద్యోగులపై వేటు వేసింది. దీంతో తాజా ఎన్నికలపై తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిణి అదితిసింగ్ కీలక ప్రకటన చేశారు. ప్రజలంతా నిర్భయంగా ఓటు వేయాలని కోరారు. పోలింగ్ స్టేషన్ వద్ద ఫేక్ ఓటరని గుర్తిస్తే.. సంబంధిత వ్యక్తిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.
TDP అధినేత నారా చంద్రబాబు రేపు ఒంగోలులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. శుక్రవారం రాత్రి 7 గంటలకు ఆయన ఒంగోలుకు చేరుకుంటారు. అనంతరం నగరంలో రోడ్ షో నిర్వహించి, రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 11వ తేదీ ఉదయం చిత్తూరు జిల్లా, పూతలపట్టుకు వెళ్తారు. దీంతో దామచర్ల జనార్దన్కు సమాచారం అందగా ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. మొదటగా చంద్రబాబు 11వ తేదీ ఒంగోలుకు రావాలి. కానీ ఆయన పర్యటన ఒక రోజు ముందుకు మారింది.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యండ్ లూమ్ టెక్నాలజీలో డిప్లమో కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా చేనేత, జౌళి శాఖ అధికారి ఆర్.వి.మురళీ కృష్ణ తెలిపారు.
వెంకటగిరి, తిరుపతిలోని కాలేజీలకు జూన్1లోపు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలో గల శ్రీ సంగమేశ్వరస్వామి దేవాలయం కొండ దిగువన ఓటు హక్కు వినియోగానికి సంబంధించి రూపొందించిన సైకత శిల్పం పలువురిని ఆకట్టుకుంది. ఈ సరికొత్త శిల్పం రూపొందించిన శిల్పి గేదెల హరికృష్ణ గురువారం మాట్లాడుతూ.. భారతదేశంలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్క పౌరుడు విధిగా తమ ఓటు హక్కును సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించుకోవాలని సూచించారు. హరికృష్ణను పలువురు అభినందించారు.
గుంటూరు జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు జగన్ సర్కార్ ప్రత్యేక కృషి చేస్తుందని గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్య తెలిపారు. పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి విడదల రజనీతో కలిసి గురువారం నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. జగన్ పాలనకు ప్రజలు మరోసారి మద్దతు తెలిపాలని సూచించారు.
సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నృసింహ స్వామి నిజరూప దర్శనం ఏడాదిలో ఒక్కరోజే లభిస్తుంది. నిజరూపంలో స్వామిని దర్శించుకునేందుకు లక్ష మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. గురువారం వేకువజామున వెండి బొరుగులతో స్వామిపై ఉన్న చందనాన్ని తొలగించి నిజరూప భరితుడిని చేస్తారన్నారు. తర్వాత పరిమిత సంఖ్యలో మాత్రమే అంతరాలయ దర్శనం కల్పించి మిగిలిన వారికి నీలాద్రి గుమ్మం నుంచి లఘు దర్శనం కల్పిస్తారు.
టీడీపీతో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున, విజయనగరం పార్లమెంట్ అభ్యర్థి కలిశెట్టి అప్పల నాయుడు, నెల్లిమర్ల అసెంబ్లీ అభ్యర్థి లోకం మాధవి అన్నారు. గురువారం నెల్లిమర్ల పట్టణంలో ఇంటింటికి వెళ్లి ఎన్నికలు ప్రచారం నిర్వహించారు. నెల్లిమర్ల అసెంబ్లీ NDA ఉమ్మడి కూటమి అభ్యర్థి మాధవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కళ్యాణదుర్గం రానున్నారు. ముందుగా కర్నూలులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం ఒంటి గంటకు కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు సభాస్థలికి చేరుకుని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం రాజంపేట బయలుదేరి వెళ్తారు.
జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విజయరామరాజు రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలిపారు. కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాల్లో బుధవారం సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రవర్తన నియమావళిపై జిల్లా ఎలక్షన్ కంట్రోల్ రూమ్ పర్యవేక్షణ ఆధ్వర్యంలో పార్టీల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
విశాఖలో అభ్యర్థులతో పాటు కుటుంబ సభ్యులు చేస్తున్న ప్రచారాలకు సినీ గ్లామర్ తోడవుతుంది. అనకాపల్లి BJP ఎంపీ అభ్యర్థి CM రమేశ్, పెందుర్తి జనసేన అభ్యర్థి పంచకర్లకి చిరంజీవి ఇప్పటికే మద్ధతివ్వగా.. NDA అభ్యర్థుల తరఫున జానీమాస్టర్, జబర్దస్త్, బుల్లితెర నటులు ప్రచారం చేస్తున్నారు. అటు వైసీపీ తరఫున భీమిలిలో అవంతి, నర్సీపట్నంలో గణేశ్కు మద్ధతుగా యాంకర్ శ్యామలా, హీరో సాయిరాం శంకర్ ప్రచారం చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.