Andhra Pradesh

News May 9, 2024

విశాఖలో హీరో శ్రీకాంత్ కారు తనిఖీ

image

సినీనటుడు శ్రీకాంత్ కారులో వస్తుండగా మర్రిపాలెం టోల్‌గేట్ వద్ద ఆయన కారును ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేశారు. ఆయన పూరి నుంచి హైదరాబాద్ వెళుతుండగా నిబంధనల ప్రకారం ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి షేక్ బాబూరావు ఇతర సిబ్బంది ఆపి తనిఖీ చేశారు. అన్నీ సక్రమంగా ఉండడంతో విడిచిపెట్టేశారు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో తాను కారులో వస్తున్నానని శ్రీకాంత్ తెలిపారు. 

News May 9, 2024

చందనోత్సవంలో సామాన్య భక్తులకు పెద్దపీట: విశాఖ కలెక్టర్

image

సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తూ ఈ ఏడాది చందనోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా ఏ.మల్లికార్జున పేర్కొన్నారు. అంతరాలయ దర్శనాలు ఉండవని తేల్చిచెప్పారు. ఎలాంటి రాజకీయపరమైన ప్రోటోకాల్ కూడా ఉండబోదని స్పష్టం చేశారు. పోలీసు కమిషనర్ డా ఏ రవిశంకర్‌తో కలిసి స్థానిక కలెక్టరేట్ వీసీ హాలులో బుధవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు.

News May 9, 2024

చివరి వరకూ కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్: బాపట్ల ఎస్పీ

image

బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి బుధవారం జిల్లాలోని పోలీస్ అధికారులతో ఎస్పీ వకుల్ జిందాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందురోజు వరకు ప్రతి గ్రామాల్లో కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాలని తెలిపారు. హోటల్స్, లాడ్జిలను తనిఖీ చేస్తూ అనుమానితులు ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

News May 9, 2024

ఓట్లు తారుమారు.. 15ని. వ్యవధిలో పరిష్కారం

image

ప్రతి ఓటరు తమ ఓటును వినియోగించుకోవాలని ఉమ్మడి ప.గో జిల్లా ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ కోరారు. ఆయన మాట్లాడుతూ.. బుధవారం గోపాలపురం అసెంబ్లీకి చెందిన పలువురి ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తారుమారు కాగా.. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌కు తెలిపామన్నారు. 15 నిమిషాల వ్యవధిలో ఆ ఉద్యోగులు ఓట్లు వినియోగించుకునేలా కలెక్టర్ చర్యలు తీసుకున్నారని చెప్పారు.

News May 9, 2024

రేపు పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశం: కలెక్టర్ దినేశ్

image

ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి గురువారం కూడా అవకాశం కల్పించినట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ బుధవారం తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసే అవకాశం బుధవారంతో ముగిసిందన్నారు. అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులు ఏవైనా కారణాల వల్ల ఓటు వేయకపోతే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

News May 9, 2024

పోలింగ్ కేంద్రాల్లో అన్ని సదుపాయాలను కల్పించాం: కర్నూలు కలెక్టర్

image

జిల్లాలో మే 13వ తేదీన సజావుగా ఎన్నికలు నిర్వహించేలా పోలింగ్ కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించామని జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన బుధవారం తెలిపారు. పోలింగ్ స్టేషన్‌లలో నిర్దేశించిన కనీస మౌలిక వసతుల ఏర్పాటు చేయడంతో పాటు వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ల నియామకం, తగినంత పోలీసు బలగాలను నియమించిన అంశాలపై సమావేశాన్ని నిర్వహించారు.

News May 9, 2024

అనంతపురం డీఐజీగా షేమషి నియామికం

image

అనంతపురం రేంజ్ నూతన డీఐజీగా షేమషిని నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. బుధవారం సాయంత్రంలోగా అనంతపురంలో విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు అనంతపురం డీఐజీగా పని చేసిన అమ్మిరెడ్డిని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

News May 9, 2024

ఎన్నికల నిర్వహణలో ఆర్వోలు అప్రమత్తంగా వ్యవహరించాలి: విశాఖ కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఆర్వోలు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మల్లికార్జున అన్నారు ఎన్నికల సన్నద్ధత సమావేశంలో భాగంగా ఆయన బుధవారం కలెక్టరేట్ సమావేశంలో ఆర్వోలతో సమావేశం అయ్యారు. సెక్టోరల్, రూట్ అధికారులతో సమన్వయం వహించాలని పోలింగ్ కేంద్రాల వద్ద కనీస వసతులు కల్పించాలని, ఈవీఎంల తరలింపు అంశాలపై సూచనలు చేశారు.

News May 9, 2024

నారాయణ 1200 మంది రౌడీలను దించారు : పర్వత రెడ్డి

image

ఎన్నికల్లో గెలవలేక మాజీ మంత్రి నారాయణ 1200 మంది రౌడీలను దించారని, వారితో పాటు అదనంగా హైదరాబాద్ విజయవాడ నారాయణ సిబ్బంది మొత్తం నెల్లూరులో మోహరింప చేశారని వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు విజయ్ సాయి రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆయన బుధవారం రాత్రి మీడియాతో మాట్లాడారు.

News May 9, 2024

అధికారులు బాధ్యతగా పనిచేయాలి: శ్రీకాకుళం కలెక్టర్

image

ఎన్నికల నిర్వహణలో సెక్టోరియల్ అధికారులు బాధ్యతగా పనిచేయాలి, ఎన్నికల కమీషన్ సూచనలను శత శాతం తూచా తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజిర్ జిలానీ సమూన్ అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సెక్టోరియల్ సమావేశంలో మాట్లాడారు. సెక్టోరియల్ అధికారులు ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం 72 గంటలు ప్రొటోకాల్ చాలా కీలకమన్నారు.