Andhra Pradesh

News May 8, 2024

10న కడపకు సీఎం జగన్.. ముమ్మరంగా ఏర్పాట్లు  

image

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 10న కడప వస్తున్నట్లు వైసీపీ కాంగ్రెస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్  కడపలో రోడ్ షో పాటు 7 రోడ్ల వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లను జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మేయర్ సురేశ్ బాబుతో కలిసి ఆయన ఏర్పాట్లు పరిశీలించారు.

News May 8, 2024

రాళ్ల దాడిలో పిన్నెల్లి సతీమణికి గాయాలు

image

వెల్దుర్తి మండలం శిరిగిరిపాడులో బుధవారం టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి రమా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్నారు. పరస్పర దాడుల్లో ఇరు పార్టీలవారికి పిన్నెల్లి సతీమణి రమాకి గాయం కాగా, మాజీ MPP కారు ధ్వంసమైంది. ఇరు వర్గాలను చెదరగొడుతున్న సందర్భంలో ఎస్సై శ్రీహరికి కూడా గాయాలయ్యాయి.

News May 8, 2024

నంద్యాల: గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

image

శ్రీశైలంలోని ఎస్టీ కాలనీలో గంజాయి విక్రయిస్తున్న బొడ్డపాటి మల్లికార్జున అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ జి.ప్రసాద్ రావు బుధవారం తెలిపారు. సమాచారం మేరకు తనిఖీలు చేయగా మల్లికార్జున వద్ద నుంచి 105 గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి అతడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఏఎస్ఐ గురవయ్య, సుంకన్న, రఘునాథుడు, బాలకృష్ణ, మహేశ్, శివ మహేంద్ర రెడ్డి ఉన్నారు.

News May 8, 2024

నెల్లూరు: భార్యపై భర్త కత్తితో దాడి

image

భార్యపై భర్త కత్తితో దాడి చేసిన ఘటన మదనపల్లెలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన మధు, భార్య శిరీషతో కలిసి బుతుకు తెరువు కోసం ఏడేళ్ల క్రితం వచ్చి మదనపల్లె పరిధిలోని నక్కలదిన్నెలో స్థిరపడ్డారు. చిప్పిలి మేస్త్రీ నాగరాజు కుమారుడు రఘు.. శిరీషతో ఉండగా అక్కడ మహిళలు రఘును పట్టుకున్నారు. విషయం తెలిసిన భర్త మధు ఆగ్రహంతో భార్యపై కత్తితో దాడి చేశాడు.

News May 8, 2024

మదనపల్లె: భార్యపై భర్త కత్తితో దాడి

image

భార్యపై భర్త కత్తితో దాడి చేసిన ఘటన మదనపల్లెలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన మధు, భార్య శిరీషతో కలిసి బ్రతుకుదెరువు కోసం ఏడేళ్ల క్రితం వచ్చి నక్కలదిన్నెలో స్థిరపడ్డారు. చిప్పిలి మేస్త్రీ నాగరాజు కుమారుడు రఘు.. శిరీషతో ఉండగా అక్కడ మహిళలు రఘును పట్టుకున్నారు. విషయం తెలిసిన భర్త మధు ఆగ్రహంతో భార్యపై కత్తితో దాడి చేశాడు.

News May 8, 2024

కామినేని తరఫున సినీ హీరో వెంకటేష్ ప్రచారం

image

కైకలూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తరఫున సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం సాయంత్రం కూటమి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కైకలూరు అభివృద్ధి చెందాలంటే కామినేని శ్రీనివాస్‌తోనే సాధ్యమని ఆయనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వెంకటేష్ కోరారు.

News May 8, 2024

SKLM: 46 మంది హోంగార్డులకు దక్కని ఓటు హక్కు

image

పాలకొండ సబ్ డివిజన్లో పోస్టల్ బ్యాలెట్‌కి సంబంధించి అన్ని పత్రాలు ఉన్నప్పటికీ 46 మంది హోంగార్డులకు ఓటు హక్కు కల్పించడం లేదని వాపోయారు. మూడు రోజుల నుంచి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా తమ ఓటుపై ఎన్నికల అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం లేదంటూ వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికల అధికారులు చొరవ తీసుకొని తమకు ఓటు హక్కు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

News May 8, 2024

సీఎం జగన్ కళ్యాణదుర్గం రేపు పర్యటన షెడ్యూల్

image

సీఎం జగన్ కళ్యాణదుర్గం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. కర్నూలులో గురువారం మధ్యాహ్నం 12.10 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 1గంటకు కళ్యాణదుర్గానికి చేరుకుంటారు. 1.10కి హెలిప్యాడ్ నుంచి బహిరంగ సభ స్థలికి చేరుకుంటారు. 1.30 నుంచి 2.15 వరకు బహిరంగసభ, అనంతరం 2.30కు అన్నమయ్య జిల్లా రాజంపేటకు వెళ్లనున్నారు.

News May 8, 2024

వ్యక్తిత్వం లేని వ్యక్తి పవన్ కళ్యాణ్: నందమూరి లక్ష్మీపార్వతి

image

వ్యక్తిత్వం, సొంత ఆలోచన లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని నందమూరి లక్ష్మీ పార్వతి ఆరోపించారు. విశాఖలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. లోకేశ్ ఒకటో తరగతి కూడా చదువుకోలేదు అని, చంద్రబాబు మేనేజ్ చేసి సర్టిఫికెట్లు తెప్పించారన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ ఒక క్యాన్సర్ గడ్డగా మారి చంద్రబాబుకు అమ్ముడుపోయారని, కులం ముసుగులో మేధావిగా చెప్పుకుంటూ పేదల పథకాలు అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు.

News May 8, 2024

మద్యం దుకాణాలు బంద్: కలెక్టర్ నాగలక్ష్మి

image

ఈ నెల 13న ఆంధ్ర ప్రదేశ్ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి మద్యం దుకాణాలు బంద్ చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఈనెల 11న సాయంత్రం 7నుంచి 13 సాయంత్రం 7 వరకు పూర్తిగా మూసివేయాలన్నారు. అదే విధంగా జూన్ 4న కౌంటింగ్ రోజు కూడా దుకాణాలను మూసి ఉంచాలని ఆదేశించారు.