India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మధ్యాహ్నం 2 – రాత్రి 9 గంటల వరకు <<13204379>>ట్రాఫిక్ ఆంక్షలు<<>>
* వైజాగ్ – హైదరాబాద్ మధ్య <<13204421>>రాకపోకలు<<>> సాగించే భారీ వాహనాలు హనుమాన్ జంక్షన్, తిరువూరు, మైలవరం, ఇబ్రహీంపట్నం రూట్లో వెళ్లాలి.
* వైజాగ్- చెన్నై మధ్య ప్రయాణించే భారీ వాహనాలు హనుమాన్జంక్షన్, గుడివాడ, పామర్రు, చల్లపల్లి, పులిగడ్డ, రేపల్లె, బాపట్ల, త్రోవగుంట మార్గంలో వెళ్లాలి.
రోడ్డు దాటుతుండగా వృద్ధురాలు మృతి చెందిన ఘటన మంగళవారం విజయవాడలో జరిగింది. శ్రీకాకుళం నగరానికి చెందిన ఎ.సావిత్రమ్మ (62) కుటుంబ సభ్యులతో తిరుమల వెళ్లారు. అక్కడి నుంచి దుర్గమ్మ దర్శనానికి విజయవాడ వచ్చారు. కెనాల్ రోడ్డులో వెళ్తుండగా వ్యాన్ ఢీకొనడంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కుమారుడు దొరబాబు ఫిర్యాదు మేరకు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ జూనియర్స్ మెన్ సెలక్షన్ కమిటీ సౌత్ జోన్ సభ్యుడిగా నెల్లూరుకు చెందిన న్యాయవాది మలిరెడ్డి కోటారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నిర్వాహకులు ఉత్తర్వులు ఇచ్చారు. మలిరెడ్డి కోటారెడ్డి గతంలో రంజీ క్రీడాకారుడు. ఆయన నియామకంపై నెల్లూరు క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు క్రికెటర్లు హర్షం వ్యక్తం చేశారు.
జిల్లాల పునర్విభజనలో భాగంగా రాప్తాడు సెగ్మెంట్ 2 జిల్లాల్లో విస్తరించింది. అనంతపురం(పాక్షికం), ఆత్మకూరు, రాప్తాడు అనంత జిల్లాలో, కనగానపల్లి, C.కొత్తపల్లి, రామగిరి సత్యసాయి జిల్లాలో ఉన్నాయి. నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా రాప్తాడు అసెంబ్లీ స్థానం 2009లో ఏర్పడింది. 2009, 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పరిటాల సునీత గెలుపొందగా.. 2019లో వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి విజయం సాధించారు.
నిన్న పుంగనూరులో జరిగిన సభలో మంత్రి పెద్దిరెడ్డిపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘పెద్దిరెడ్డి రూ.30 వేల కోట్ల అవినీతి చేశారు. అంగళ్లు నుంచి నేను వస్తుంటే పుంగనూరులో గొడవలు చేయించాడు. 450 మందిని జైలులో పెట్టించాడు. ఆ రోజు నా గుండె రగిలిపోయింది. పెద్దిరెడ్డీ నీ కథ తేలుస్తా. మీకు నిద్రలేని రాత్రులు చూపిస్తా. నా కార్యకర్తలు ఎంత క్షోభ అనుభవించారో మిమ్మల్నీ అంతే క్షోభ పెడతా’ అని బాబు అన్నారు.
మధ్యాహ్నం 2 – రాత్రి 9 గంటల వరకు <<13204379>>ట్రాఫిక్ ఆంక్షలు<<>>
* మచిలీపట్నం- విజయవాడ మధ్య తిరిగే బస్సులు ఆటోనగర్ గేటు, మహానాడు రోడ్డు, రామవరప్పాడు రింగ్, పడవల రేవు, BRTS రోడ్డు, సీతన్నపేట గేట్, ఏలూరు లాకులు, పాత ప్రభుత్వాసుపత్రి రూట్లో వెళతాయి. * ఏలూరు- విజయవాడ మధ్య తిరిగే ఆర్టీసీ బస్సులు రామవరప్పాడు రింగ్, పడవలరేవు, BRTS రోడ్డు, సీతన్నపేట గేట్, ఏలూరు లాకులు, పాత ప్రభుత్వాసుపత్రి రూట్లో వెళతాయి.
విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షో సందర్భంగా మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. * RTC వై జంక్షన్ – బెంజిసర్కిల్ వరకు ఎంజీ రోడ్డుపై వాహనాలు అనుమతించరు. * ఎంజీ రోడ్డుపై ప్రయాణించే వాహనాలను ఏలూరు రోడ్డు, 5వ నంబర్ రూట్కు మళ్లిస్తారు. * ఆటోనగర్ వైపు నుంచి బస్టాండ్ వెళ్లే వాహనాలు ఆటోనగర్ గేటు, పటమట, కృష్ణవేణి స్కూల్ రోడ్డు, స్క్యూ బ్రిడ్జి, కృష్ణలంక మీదుగా ప్రయాణించాలి.
ఓబులవారిపల్లి మండలం, చిన్నంపల్లి పంచాయతీలోని పలు గ్రామాల్లో జబర్దస్త్ సద్దాం టీం కూటమి అభ్యర్థి అరవ శ్రీధర్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీనిలో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అరవ శ్రీధర్, పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని వారు ప్రజలను కోరారు. సద్దాం వెంట పలువురు నటులు ఉన్నారు. కాగా కొందరు సినీ నటులు జనసేనకు మద్దుతు ఇస్తున్న సంగతి తెలిసిందే.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 68,185 మంది సర్వీస్ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోగా.. వారిలో శ్రీకాకుళం జిల్లా నుంచే అత్యధికంగా 16,448 మంది ఉన్నారు. నేవీ, ఆర్మీ ఎయిర్పోర్స్తో పాటు సాయుధ దళాలో ఈ జిల్లా నుంచే ఎక్కువ మంది ఎంపికై సేవాలందిస్తుంటారు. పలాసలో 3,030, టెక్కలి 2,919, ఆమదాలవలస 2,240 నరసన్నపేటలో 2,228 మంది ఓటర్లు నమోదు చేస్తుకున్నారు.
ఆధునీకరణ పనులు కారణంగా పలు రైళ్లను రీ షెడ్యూల్ చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. ఈనెల 7వ తేదీ రాత్రి 7 గంటలకు చెన్నైలో బయలుదేరాల్సిన చెన్నై సెంట్రల్-హావ్ డా మెయిల్ ఎక్స్ప్రెస్ రాత్రి 8.30 గంటలకు బయలుదేరిందన్నారు. సా. 4:30 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరాల్సిన సికింద్రాబాద్-భువనేశ్వర్-విశాఖ ఎక్స్ప్రెస్ 5:50 గంటలకు బయలుదేరినట్లు మార్పులు చేసినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.