Andhra Pradesh

News August 2, 2024

CRDA అథారిటీ సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

image

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం శుక్రవారం వెలగపూడి సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో CRDA పరిధిలో జరుగుతున్న కార్యక్రమాల పై సీఎం సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, పయ్యావుల కేశవ్, మునిసిపల్ శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

News August 2, 2024

ఆగస్టు 27 వరకు మాత్రమే గడువు: ప.గో కలెక్టర్

image

విద్యార్థులు, అభ్యాసకులు ఏపీ ఓపెన్ స్కూల్‌లో చేరేలా విద్యాశాఖ అధికారులు కృషి చేయాలని ప.గో కలెక్టర్ నాగరాణి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఓపెన్ స్కూల్‌లో చేరుటకు ఆసక్తితో ఉన్న పదో తరగతి, ఇంటర్ విద్యార్థులు పెనాల్టీ లేకుండా ప్రవేశ ఫీజు చెల్లించుటకు ఆగస్టు 27 వరకు గడువు ఉందన్నారు. రూ.200 పెనాల్టీతో ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చునని తెలిపారు. ☞ SHARE IT..

News August 2, 2024

మాజీ సీఎంతో ఉమ్మడి విశాఖ నేతలు భేటి

image

మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మర్యాద పూర్వకంగా కలిశారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్‌ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, పాడేరు మాజీ ఎమ్మెల్యే కే.భాగ్యలక్ష్మిలతో కలిసి జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చోడవరం నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులను వివరించారు.విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చించారు.

News August 2, 2024

వైవీయూలో నృత్య, సంగీత కోర్సుల్లో ప్రవేశాలు

image

YVUలో కూచిపూడి నృత్యం, కర్ణాటక సంగీతం, కీబోర్డ్ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలను ప్రారంభించనున్నట్లు ప్రవేశాల సంచాలకుడు డా.టి.లక్ష్మి ప్రసాద్ తెలిపారు. ప్రవేశాలు ఈ నెల 8వ తేదీ నుంచి 22 వరకు DOA కార్యాలయంలో జరుగుతాయని తెలిపారు. ఆసక్తి కల అభ్యర్థులు www.yvu.edu.in వెబ్సైట్ సంప్రదించాలన్నారు. పదేళ్ల వయసు నుంచి ఆపై ఉన్నవారు అర్హులన్నారు.

News August 2, 2024

ప.గో: డీఈఎల్ఈడీ ఫలితాలు విడుదల

image

ఉమ్మడి ప.గో జిల్లాలో జూన్ 24 నుంచి 27 వరకు జరిగిన డీఈఎల్ఈడీ ఫోర్త్ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయని ఏలూరు డీఈవో అబ్రహం శుక్రవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సంబంధించిన డమ్మీ మెమోను “www.bse.ap.gov.in” వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు. రీకౌంటింగ్ కొరకు సీఎఫ్ఏంఎస్ ద్వారా రూ.500 చెల్లించి దరఖాస్తుతో చలానా, మెమోను ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం విజయవాడకు పంపాలన్నారు. SHARE IT..

News August 2, 2024

తిరుపతి: ట్రాఫిక్ ఎస్‌ఐ గుండెపోటుతో మృతి

image

తిరుపతి స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై రెడ్డి నాయక్ విధి నిర్వహణలో ఉంటూ గుండెపోటుకు గురయ్యారు. సిబ్బంది హుటాహుటిన ఆయనను రుయా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆసుపత్రిలో ఎస్ఐ మృతదేహానికి ఎస్పీ సుబ్బారాయుడు పూలమాలలు వేసి, గౌరవ వందనం చేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి పోలీసు శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

News August 2, 2024

శ్రీకాకుళం జిల్లాకు రేపు వర్ష సూచన

image

రేపు శనివారం శ్రీకాకుళం జిల్లా పరిధిలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA అధికారిక ఖాతాలో తాజాగా ట్వీట్ చేశారు. అటు పొరుగున ఉన్న పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాలలో సైతం రేపు అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడతాయని APSDMA అధికారులు స్పష్టం చేశారు.

News August 2, 2024

కృష్ణా: ఫార్మ్-డీ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున వర్సిటీ పరిధిలో ఫార్మ్-డీ 1వ ఏడాది కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు ఆగస్టు 23 నుంచి నిర్వహిస్తామని, విద్యార్థులు పరీక్ష ఫీజును అపరాధరుసుం లేకుండా ఆగస్టు 7లోపు చెల్లించాలని వర్శిటీ పరీక్షల విభాగం తెలిపింది. పరీక్ష ఫీజు వివరాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/examinationsection చెక్ చేసుకోవాలని సూచించింది.

News August 2, 2024

రాజమండ్రి: RTCలో అప్రెంటీస్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ITIలో ఉత్తీర్ణులైన వారు ఆర్టీసీ అప్రెంటీస్ ఉద్యోగాలకు ఆగస్టు 16వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ప్రజా రవాణా అధికారి షర్మిల అశోక శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. డీజిల్ మెకానిక్, ఎలక్ట్రిషియన్, మోటార్ మెకానిక్, వెల్డర్ ట్రేడ్‌లకు దరఖాస్తులు చేసుకోవచ్చునన్నారు. www.apprenticeshipindia.gov.in వెబ్ సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

News August 2, 2024

తాడేపల్లిగూడెంలో హీరోయిన్ నిహారిక కొణిదెల

image

ప.గో జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా ప్రమోషన్‌లో శుక్రవారం సినీ నటి నిహారిక కొణిదెల పాల్గొన్నారు. ఆమెతో పాటు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, కళాశాల పాలకవర్గ కార్యదర్శి సుబ్బారావు హాజరయ్యారు. వంశీ దర్శకత్వంలో యువతకు ప్రాధాన్యతనిచ్చే చిత్రాన్ని తాను నిర్మించినట్లు నిహారిక వెల్లడించారు.