Andhra Pradesh

News March 8, 2025

మహిళలు, బాలికల భద్రతే మా ద్యేయం: కర్నూలు ఎస్పీ

image

మహిళలు, బాలికల భద్రతే తమ ధ్యేయమని ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కమాండెంట్ దీపికా పాటిల్ అన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో పోలీసు కుటుంబాల మహిళల కోసం ప్రత్యేకంగా ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మహిళలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు.

News March 8, 2025

శ్రీకాకుళం : ఇంటర్ పరీక్షకు 711 మంది గైర్హాజరు

image

శ్రీకాకుళం జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్ పరీక్షకు 711 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఆర్ఐఓ పీ.దుర్గారావు తెలిపారు. జిల్లాలో జనరల్, ఓకేషనల్ విద్యార్థులు 20,882 మందికి గాను 20,170 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. శనివారం జరిగిన పరీక్షలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదని, ప్రశాంతంగా జరిగిందని తెలిపారు.

News March 8, 2025

గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్లిన విశాఖ మహిళ

image

స్టీల్ సిటీ గల్లీ నుంచి భారతదేశ రాజధాని ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఒలింపిక్స్‌కు సెలక్ట్ అయిన మొదటి మహిళగా యర్రాజీ జ్యోతి చరిత్ర సృష్టించారు. విశాఖలో సూర్యనారాయణ, కుమారి దంపతులకు ఆగస్టు 28, 1999న జన్మించిన జ్యోతి, నేడు ఒలింపిక్స్‌లో పోటీ చేసి, దేశం గర్వించేలా ఎదిగారు. మహిళల 100 మీటర్స్ హర్డిల్స్‌‌ 12.78 సెకన్లలో పూర్తి చేసి, జాతీయ రికార్డు సృష్టించారు. 2024లో అర్జున్ అవార్డుకు ఎంపికయ్యారు.

News March 8, 2025

కైలాసగిరి పైకి డబుల్ డెక్కర్ బస్సు: VMRDA ఛైర్మన్

image

కైలాసగిరి పైకి డబుల్ డెక్కర్ బస్సు నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ అధికారులను ఆదేశించారు. కైలాసగిరిని శనివారం సందర్శించిన ఆయన గ్లాస్ బ్రిడ్జిని త్వరలో అందుబాటులోకి తేవాలన్నారు. మరిన్ని అడ్వెంచర్ జోన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రోప్ వే సామర్ధ్య ధ్రువపత్రాలు సమర్పించిన తర్వాతే కేబుల్ కార్ తిరిగేందుకు అనుమతించాలని ఆదేశించారు.

News March 8, 2025

కర్నూలు జిల్లాలో 610 మంది విద్యార్థుల గైర్హాజరు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా నేడు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు మ్యాథ్స్‌ పేపర్ 1బి, జువాలజీ పేపర్‌ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలు జరిగాయి. 610 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి గురువయ్య శెట్టి తెలిపారు. 22,348 మంది హాజరు కావాల్సి ఉండగా 21,738 మంది పరీక్ష రాశారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకోలేదని ఆయన తెలిపారు.

News March 8, 2025

Women’s Day Special: భార్య విజయం వెనుక భర్త

image

ప్రతీ పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుందంటారు. కానీ ఆచార్య సీతామాణిక్యం విజయం వెనుక ఆమె భర్త తమ్మిరెడ్డి ఉన్నారు. AU లా కాలేజీ ప్రిన్సిపల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కృషి ఉంది. 17 ఏళ్లకే పెళ్లైనా భర్త ప్రోత్సాహంతో పై చదువులు అభ్యసించారు. AUలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నుంచి ప్రిన్సిపల్‌గా ఎదిగారు. రాష్ట్రంలోనే ‘పోస్ట్ డాక్టోరల్ ఇన్ లా’ చేసిన తొలి వ్యక్తిగా నిలిచారు.

News March 8, 2025

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏకైక మహిళ ఎమ్మెల్యే

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఏకైక మహిళగా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి నిలిచారు. ఈమె 2024లో వైసీపీ అభ్యర్థి విడదల రజినిపై 51,150 ఓట్ల మెజార్టీతో గెలిచారు. పొన్నూరు మండలం ములుకుదురు గ్రామానికి చెందిన ఆమె.. గుంటూరులో ఆసుపత్రిని నడిపిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. మాధవి వివిధ సామాజిక సేవా కార్యకలాపాలలో, ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ రంగంలో చురుకుగా పాల్గొంటున్నారు.

News March 8, 2025

తెనాలి: మూడు సార్లు ఎమ్మెల్యే అయిన మహిళ

image

దొడ్డపనేని ఇందిర మాజీ మంత్రి ఆలపాటి వెంకటరామయ్య, సామ్రాజ్యమ్మల కుమార్తె. ఈమె 1937 జనవరి 7న తెనాలి సమీపంలో యడ్లపల్లి గ్రామంలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత చెన్నై బిఎస్సి(హోం సైన్స్) లో డిగ్రీ తీసుకున్నారు. తెనాలి నుంచి మూడు సార్లు(1967, 1972, 1978) ఎమ్మెల్యేగా గెలిచారు. 1987లో గుంటూరు జిల్లా పరిషత్‌కు తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈమె పేరుతో తెనాలిలో పాఠశాల ఏర్పాటు చేశారు.

News March 8, 2025

గుంటూరు జిల్లాలోని మహిళా అన్నదాత

image

కైవారం బాలాంబ 1849లో తెనాలి అంగలకుదురు గ్రామంలో జన్మించారు. సుబ్బన్నసూరి, వెంకమాంబ ఆమె తల్లిదండ్రులు. ఆమెకు సుబ్బన్నతో వివాహం జరిగింది. కొంతకాలానికి ఆయన మరణించాడు. అనంతరం గ్రామంలో అన్నదానం ప్రారంభించారు. క్రమంగా వందలాది మంది భక్తులకు, బాటసారులకు అన్నదానం చేసే స్థాయికి ఎదిగింది. మంగళగిరి తిరునాళ్ల సమయంలో వేలాది మంది యాత్రికులు వీరి సత్రంలో భోజనాలు చేసేవారు. 1926లో అన్నపూర్ణ సత్రం ఏర్పాటు చేశారు.

News March 8, 2025

దోర్నాల: పెట్రోల్ దాడిలో ఇద్దరూ మృతి

image

పెద్దదోర్నాల మండలం తూర్పు బొమ్మలాపురంలో భూ వివాదం కారణంగా సైదాబీ (35), నాగూర్ వలి (23)పై పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నాగూర్ వలి శుక్రవారం మధ్యాహ్నం మరణించగా, సైదాబీ రాత్రి 12:50 నిమిషాలకు మృతి చెందారు. నిందితుడు పరారీలో ఉండగా, పోలీసులు గాలింపు చేపట్టారు. ఒకే కుటుంబంలో ఇద్దరూ మృతితో విషాదం నెలకొంది.