Andhra Pradesh

News July 28, 2024

నేటి నుంచి డిపార్ట్‌మెంటల్ పరీక్షలు ప్రారంభం

image

నేటి నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు కర్నూలులోని సనత్ నగర్ అయాన్ డిజిటల్ కేంద్రంలో డిపార్ట్‌మెంటల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేదని, పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్ఓ మధుసూదన్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్ష ఉదయం, మధ్యాహ్నం జరగనుంది. బేర్ యాక్ట్స్ పుస్తకాలు, గుర్తింపు కార్డులు మాత్రమే అనుమతిస్తామని తెలిపారు.

News July 28, 2024

విశాఖ తూర్పు తీరంలో మిషన్ గస్తీ విజయవంతం

image

భారత తూర్పు తీరంలో చేపట్టిన మిషన్ గస్తీ విజయవంతంగా ముగిసినట్లు కమాండింగ్ ఇన్ చీఫ్ ఆఫీసర్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ తెలిపారు. శనివారం విశాఖలో ఈ.ఎన్.సీ ముఖ్య కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మిషన్ గస్తీలో ఐఎన్ఎస్ కరంజ్ జలాంతర్గాలు అధికారులు, సిబ్బంది అద్భుత ప్రదర్శన కనపర్చినట్లు పేర్కొన్నారు. అన్ని రకాల ఆపరేషన్ లక్ష్యాలను చేరుకోవడం అభినందనీయం అన్నారు.

News July 28, 2024

ఏలూరు: యువతితో అసభ్య ప్రవర్తన.. కత్తితో దాడి

image

అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై ఓ యువతి కత్తితో దాడి చేసింది. సదరు యువతి కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా ద్వారకాతిరుమలలో తిరుగోతుంది. అదే గ్రామానికి చెందిన తిరునగరి రమేశ్ మద్యం మత్తులో కొద్దిరోజులుగా ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి శ్రీవారి పాదుకా మండపంలో నిద్రిస్తున్న రమేశ్‌ చేతిపై, ముఖంపై చాకుతో పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించారు.

News July 28, 2024

కావలి పరిధిలో బాలికపై అత్యాచారం.. కేసు నమోదు

image

కూతురు వయసున్న బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కావలి నియోజకవర్గంలో జరిగింది. బాలిక ఇంటికి తరచూ వస్తూ పోతున్న మృగాడు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కావలి రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News July 28, 2024

కారంచేడు: గేదెను ఢీకొని ఉపాధ్యాయుడు మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన కారంచేడు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. తిమిడిదపాడు స్వర్ణ గ్రామాల మధ్యలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. వంకాయలపాడు గ్రామానికి చెందిన ఈదర శ్రీనివాసరెడ్డి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా గేదె రోడ్డుపై అడ్డు రావడంతో ద్విచక్ర వాహనం బలంగా దూడను ఢీకొంది. ఈ ప్రమాదంలో గేదె, ఉపాధ్యాయుడు అక్కడికక్కడే మృతి చెందారు.

News July 28, 2024

నేటి నుంచి డిపార్ట్‌మెంట్ పరీక్షలు

image

శ్రీకాకుళం జిల్లాలో శాఖాపరమైన పరీక్షలు ఆదివారం నుంచి 3 కేంద్రాల్లో 6 రోజుల పాటు నిర్వహించనున్నట్లు డీఆర్వో గణపతిరావు పేర్కొన్నారు. నేటి నుంచి ఆగస్టు రెండో తేదీ వరకు జరిగే పరీక్షలకు మొత్తం 1,715 మంది ఉద్యోగులు హాజరవుతారన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. అభ్యర్థులు గంటన్నర ముందు కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

News July 28, 2024

విశాఖ: యాక్సిడెంట్‌లో ఫార్మా ఉద్యోగి మృతి

image

ఆనందపురం మండలం దుక్కవానిపాలెం టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదంలో దివీస్ ఉద్యోగి ఉప్పల రాధాకృష్ణమూర్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిది బాపట్ల జిల్లా వేమూరు మండలం బుతమల్లి గ్రామం. 2002 నుంచి దివీస్ కంపెనీలో ఫిట్టర్‌గా పని చేస్తున్నాడు. గాజువాక స్టీల్ లోడ్ తీసుకొని వెళ్లివస్తూ టోల్ ప్లాజా వద్ద మంచినీటి కోసం ఆగి రోడ్డు దాటుతుండగా క్రేన్ ఢీకొని మరణించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News July 28, 2024

బ్యాంకాక్‌లో డోన్‌ వాసి కిడ్నాప్‌

image

డోన్‌ (మం) చిన్నమల్కాపురానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మధుకుమార్‌ను బ్యాంకాక్‌లో కిడ్నాప్‌ చేశారని తండ్రి డోన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ఈనెల 22న చెల్లెలికి ఫోన్‌ చేసి ఉద్యోగానికి 23న బ్యాంకాక్‌ వెళ్తున్నానని చెప్పాడు. 25న తనను కిడ్నాప్‌ చేశారని, రూ.80 లక్షలు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని వాట్సాప్‌ మెసేజ్ వచ్చింది. తర్వాత నుంచి ఆ ఫోన్‌ స్విచ్ఆఫ్ అయింది.’ అని తండ్రి తెలిపారు.

News July 28, 2024

అసత్య ప్రచారం మానుకోవాలి: ఎమ్మెల్యే బండారు శ్రావణి

image

శింగనమల నియోజకవర్గంలో తన గెలుపునకు సహకరించిన టీడీపీ కార్యకర్తలు, నాయకులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ తెలిపారు. తన ఫ్యామిలీపై కొందరు మీడియాలో అసత్యప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబసభ్యులు ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకుని పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అసత్య ప్రచారాలను ఇప్పటికైనా మానుకోవాలని హెచ్చరించారు.

News July 28, 2024

చంద్రబాబుకు కృతజ్ఞతలు: చెవిరెడ్డి

image

విదేశాల్లో చదివిన వాడిని వీధి పోరాటాలకు సిద్ధం చేస్తున్నారని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘నా కుమారుడి వయస్సు 25 ఏళ్లు. ప్రజా జీవితంలోకి వచ్చిన నా బిడ్డను అక్రమ కేసులో అరెస్ట్‌ చేయించారు. నన్ను మించి నా కొడుకు ప్రజల పక్షాన ప్రజా పోరాటాలు ఎలా చేస్తారో ఈ ప్రభుత్వానికి, పోలీసు అధికారులకు రుచి చూపిస్తారు. చంద్రబాబుకు కృతజ్ఞతలు’ అని చెవిరెడ్డి అన్నారు.