Andhra Pradesh

News May 7, 2024

కమలాపురం: బిల్డింగ్‌పై పడి యువకుడి మృతి

image

కమలాపురం స్టేట్ బ్యాంక్‌ పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సూరజ్ కుమార్ మృతి చెందినట్లు ఎస్సై రిషికేశవరెడ్డి తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, మహారాజ్ గంజి జిల్లాకు చెందిన సూరజ్ కుమార్ ఎస్బీఐ బ్యాంక్ నందు కార్పెంటర్ పనులు చేస్తున్నాడు. ప్రతిరోజు రాత్రి తన సహచరులతో కలిసి బ్యాంకు పైన నిద్రపోతున్నారు. సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు కింద పడడంతో మృతి చెందాడని తెలిపారు.

News May 7, 2024

తిరుపతి: MTechలో ప్రవేశాలకు దరఖాస్తులు

image

ఏర్పేడు వద్ద ఉన్న తిరుపతి IITలో 2024-25 సంవత్సరానికి వివిధ విభాగాల్లో ఎంటెక్(MTech) ఇంటర్నేషనల్ అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హత, ఇతర వివరాలకు www.iittp.ac.in వెబ్ సైట్ చూడాలని సూచించారు. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 21.

News May 7, 2024

శ్రీకాకుళం: కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటన రద్దు

image

శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల మండలం అరిణాం అక్కివలస వద్ద ఎన్నికల ప్రచార సభ వాతావరణం పరిస్థితుల దృష్ట్యా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటన రద్దు అయ్యిందని ఎచ్చెర్ల నియోజకవర్గ కూటమి అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు, ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. కార్యకర్తలు, పార్టీ శ్రేణులు గమనించాలని కోరారు.

News May 7, 2024

విశాఖ: టీడీపీలో చేరిన YSR ముఖ్య అనుచరుడు

image

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరుడు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు, ఉమ్మడి విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ కార్యదర్శి కొయ్య ప్రసాద్ రెడ్డి టీడీపీలో చేరారు. సోమవారం అనకాపల్లిలో జరిగిన సభలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీతీర్థం పుచ్చుకున్నారు. ప్రసాద్ రెడ్డికి టీడీపీ కండువా కప్పి చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు.

News May 7, 2024

ఇద్దరు అధికారులపై పల్నాడు కలెక్టర్ చర్యలు

image

నాదెండ్ల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వరకుమార్‌ను విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ శివశంకర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే చిలకలూరిపేట రిటర్నింగ్ అధికారి నారదమునికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 5న పోస్టల్ బ్యాలెట్‌కు బదులుగా ఈవీఎం పేపర్లను అధికారులు జారీ చేశారు. దీంతో ఇరువురిపై చర్యలు తీసుకున్నారు. 5న ఓటింగ్‌లో పాల్గొన్న 1,219మంది ఉద్యోగులు 8, 9 తేదీల్లో ఓటు వేయాలని సూచించారు.

News May 7, 2024

SVU డిగ్రీ ఫలితాలు విడుదల

image

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ(SVU) పరిధిలో గత ఏడాది డిసెంబర్‌లో డిగ్రీ BA, BCOM, BSC, BCA, BVOC, BMUS, BDAN ఐదో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు మంగళవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షలు విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News May 7, 2024

భీమవరంలో ఆసక్తికర పోరు.. ఎందుకో తెలుసా..?

image

భీమవరంలో పోరు ఆసక్తికరంగా మారింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి అంకెం సీతారం బరిలో దిగారు. కాగా.. వైసీపీ నుంచి బరిలో ఉన్న గ్రంధి శ్రీనివాస్, జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినవారే. గంధ్రి తొలిసారి(2004) కాంగ్రెస్ నుంచి MLA అయ్యి, 2వసారి(2019) YCP నుంచి గెలిచారు. పులపర్తి రామాంజనేయులు మొదట(2009) కాంగ్రెస్‌ నుంచి, తర్వాత(2014) టీడీపీ నుంచి గెలిపారు. వీరిలో ఈసారి గెలిచేదెవరో.

News May 7, 2024

నెల్లూరులో రూ.2.61 కోట్లు సీజ్

image

ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు 30 కోడ్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. 16163 మందిని అధికారులు బైండోవర్ చేసుకున్నారు. జిల్లాలోని వివిధ చెక్ పోస్టులతో పాటు పలు ప్రాంతాల్లో కలిపి రూ.2.61 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. 18470 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

News May 7, 2024

కర్నూలు: అత్తను హత్య చేసిన అల్లుడు

image

భార్య కాపురం రాకపోవడానికి అత్తనే కారణామని అల్లుడు హత్య చేసిన ఘటన పాణ్యంలో జరిగింది. అయ్యపురెడ్డి కాలనీకి చెందిన లక్ష్మీ(48) ఆమె కుతూరు రాజ్యలక్ష్మిని 11ఏళ్ల క్రితం శ్రీనివాసులుతో వివాహమైంది. భర్త మద్యానికి బానిసవ్వడంతో రాజ్యలక్ష్మి కొద్దికాలంగా పుట్టింట్లో ఉంటుంది. భార్యను కాపురానికి పంపాలని 5న రాత్రి గొడవకు దిగి అత్త తలపై కర్రతో కొట్టాడు. నంద్యాల ఆసుపత్రి.. కర్నూలు తరలిస్తుండగా మృతిచెందారు.

News May 7, 2024

శ్రీకాకుళం: నలుగురు వైద్యాధికారులకు షోకాజ్ నోటీసులు

image

జిల్లా వైద్యారోగ్య శాఖలో నలుగురు ఉద్యోగుల తీరు వివాదాస్పదమైంది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారుల బృందం సోమవారం పలు ఆసుపత్రులలో తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో జనసేన నాయకుడు దానేటి శ్రీధర్‌కు చెందిన ఆస్పత్రులను కూడా తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఆయనతో ఫొటో దిగడంతో నలుగురు వైద్యాధికారులపై చర్యలు తీసుకుంటూ షోకాజ్ నోటీసులు ఇచ్చామని డీఎంహెచ్‌ఓ తెలిపారు.