India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి విజయనగరం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు పట్టణ, పల్లె ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. వసతిగృహాల నుంచి బాధితులు అధికంగా ఆసుపత్రుల బాటపడుతున్నారు. పాచిపెంట, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, సీతంపేట, పార్వతీపురం, మక్కువ, తదితర ప్రాంతాలలో జ్వర వ్యాప్తి ఎక్కువగా ఉంది. పార్వతీపురం జిల్లాలో 20 మంది చిన్నారులు మలేరియా, వైరల్ టైఫాయిడ్తో ఆసుపత్రిలో చేరారు.

గూడూరులో ఇంటర్ యువతిపై లైంగిక దాడి జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. ఇంటర్ చదివే ఓ అమ్మాయి కాలేజీకి వెళ్లింది. తిరిగి ఇంటికి వస్తుండగా గూడూరు అశోక్ నగర్కు చెందిన వినయ్ కుమార్ యువతిని బలవంతంగా ఆటోలో ఎక్కించుకున్నాడు. గాంధీనగర్లోని ఓ ఇంట్లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. మనస్తాపంతో యువతి ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీంతో అసలు విషయం తెలిసింది. DSP సూర్యనారాయణ రెడ్డి విచారణ చేస్తున్నారు.

తనకు స్కాలర్షిప్ రాకుండా అడ్డుకున్నారని ఓ యువతి కేంద్ర మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసింది. పుంగనూరు పట్టణానికి చెందిన ఉష SVUలో MSC చదువుతున్నారు. ఏటా కేంద్ర ప్రభుత్వం అందించే లక్ష రూపాయల ఉపకారవేతనానికి అర్హత సాధించారు. ఆమెకు విద్యా దీవెన వస్తుండటంతో వర్సిటీ అధికారులు స్కాలర్షిప్ ఇవ్వలేదు. సదరు యువతి అమిత్షాకు ఫిర్యాదు చేయగా.. ఆయన ఆదేశాలతో పోలీసులు విచారణ చేస్తున్నారు.

నారయణాద్రి, విశాఖ, చెన్నై ఎక్స్ప్రెస్ రైళ్లను ఈనెల 19 నుంచి పిడుగురాళ్ల, నడికుడి స్టేషన్లలో నిలిపేదిలేదని రైల్వే అధికారులు ప్రకటించారు. దీంతో వెంటనే ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు రైల్వే అధికారులతో మాట్లాడారు. ప్రజల అవసరాల దృష్ట్యా రైళ్లను పిడుగురాళ్ల, నడికుడి రైల్వేస్టేషన్లలో నిలుపుదల చేయాలని కోరారు. రైల్వే అధికారులు స్పందించి ఈనెల 21 నుంచి 3 రైళ్లను నిలుపుదల చేస్తామని చెప్పారు.

తుంగభద్ర ప్రాజెక్టు నుంచి హెచ్చెల్సీకి ఈనెల 21 నీరు విడుదల చేయాలంటూ హెచ్చెల్సీ ఎస్ఈ రాజశేఖర్ తుంగభద్ర మండలి ఎస్ఈకి బుధవారం ఇండెంట్ లేఖ పంపారు. 25వతేదీ వరకు 500 క్యూసెక్కులు, 26 నుంచి 31వరకు 750 క్యూసెక్కులకు పెంచాలని కోరారు. నీరు విడుదలచేస్తే 22కి జిల్లా సరిహద్దుకు చేరే అవకాశం ఉంది. ప్రధాన కాలువల ద్వారా కణేకల్లు చెరువుల్లోకి చేరి అక్కడ నుంచి ఏపీబీఆర్ జలాశయం, జీబీసీ కాలువకు ప్రవాహాలు కొనసాగుతాయి

2024 అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలిలో నోటాకు రాష్ట్రంలోనే అత్యధికంగా 3.79% ఓట్లు పడ్డాయి. మొత్తంగా 7,342 మంది నోటాకు ఓటేశారు. ఈవీఎంలలో 3,660 మంది, పోస్టల్ బ్యాలెట్లలో 3,682 మంది నోటాకు జై కొట్టారు. పోలైన 1,93,713 ఓట్లలో అచ్చెన్న 55.71% ఓట్లు సాధించి టెక్కలిలో గెలిచారు. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తన నివేదికలో వెల్లడించింది.

వినుకొండ ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్వైజర్గా పనిచేస్తున్న షేక్ రషీద్ (25) బుధవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. రషీద్ ముళ్లమూరు బస్టాండ్లోని మద్యం దుకాణంలో పని ముగించుకుని బయటకు రాగానే, బయట కాపు కాసిన ఏసీ మెకానిక్ జిలాని కత్తితో రషీద్పై దాడి చేశాడు. ఈ సంఘటనపై పల్నాడు ఏఎస్సీ లక్ష్మీపతి మాట్లాడుతూ.. ఇద్దరి మధ్య వ్యక్తిగత కక్షలతోనే దాడి జరిగిందని గతంలో జిలానిపై రషీద్ దాడి చేసినట్లు చెప్పారు.

పెదగంట్యాడ మండలం గొంతినవానిపాలెం యువతిపై దాడికి పాల్పడ్డ సిద్దు ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. సిద్దు చేసిన దాడిలో యువతి తల్లి గాయపడి చికిత్స పొందుతోంది. గాజువాక పీఎస్లో క్రైమ్ నంబర్ 239/2024 పోక్సో కేసులో నిందితుడు సిద్దు జైలుకు వెళ్లి వచ్చాడు. పరారీలో ఉన్న నిందితుడి సమాచారం తెలియజేయాలని పోలీసులు కోరారు. న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ సీఐ 9440904309 నంబర్కి సమాచారం ఇవ్వాలన్నారు.

రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA)లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి కోరుతూ.. సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ ఈనెల 10న పురపాలక శాఖకు లేఖ రాశారు. దీనికి ఆమోదం తెలుపుతూ.. మూడేళ్ల కాలపరిమితితో 75 ఒప్పంద పోస్టులను, పొరుగుసేవల పద్ధతిలో 68 పోస్టులను నింపేందుకు పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి GO జారీ చేశారు.

పులివెందులకు చెందిన ఓ విద్యార్థిని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన ఘటన బుధవారం జరిగింది. విద్యార్థిని SKUలో MBA రెండో సంవత్సరం చదువుతోంది. వసతి గృహంలో ఉరివేసుకుంటున్న ఆమెను చూసి తోటి విద్యార్థినులు కేకలు వేయడంతో ప్లంబింగ్ పనులు చేస్తున్న సిబ్బంది కాపాడారు. అనంతరం ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
Sorry, no posts matched your criteria.