India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఈనెల 20న జరిగే సింహాచలం గిరి ప్రదక్షిణ తొలి పావంచ వద్ద మొదలుపెట్టి.. అడవివరం-ధారపాలెం-ఆరిలోవ-హనుమంతువాక-పోలీసు క్వార్టర్స్- కైలాసగిరి టోల్ గేట్- అప్పుఘర్ జంక్షన్- MVPడబుల్ రోడ్-వెంకోజీపాలెం- HB కాలనీ-కైలాసపురం-మాధవధార-మురళీనగర్-బుచ్చిరాజుపాలెం-లక్ష్మీ నగర్-ఇందిరా నగర్- ప్రహ్లాదపురం-గోశాల జంక్షన్-తొలి పావంచ మీదుగా సింహాచలం మెట్ల మార్గం చేరుకోవాలి. సుమారు 32 కిలోమీటర్ల ప్రదక్షిణ చేయాలి. >Share it

కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం ఉదయం 9.40 గంటలకు ఇచ్ఛాపురం చేరుకొని స్వేచ్ఛావతి అమ్మవారిని దర్శించుకుని, మున్సిపల్ కార్యాలయంలో 10.30 గంటలకు వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. అనంతరం పలు కార్యక్రమాలు పాల్గొంటారన్నారు.

తిరుపతిలోని రాయల్నగర్లో ప్రముఖ వ్యాపారి ఇంట్లోకి దుండగులు చొరబడ్డారు. ముసుగు వేసుకొని వచ్చి ఇంట్లో ఉన్న ముగ్గురు మహిళలను కత్తితో పొడిచి పరారయ్యారు. అందులో వృద్ధురాలు మృతి చెందగా.. తీవ్ర గాయాలపాలైన వారిద్దర్నీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వ్యాపార గొడవలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఐరాల మండలం చిగరపల్లికి చెందిన విద్య(20)ను ప్రేమ పేరుతో ఓ యువకుడు మోసం చేయడంతో ఉరివేసుకొని మృతి చెందింది. కాణిపాకం ఎస్ఐ రామ్మోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిగరపల్లి వద్ద యువతి మృతదేహంతో గ్రామస్థులు ధర్నాకు దిగారు. ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. యువతి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.

రాయదుర్గం మండలంలోని డీ.కొండాపురంలో జెస్సికా (16) గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చదువుకోవడం ఇష్టం లేకే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు విచారణ చేపట్టారు.

బారాషాహీద్ దర్గా నందు ఏర్పాటు చేసిన తాత్కాలిక కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేసిన డ్రోన్, PTZ, CCTV పుటేజీలను ఎస్పీ కృష్ణ కాంత్ పరిశీలించారు. బందోబస్త్ నిర్వహిస్తున్న పలువురు సిబ్బందికి సూచనలు చేశారు. రెండవ రోజు రొట్టెల పండుగకు భక్తులు పోటెత్తారు. 140 మంది తప్పిపోయిన చిన్నారులను తల్లిదండ్రులకు, పెద్దలను వారి కుటుంబ సభ్యుల వద్దకు నెల్లూరు పోలీసులు చేర్చారు.

రాజానగరంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఇన్ఛార్జి వీసీ(వైస్ ఛాన్సలర్)గా ప్రొ.వై.శ్రీనివాసరావు నియమితులయ్యారు. ప్రస్తుతం జియో సైన్సెస్ విభాగంలో ప్రొఫెసర్గా, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్ డీన్గా ఉన్న శ్రీనివాసరావు.. ఇన్ఛార్జి వీసీగా బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ JNTU ఇన్చార్జి వీసీగా అదే వర్సిటీలో సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వర్తిస్తున్న ఫ్రొ.KVSG మురళీకృష్ణ నియమితులయ్యారు.

రాజానగరంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఇన్ఛార్జి వీసీ(వైస్ ఛాన్సలర్)గా ప్రొ.వై.శ్రీనివాసరావు నియమితులయ్యారు. ప్రస్తుతం జియో సైన్సెస్ విభాగంలో ప్రొఫెసర్గా, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్ డీన్గా ఉన్న శ్రీనివాసరావు.. ఇన్ఛార్జి వీసీగా బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ JNTU ఇన్చార్జి వీసీగా అదే వర్సిటీలో సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వర్తిస్తున్న ఫ్రొ.KVSG మురళీకృష్ణ నియమితులయ్యారు.

కడప జిల్లా పూర్వపు పాఠశాల అర్జేడీ రాఘవరెడ్డిపై అధికారులు విచారణ చేపట్టారు. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని, గవర్నర్ను కలిసి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్జేడీ రాఘవరెడ్డిని విద్యాశాఖకు సరెండర్ చేసి విచారణ అధికారిగా హెడ్ ఆఫీస్ లో పనిచేస్తున్న ప్రసన్న కుమార్ను నియమించారు. ఆయనకు వ్యతిరేకంగా పలువురు ఉపాధ్యాయులు వచ్చినట్లు సమాచారం.

ఈనెల 20న జరిగే సింహాచలం గిరి ప్రదక్షిణ తొలి పావంచ వద్ద మొదలుపెట్టి.. అడవివరం-ధారపాలెం-ఆరిలోవ-హనుమంతువాక-పోలీసు క్వార్టర్స్- కైలాసగిరి టోల్ గేట్- అప్పుఘర్ జంక్షన్- MVPడబుల్ రోడ్-వెంకోజీపాలెం- HB కాలనీ-కైలాసపురం-మాధవధార-మురళీనగర్-బుచ్చిరాజుపాలెం-లక్ష్మీ నగర్-ఇందిరా నగర్- ప్రహ్లాదపురం-గోశాల జంక్షన్-తొలి పావంచ మీదుగా సింహాచలం మెట్ల మార్గం చేరుకోవాలి. సుమారు 32 కిలోమీటర్ల ప్రదక్షిణ చేయాలి. >Share it
Sorry, no posts matched your criteria.