Andhra Pradesh

News August 9, 2024

SMC Elections: అనంత.. 29, సత్యసాయిలో 10 చోట్ల వాయిదా

image

★ అనంతపురం జిల్లాలో 1741 పాఠశాలల్లో యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 971 పాఠశాలల్లో ఏకగ్రీవంగా ఎన్నికవగా 741 చోట్ల ఎన్నికలు జరిగాయి. కోరం లేక 29 పాఠశాలల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి.
★ సత్యసాయి జిల్లాలో 2065 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 2055 కమిటీలను ప్రశాంత వాతావరణంలో ఎన్నుకున్నారు. కోరం లేక 10 చోట్ల వాయిదా పడ్డాయి.

News August 9, 2024

ప.గో.: అత్యాచార ఘటనలో నిందితుడు అరెస్ట్

image

బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడు అరెస్ట్ అయ్యాడు. పోలీసుల వివరాలు.. పాలకొల్లుకు చెందిన ఓ బాలిక(15)కు నరసాపురం పట్టణానికి సతీశ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. ఈ క్రమంలో ఆమెను మూడుసార్లు నరసాపురంలోని లాడ్జికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో నిందితుణ్ని అరెస్ట్ చేసి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో కేసు నమోదుచేసినట్లు తాడేపల్లిగూడెం డీఎస్పీ మూర్తి తెలిపారు.

News August 9, 2024

వైయస్సార్ జిల్లాలోని 34 మంది ఎస్బీ సిబ్బంది బదిలీ

image

వైయస్సార్ జిల్లా వ్యాప్తంగా 34 మంది స్పెషల్ బ్రాంచ్ సిబ్బందిని బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ముగ్గురు ఏఎస్ఐలు, 16 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 15 మంది పోలీస్ కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు వీరు బదిలీ అయిన కొత్త ప్రాంతాల్లో వెంటనే జాయిన్ కావాలని ఆదేశించారు.

News August 9, 2024

రామభద్రపురంలో విషాదం.. తండ్రీకొడుకు సూసైడ్

image

రామభద్రపురం మండలం ముచ్చర్లవలసలో రోజుల వ్యవధిలో తండ్రీకొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. గత నెల 24న నడగాన సురేశ్ (24) ఉరేసుకుని మృతిచెందాడు. అతని మరణం తట్టుకోలేని తండ్రి రవణ (55) బుధవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ జ్ఞానప్రసాద్ తెలిపారు. పొలంలో పురుగుమందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్ళగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు ఎస్ఐ వెల్లడించారు.

News August 9, 2024

చిత్తూరు: పెళ్లింట విషాదం.. పెళ్లైన గంటలోనే నవ వధువు మృతి

image

పెళ్లింట విషాదం చోటుచేసుకున్న ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. శాంతిపురం(M), సంతూరు గ్రామానికి చెందిన నవీన్‌కి కర్ణాటక రాష్ట్రం బైనహళ్లికి చెందిన నిఖితశ్రీతో వరుడి సోదరి గ్రామం చందరసనహళ్లిలో వివాహమైంది. ఆ తర్వాత నవదంపతులు ఓ గదిలోకి వెళ్లారు. గంట వ్యవధిలోనే వారి మధ్య ఏం జరిగిందో కానీ కొడవలి దాడిలో వధువు నిఖితశ్రీ మృతి చెందగా.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వరుడు నవీన్(30) చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News August 9, 2024

విశాఖ చేరుకున్న భారత నౌకాదళ అధిపతి

image

భారత నౌకాదళ అధిపతి విశాఖ తూర్పు నౌకాదళానికి చేరుకున్నట్లు నేవీ అధికారులు తెలిపారు. తూర్పు నౌకాదళం పరిధిలో కొనసాగుతున్న వివిధ నేవల్ ప్రాజెక్టులను పరిశీలించేందుకు రెండు రోజుల పర్యటన నిమిత్తం ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్న ఆయనకు తూర్పు నౌకాదళం అధిపతి వైస్ అడ్మిరల్ రాజేశ్ పెందార్కర్ స్వాగతం పలికారు. పరేడ్ మైదానంలో నౌకాదళ సిబ్బంది నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు.

News August 9, 2024

విశాఖ: ‘కాలేజీలకు రేపు సెలవు లేదు’

image

విశాఖ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో శనివారం తరగతులు నిర్వహించుకోవచ్చని ఆర్ఐవో పి.మురళీధర్ వెల్లడించారు. గత నెలలో వర్షాలు కారణంగా కాలేజీలకు సెలవు ఇచ్చినందున, ఈ రెండో శనివారం తరగతులు నిర్వహించాలన్నారు. అకడమిక్ క్యాలెండర్ అమలు చేస్తూ, విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

News August 9, 2024

రాయదుర్గం మీదుగా నడిచే మూడు రైళ్లు రద్దు

image

రాయదుర్గంలోని రైల్వేస్టేషన్‌లో సిగ్నలింగ్ వ్యవస్థను మార్చేందుకు నేడు రాయదుర్గం మీదుగా ప్రయాణించే 3 రైళ్లను రద్దు చేసినట్లు నైరుతి రైల్వే హుబ్లీ డివిజన్ ముఖ్య సమాచార అధికారి డాక్టర్ మంజునాథ్ తెలిపారు. చిక్కజాజూరు-గుంతకల్లు, హొస్పేట -బెంగళూరు మధ్య ప్రయాణించే 3 రైళ్లు రాయదుర్గం మీదుగా కాకుండా హొస్పేట, అమరావతి కాలనీ, దావణగెరె, చిక్కజాజురు మార్గంలో వెళ్తాయన్నారు.

News August 9, 2024

సోంపేట: పలాసపురంలో డెంగీతో మహిళ మృతి

image

సోంపేట మండలం, పలాసపురం గ్రామానికి చెందిన సంక శోభ (38) డెంగీతో గురువారం మృతి చెందింది. కొద్ది రోజుల నుంచి జ్వరంతో బాధపడుతూన్న ఆమెను గురువారం ఆస్పత్రికి తరలించగా మృతి చెందింది. గతంలో ఇదే గ్రామానికి చెందిన ముగ్గురు డెంగీతో మృతి చేందారు. మృతురాలికి భర్తతోపాటు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆసుపత్రిలోనూ ప్రాథమిక పరీక్షల కిట్లు లేక వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది అని గ్రామస్థులు వాపోతున్నారు.

News August 9, 2024

నంద్యాల జిల్లా హెడ్ కానిస్టేబుల్‌‌కు ఏడాది జైలు శిక్ష

image

నంద్యాల జిల్లా ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌ శోభన్ బాబుకు ఏడాది జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా పడింది. ఈ మేరకు మొదటి అదనపు జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జ్యోత్స్నాదేవి తీర్పు చెప్పారు. 2019లో కర్నూలులోని ఓ మహిళపై కానిస్టేబుల్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు కాగా విచారణలో నేరం రుజువు కావడంతో జైలు శిక్ష, జరిమానా విధించారు.