India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మసీదు రోడ్డుకు చెందిన నోయల్ జార్జ్ను హత్య చేసిన కేసులో నిందితులు ప్రసాద్, ప్రశాంతి, ప్రేమ్ కుమార్ను శుక్రవారం అరెస్టు చేసినట్లు రాజోలు CI గోవిందరాజు, మలికిపురం SI సురేష్ తెలిపారు. గుడిమెల్లంకకు చెందిన ప్రశాంతి నోయల్ జార్జ్తో సహజీవనం చేసేది. జార్జ్ మందు, సిగరెట్, గంజాయికి బానిసై, ప్రశాంతిని కూడా తాగమని వేధించడంతో పథకం ప్రకారం అతడిని హత్య చేసినట్లు వివరించారు.

ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 1990 నుంచి 2015 వరకు చదివి ఒక సబ్జెక్టు, రెండు సబ్జెక్టులు, అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు ఫెయిల్ అయిన విద్యార్థులకు యూనివర్సిటీ మరొక్కసారి ఎగ్జామ్ రాసి పాస్ అవ్వడానికి అవకాశం కల్పించింది. ఈ మేరకు పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 1990 నుంచి 2015 వరకు చదివి ఒక సబ్జెక్టు, రెండు సబ్జెక్టులు, అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు ఫెయిల్ అయిన విద్యార్థులకు యూనివర్సిటీ మరొక్కసారి ఎగ్జామ్ రాసి పాస్ అవ్వడానికి అవకాశం కల్పించింది. ఈ మేరకు పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

ప్రకాశం జిల్లాలో ఆరుగురు ఎస్సైలు బదిలీ అయ్యారు. ఆరుగురు ఎస్సైలను వీఆర్కు బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
➤ పుల్లలచెరువు – ఫాతిమా
➤ పొదిలి – కోటయ్య
➤ మార్కాపురం రూరల్ – వెంకటేశ్వర నాయక్
➤ దర్శి – సుమన్
➤ జరుగుమల్లి – వెంకట్రావు
➤ పొన్నలూరు – రాజేష్

ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 1990 నుంచి 2015 వరకు చదివి ఒక సబ్జెక్టు, రెండు సబ్జెక్టులు, అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు ఫెయిల్ అయిన విద్యార్థులకు యూనివర్సిటీ మరొక్కసారి ఎగ్జామ్ రాసి పాస్ అవ్వడానికి అవకాశం కల్పించింది. ఈ మేరకు పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి యూనివర్సిటీ లా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. 5ఏళ్ల 4, 6వ సెమిస్టరు ఫలితాలు వెలువడినట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్ తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు నిరాశ చెందకుండా రీ వాల్యుయేషన్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఐదేళ్ల కోర్సు విద్యార్థుల 1వ సెమిస్టర్ ఫలితాలు రావాలని, అవి కూడా విడుదల చేస్తారని పేర్కొన్నారు.

పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖలకు సంబంధించి శుక్రవారం జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. విజన్ 2047పై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టిందని, అందుకు సంబంధించి జిల్లాలో వివిధ శాఖల 100 డాక్యుమెంట్ కు నివేదికలు సిద్ధం చేయాలన్నారు. అట్టడుగు స్థాయి వ్యక్తి జీవితాన్ని మార్చే విధంగా విజన్ తయారు చేయాలన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. సచివాలయానికి వచ్చిన చంద్రశేఖర్తో లోకేశ్ ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలు, ప్రోత్సాహకాలను ఆయనకు వివరించారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందుకు సహకరించే అన్నిరకాల పరిశ్రమలకు తాము మెరుగైన ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు.

విజయవాడ సింగ్ నగర్లోని రూప లక్ష్మీ సాయి బార్ అండ్ రెస్టారెంట్లో మద్యం సేవించి అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు నాగేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలకు ఎన్డీఏ దూరంగా ఉండగా, నామినేషన్ వేసిన స్వతంత్ర అభ్యర్థి దాన్ని ఉపసంహరించుకోవడంతో బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఆర్వో ధ్రువీకరణ పత్రం అందించారు. శాసనమండలిలో త్వరలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణను ప్రతిపక్ష నేతగా ఎంపిక చేసే అవకాశాలను వైసీసీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.