Andhra Pradesh

News October 3, 2024

అనంతపురంలో కిలో టమాటా రూ.74

image

టమాటా ధరలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా అనంతపురంలో కిలో రూ.70కి పైగా పలుకుతోంది. మూడో రకం సైతం రూ.50 పలుకుతుండటం విశేషం. నిన్న కక్కలపల్లి టమాటా మార్కెట్‌కు 675 టన్నులు రాగా గరిష్ఠంగా కిలో రూ.74, రెండో రకం రూ.65తో విక్రయాలు సాగాయి. 15 కిలోల బుట్ట నాణ్యతను బట్టి రూ.750 నుంచి రూ.1,110 వరకు పలుకుతోందని మార్కెట్ కార్యదర్శి రాంప్రసాద్ తెలిపారు. టమాటా కొనాలంటేనే సామాన్యులు భయపడే పరిస్థితి నెలకొంది.

News October 3, 2024

రోజా గారూ.. అప్పుడు ఏమైంది: వాసంశెట్టి

image

అక్కినేని కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ మంత్రి రోజా ట్వీట్ చేయగా.. దీనికి కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ కౌంటర్ ఇచ్చారు. ‘రోజా గారూ మీరు మంచి మనసుతో ఇలా స్పందించడం చాలా ఆనందం. కానీ ఆరోజు రాజకీయాలకు సంబంధంలేని లోకేశ్ తల్లి భువనేశ్వరిని నిండు సభలో YCP నేతలు అవమానించినప్పుడు పకపక నవ్వారు కదా అప్పుడు ఏమైంది మీ స్పందన?’ అని వాసంశెట్టి ట్వీట్ చేశారు.

News October 3, 2024

నంద్యాల హత్య కేసులో ముద్దాయి అరెస్టు

image

నంద్యాల గుడిపాటిగడ్డ వీధిలో గత నెల 30న దారుణ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సాయి మనోహర్‌ను హత్య చేసిన దుర్గా ప్రసాద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. తన భార్యతో అక్రమ సంబంధం ఉందని మనోహర్‌తో దుర్గా ప్రసాద్ గొడవ పెట్టుకొని కత్తితో దాడి చేశాడన్నారు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోగా మరణించాడన్నారు. పరారీలో ఉన్న దుర్గాప్రసాద్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు.

News October 3, 2024

రెండో రోజు కొనసాగిన విశాఖ ఉక్కు రక్షణ రిలే దీక్షలు

image

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని కేంద్ర కార్మిక సంఘాలు, వామపక్ష, ప్రజా సంఘాలు, రైతు సంఘాల రాష్ట్ర సమితి పిలుపు మేరకు కర్నూలు ధర్నా చౌక్‌లో రెండో రోజు ఏఐటీయూసీ, సీఐటీయూ, ఏఐయూటీసీ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కొనసాగింది. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అజయ్ బాబు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్ రాధాకృష్ణ మాట్లాడారు. 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

News October 3, 2024

ఓటర్ల ప్రత్యేక జాబితాను సిద్ధం చేస్తున్నాం: కలెక్టర్‌

image

కడప ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితా – 2025ను ఎలాంటి పెండింగ్‌ లేకుండా సిద్ధం చేస్తున్నామని కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్‌ యాదవ్‌కు తెలిపారు.
హౌస్‌టు హౌస్‌ ఓటర్ల సర్వే ప్రక్రియ జిల్లాలో 99.45 పూర్తయిందని చెప్పారు. ఫారం-6 ఫారం-7, ఫారం-8 సంబంధించి 01 జనవరి 2023 నుంచి 25 ఏప్రిల్‌ 2024 వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

News October 3, 2024

వదంతులు నమ్మొద్దు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: RDO

image

చిరుత పులి సంచారంపై ప్రజలు ఆందోళన చెందవద్దని రామచంద్రపురం ఆర్డీఓ సుధాసాగర్ పేర్కొన్నారు. మండపేట తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోనసీమ జిల్లా అటవీ శాఖ అధికారి ప్రసాదరావు, మండపేట టౌన్ SI హరికోటి శాస్త్రితో కలిసి మాట్లాడారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వదంతులు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. సమాచారం తెలిస్తే 18004255909కి ఫోన్ చేయమని తెలిపారు.

News October 3, 2024

ప్రతి గ్రామాన్ని స్వచ్ఛత గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రతి గ్రామాన్ని స్వచ్ఛత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు కృషి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. బుధవారం పుట్టపర్తి రూరల్ మండల పరిధిలోని కప్పల బండలో జరిగిన స్వచ్ఛత హి సేవ ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో గ్రామస్తుల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమన్నారు.

News October 3, 2024

పరిశుభ్రతే జాతిపితకు అసలైన నివాళులు; కలెక్టర్

image

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం ముగింపు కార్యక్రమాన్ని నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతే జాతిపితకు అసలైన నివాళులు అని అన్నారు. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో మున్సిపల్ కార్మికుల సేవలు చిరస్మరణీయం అని అన్నారు.

News October 3, 2024

నేడు బాలా త్రిపుర సుంద‌రీదేవిగా దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం

image

దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా తొలి రోజైన ఆశ్వ‌యుజ శుద్ధ పాడ్య‌మి గురువారం నాడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ బాలా త్రిపుర సుంద‌రీదేవిగా సాక్షాత్క‌రిస్తుంది. మ‌‌న‌స్సు, బుద్ధి, చిత్తం ఈ దేవి ఆధీనంలో ఉంటాయి. అభ‌య‌హ‌స్త ముద్ర‌తో ఉండే ఈ త‌ల్లి అనుగ్ర‌హం కోసం ఉపాస‌కులు బాలార్చ‌న చేస్తారని పండితులు తెలిపారు. ఈ రోజున 2 నుంచి ప‌దేళ్ల లోపు బాలిక‌ల‌ను అమ్మవారి స్వ‌రూపంగా భావిస్తారు.

News October 3, 2024

చేనేత వస్త్రాలను అందరూ ఆదరించాలి: మంత్రి సవిత

image

చేనేత వస్త్రాలను ఆదరించి, నేత కార్మికులకు అందరూ అండగా నిలవాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత సూచించారు. గుంటూరులోని సిద్ధార్థ గార్డెన్స్ లో బుధవారం ఏర్పాటు చేసిన చేనేత, వస్త్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. వివిధ ప్రాంతాలకు చెందిన నాణ్యమైన వస్త్రాలు ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయని చెప్పారు. దసరా పండగ సందర్భంగా ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ ను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.