Andhra Pradesh

News March 8, 2025

కైలాసగిరి రోప్‌వే నిర్వాహకులకు నోటీసులు

image

కైలాసగిరి రోప్‌వే వద్ద శుక్రవారం అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వీఎంఆర్డీఏ ఛైర్‌పర్సన్ ప్రణవ్ గోపాల్ శనివారం ఉదయం సంఘటనా స్థలిని పరిశీలించారు. ఘటనకు గల కారణాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రోప్‌వే నిర్వాహకులకు నోటీసులు అందజేశామని, సమగ్ర దర్యాప్తు అయ్యేవరకు రోప్‌వే సేవలను నిలిపివేయాలని ఆదేశించినట్లు ప్రణవ్ గోపాల్ తెలిపారు.

News March 8, 2025

ప.గో: తొలి ప్రయత్నంలోనే DSP అయ్యారు..!

image

డాక్టర్ చదివిన ఓ మహిళ అనూహ్యంగా పోలీసయ్యారు. అదీనూ తొలిప్రయత్నంలోనే కావడం విశేషం. ఆమే నరసాపురం డీఎస్పీ డాక్టర్ జి.శ్రీవేద. పోలీసు కావాలనే లక్ష్యంతో డాక్టర్‌గా పనిచేస్తూనే గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. తొలి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించారు. నరసాపురం డీఎస్పీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలరని ఆమె చెప్పారు. #HappyWomensDay

News March 8, 2025

నెల్లూరు: ఘోరం.. బాధల్లో ఉన్నా దోచేశాడు  

image

సమాజం సిగ్గుతో తలిదించుకునే ఘటన ఇది. రాపూరు(మ) తెగచెర్లకు చెందిన ఇద్దరు జీవనోపాధి కోసం మలేషియా వెళ్లి పోలీసులకు చిక్కి జైలులో మగ్గుతున్నారు. బాధితుల తల్లిదండ్రులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఓ దుండగుడు CMO నుంచి వచ్చానని కలెక్టర్‌తో అన్ని విషయాలు మాట్లాడానని వారిని నమ్మించాడు. మీ పిల్లలను ఇండియాకు రప్పించేందుకు ఖర్చు అవుతుందని వారి నుంచి రూ.50వేలు దోచేశాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

News March 8, 2025

విశాఖ: తమకంటూ ఓ రోజు ఉందని తెలియని శ్రమజీవులు వీళ్లు

image

నేడు మహిళా దినోత్సవం. ప్రపంచమంతా మగువుల విలువ లోకానికి చాటి చెబుతోంది. కానీ తమ కష్టాన్ని గుర్తించే రోజు ఒకటుందని తెలియని శ్రమజీవులు వీళ్లు. శనివారం వేకువజామునే విశాఖలోని సిరిపురం, రైల్వే న్యూకాలనీ, రాంనగర్ ప్రాంతాల్లో ఇలా రోజువారీ పనుల్లో తలమునకలై కనిపించారు. పని మీద ధ్యాస, కుటుంబానికి భరోసా అందించాలనే ఆశ తప్ప విశ్రమించని శ్రామికులు. ఈరోజున శుభాకాంక్షలకు అత్యంత అర్హత కలిగిన మహిళామణులు వీళ్లు.

News March 8, 2025

పలమనేరు: పేదరికం నుంచి SI వరకు

image

పేదరికంలో పుట్టినా ఏ రోజు వెనుకడుగు వేయలేదు. తల్లిదండ్రుల కష్టాలను చూసి ఉన్నత స్థాయికి ఎదగాలని గట్టిగా నిర్ణయించుకుంది. లక్ష్యం కోసం అహర్నిషలు కష్టపడుతూ అనుకున్నది సాధించారు పలమనేరు SI కె.స్వర్ణలత. సత్యసాయి(D) ధర్మవరానికి చెందిన ఆమె 1993న జన్మించారు. చిన్నతనంలో కష్టాలను చూసి గొప్ప స్థాయిలో నిలవాలని నిర్ణయించుకున్నారు. బీఈడీ పూర్తి చేసిన ఆమె 2017లో SI ఉద్యోగానికి ఎంపికై శభాష్ అనిపించుకున్నారు.

News March 8, 2025

విశాఖ: అప్పు ఇచ్చిన వారి ఇంటిలోనే ఆత్మహత్య

image

అప్పు ఇచ్చిన వారి ఇంటిలోనే చచ్చిపోతున్నా.. అంటూ ఓ మహిళ వాయిస్ మెసేజ్ కలకలం సృష్టించింది. కొబ్బరి తోటకు చెందిన ధనలక్ష్మి వద్ద సుగుణ అప్పు తీసుకుంది. వీరిద్దరి మధ్య వివాదం జరగ్గా ధనలక్ష్మి, ఆమె కుమారుడు సుగుణతో గొడవ పడ్డారు. మనస్తాపం చెందిన సుగుణ.. గురువారం ధనలక్ష్మి ఇంటికి వెళ్లి రూమ్‌లో తలుపు వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో సుగుణ బంధువులు టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు.

News March 8, 2025

ఢిల్లీలో ప.గో జిల్లా సర్పంచ్

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో వర్క్ షాప్‌ జరిగింది. ఈ కార్యక్రమానికి రావాలని ఉండి మండలం మహాదేవపట్నం సర్పంచ్ వెంకట సుబ్బలక్ష్మికి ఆహ్వానం రావడంతో ఢిల్లీ వెళ్లారు. తమ గ్రామంలో చేసిన అభివృద్ధి, చేయబోయే కార్యక్రమాల గురించి వర్క్ షాప్‌లో వివరించారు. ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి ప.గో జిల్లా మహిళకు అవకాశం రావడంపై అందరూ అభినందిస్తున్నారు.
#HappyWomensDay

News March 8, 2025

ప్రైవేట్‌ రాకెట్‌ ప్రయోగంలో తెనాలి మహిళ ప్రముఖ పాత్ర

image

ఇస్రో తొలి ప్రైవేట్‌ రాకెట్‌ ప్రయోగంలో తెనాలికి చెందిన మహిళ ప్రముఖ పాత్ర పోషించారు. గంగానమ్మపేటకు చెందిన కొత్తమాసు సాయిదివ్య, రఘురామ్‌ దంపతులు ‘ఎన్‌ స్పేస్‌ టెక్నాలజీ’ సంస్థను నిర్వహిస్తున్నారు. కేఎల్‌యూలో రాడర్‌ కమ్యూనికేషన్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్న సాయిదివ్య 2022 నవంబరులో ఇస్రో పంపిన విక్రమ్‌-ఎస్‌ ప్రైవేట్‌ రాకెట్‌లో ఉంచిన మూడు పేలోడ్‌లలో ఒక పేలోడ్‌ను ఈమె తయారు చేశారు. ఈ ప్రయోగం విజయవంతం అయింది.

News March 8, 2025

GNT: నేటి యువతకు ఈ అధికారి ఆదర్శం

image

GNT జిల్లా ట్రైనీ IPS అధికారి దీక్ష నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈమె వెస్ట్ ఢిల్లీకి చెందిన మహిళ. 2016లో UPSC రాసి ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్లో ఉద్యోగం సాధించి పీఎంఓలో పనిచేశారు. 2018లో UPSC CSCలో ఢిల్లీ పోలీసులో డిఎస్పీగా సెలెక్ట్ అయ్యారు. అక్కడితో ఆగకుండా 2020లో ఐపీఎస్ లో సెలెక్ట్ అయ్యి గుంటూరు జిల్లా పోస్టింగ్‌కు వచ్చారు. ఇటీవల మహిళా ఫిర్యాదుల విండో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

News March 8, 2025

బీదను మరోసారి అదృష్టం వరించేనా

image

టీడీపీలో కీలకనేతగా కొనసాగుతున్న బీద రవిచంద్ర ఎమ్మెల్సీ పదవి కోసం తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పార్టీలో ఆయన కీలక పాత్ర పోషించారు. అప్పట్లోనే ఆయనకు ఎమ్మెల్సీపై అధినేత నుంచి హామీ ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో బీద అనుచరుల్లో ఉత్కంఠ నెలకొంది. రవిచంద్ర గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ ఎమ్మెల్సీగా వ్యవహరించారు.