Andhra Pradesh

News May 4, 2024

శ్రీకాకుళం: డా.బిఆర్ఏయూ పరీక్ష తేదీల్లో మార్పు

image

ఎచ్చెర్ల డా.బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న డిగ్రీ సప్లిమెంటరీ 2, 4 సెమిస్టర్ల సప్లిమెంటరీ పరీక్షల తేదీలను మార్పు చేసినట్లు డా.బిఆర్ఏయూ పరీక్షల విభాగం డీన్ డా.ఎన్.ఉదయభాస్కర్ శనివారం తెలిపారు. డిగ్రీ రెండో సెమిస్టర్ 17, 18వ తేదీల్లో జరుగుతాయని, డిగ్రీ నాలుగో సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 10, 11 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

News May 4, 2024

విశాఖలో రామోజీరావుపై ధ్వజమెత్తిన మంత్రి బొత్స

image

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఇష్టం వచ్చినట్లు కథనాలు రాసిన ఈనాడు రామోజీరావుపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. ‘మా భూమి మాది కాకపోతే మరెవరిది’ అంటూ రామోజీరావును ప్రశ్నించారు. అన్నం తినే వాళ్ళు ఎవరూ ఇలాంటివి రాయరని అన్నారు. ఎన్నికల్లో టీడీపీ లబ్ధి పొందడం కోసమే ఇలాంటి తప్పుడు రాతలు రాస్తున్నారని విమర్శించారు. ఈ చట్టం రాష్ట్రంలో అమల్లో లేదన్నారు.

News May 4, 2024

MTM : బాలశౌరి, కొల్లు రవీంద్రపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

image

మచిలీపట్నం కూటమి MP, MLA అభ్యర్థులు వల్లభనేని బాలశౌరి, కొల్లు రవీంద్రపై వైసీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా వారిద్దరూ ఈ నెల 2న మచిలీపట్నం పోలీస్ స్టేషన్, జిల్లా ఎస్పీ ఆఫీస్ వద్ద వందలాది మంది కార్యకర్తలతో ధర్నా చేసిన దానిపై ఎన్నికల సంఘం రాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శిని కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి ఇరువురిపై చర్యలు తీసుకోవాలన్నారు.

News May 4, 2024

తూ.గో: మరో 8 రోజులే.. ఇక వారి ఓట్లే టార్గెట్!

image

పోలింగ్ తేదీ ముంచుకొస్తుండటంతో ఉమ్మడి తూ.గో జిల్లా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరి వ్యూహాల్లో వారున్నారు. ప్రతి ఓటు కీలకమేనంటూ వలస ఓటర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అమలాపురం పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి ఉపాధి నిమిత్తం వలస వెళ్లిన వారి వివరాలు సేకరిస్తూ వారితో టచ్‌లోకి వెళ్తున్నారట. పోలింగ్ రోజు ఓటేసేలా రైల్వే, ఆర్టీసీ, ప్రైవేటు బస్సులకు ప్యాకేజీలు మాట్లాడుకుంటున్నారు.

News May 4, 2024

బొల్లినేని రామారావుతో టీడీపీ సీనియర్ల చర్చలు

image

ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుతో తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ చర్చలు జరిపారు. నెల్లూరు వేదాయపాళెంలోని సోమిరెడ్డి నివాసంలో శనివారం ఈ సమావేశం జరిగింది. ప్రధానంగా ఉదయగిరి నియోజకవర్గ రాజకీయాలపై చర్చించినట్టు తెలిసింది.

News May 4, 2024

ప్రకాశం: సరిగ్గా నెలరోజులు.. మీ MLA ఎవరు?

image

సరిగ్గా మరో నెల రోజుల్లో మీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరో తేలిపోనుంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ స్టార్ట్ అవ్వగా.. మే13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కించి ఎమ్మెల్యే ఎవరో ప్రకటిస్తారు. అయితే గత ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 స్థానాలకు గాను 8 వైసీపీ, 4 టీడీపీ స్థానాల్లో గెలిచాయి. మరి ఈసారి మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో కామెంట్ చెయ్యండి.

News May 4, 2024

VZM: జిల్లాలో 18,631 పోస్టల్ బ్యాలెట్లు

image

జిల్లాలో 18,631 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పేర్కొన్నారు. బొబ్బిలి నియోజక వర్గంలో 2105 మంది , చీపురుపల్లి‌లో 1405 మంది, గజపతినగరం లో 1665 మంది, నెల్లిమర్ల లో 1525 మంది , విజయనగరంలో 3975 మంది, శృంగవరపుకోట (అసెంబ్లీ)లో 1776, రాజాంలో 1741 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.

News May 4, 2024

ఏపీలో భూహక్కు చట్టంతో భూ దోపిడీ : సీపీఐ  కె.రామకృష్ణ

image

ఏపీలో భూ హక్కు చట్టంతో రైతుల భూములు దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ చెప్పారు. రాష్ట్రంలో మద్యపానం నిషేధించాకే ఎన్నికల్లో ఓటు అడుగుతానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఒక్క హామీ అమలు చేయకుండా ఎన్నికలకు పోవడం సిగ్గుచేటన్నారు. వారం రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని జనం ఇంటికి పంపడం ఖాయమని ధ్వజమెత్తారు. తిరుపతిలో సీపీఐ తరుఫున ఆయన శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

News May 4, 2024

టెక్కలి: ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య

image

టెక్కలి నియోజకవర్గం బోరుభద్ర గ్రామానికి చెందిన పొందూరు శివ కృష్ణ(32) అనే ఆర్మీ ఉద్యోగి శనివారం విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గరలో గల ఒక లాడ్జిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్మీ సెలవులకి వచ్చి సెలవుల అనంతరం తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అసలు శివ కృష్ణ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

News May 4, 2024

శ్రీకాకుళం:ఎన్నికల ప్రక్రియ పరిశీలించిన సహాయ కలెక్టర్

image

సాధారణ ఎన్నికలు-2024లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలకు సంబంధించి స్థానిక ప్రభుత్వ కళాశాలలో నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను శనివారం సాయంత్రం సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పరిశీలించారు. అనంతరం అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని ఆయన సూచించారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.