India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గోగినేని భారతీదేవి గుంటూరు బాపట్ల తాలూకా మాచవరంలో 1908 ఆగస్టు 15న జన్మించింది. తండ్రి వెలగా సుబ్బయ్య. ఈమె స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని కారాగారవాసం అనుభవించింది. 1931లో విదేశీ వస్త్ర బహిష్కరణోద్యమం సమయంలో తెనాలిలో 6నెలలు ఆందోళన చేసింది. సహాయ నిరాకరణోద్యమంలో పోరాడి రాయవెల్లూరు జైలులో ఏడాది ఉంది. జమీందారీ రైతుల ఆందోళనలో దెబ్బలు తింది. అనేక కులాంతర వివాహాలు నిర్వహించింది. 1958-64లో MLCగా పనిచేసింది.
కర్నూలు జిల్లా జైలులో ఉన్న నటుడు పోసానిని కస్టడీకి ఇవ్వాలంటూ <<15653795>>ఆదోని<<>> పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కర్నూలు మొదటి అదనపు జుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ అపర్ణ దీనిపై విచారణ చేపట్టారు. ఇరువైపులా వాదనలు విన్న అనంతరం విచారణను సోమవారానికి వాయిదా వేశారు. మరోవైపు పోసానికి బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు కోరారు.
ఊహతెలిసే సమయానికే తండ్రి మరణం. కోలుకునేలోపు తల్లి దూరం. అల్లారు ముద్దుగా పెరగాల్సిన సమయంలో కుటుంబ బాధ్యతలు. అయినా ఆమె ఏమాత్రం చెక్కు చెదరలేదు. కష్టపడి ముగ్గురు తోబుట్టువులను పోషించింది. వారి కోసం పెళ్లికి సైతం దూరం అయ్యారు. నిప్పులో కాలిస్తే ఇనుము పదునెక్కినట్లు కష్టాలను సైతం విజయానికి సోపానాలగా మార్చుకుని.. చిత్తూరు నగరాకి మొదటి మహిళగా ప్రశంసలు అందుకుంటున్న మేయర్ అముద విజయగాథ ఇది. #HappyWomensDay
నెల్లూరు వీఆర్సీ మైదానంలో చికెన్ & ఎగ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ చికెన్ మేళాను కలెక్టర్ ఓ. ఆనంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. చికెన్ను నిర్భయంగా తీసుకోవచ్చని పేర్కొన్నారు. అసత్య ప్రచారాలు నమ్మకండి అని ప్రజలకు సూచించారు. అలాగే జిల్లాలో ఎటువంటి బర్డ్ ఫ్లూ లేదన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చికెన్ టేస్ట్ చేశారు.
కైలాసగిరి రోప్ వే సమీపంలో అగ్నిప్రమాదానికి బాధ్యులైన రోప్ వే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని వీఎంఆర్డిఏ ఎంసీ విశ్వనాథన్ ఆదేశించారు. ప్రమాద స్థలాన్ని సందర్శించిన ఆయన సంఘటనా స్థలంలో రోప్వే వ్యర్థాలను వెంటనే తొలగించాలన్నారు. కైలాసగిరి దుకాణదారులందరూ అగ్ని ప్రమాదాల నియంత్రణ సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. తరచుగా ఫైర్ ఆడిట్ జరిపించాలని ఆదేశించారు.
అన్నమయ్య జిల్లాలో శనివారం తెల్లవారుజామనున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కె.వి పల్లి మండలం, మహల్ క్రాస్ టర్నింగ్ వద్ద ఏపీఎస్ఆర్టీసీ బస్సు రాయచోటి నుంచి చెన్నైకి వెళ్తున్న సమయంలో పాల వ్యాన్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని డ్రైవర్ ఢిల్లీబాబు(33), టి.వెంకటేశ్ (23) మృతి చెందారు. మృతదేహాలను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ చిన్నరెడ్డప్ప తెలిపారు.
మైనర్ బాలిక కిడ్నాప్ కేసులో గోకవరం(M) రాంపయర్రంపాలెం గ్రామానికి చెందిన రాయుడు శివ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. రాజమండ్రి కోర్టులో శుక్రవారం హాజరుపరచగా 15 రోజులు రిమాండ్ విధించినట్లు చెప్పారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి, ప్రేమ పెళ్లి పేరుతో మైనర్ బాలికను అపహరించినట్లు తేలడంతో పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు.
రెవెన్యూ వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న కారణంతో నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని 22మంది వార్డు సచివాలయ అడ్మిన్ కార్యదర్శులు, ఇన్ఛార్జ్ అడ్మిన్ కార్యదర్శులకు కమిషనర్ సూర్యతేజ శుక్రవారం షోకాజ్ నోటీసులను జారీచేశారు. ప్రభుత్వం 100 శాతం పన్నులు వసూలు చేయాలని చెప్పినా జీరో వసూళ్లను చేయడంతో వారికి నోటీసులు జారీ చేశామన్నారు. మార్చి చివరికి 100% లక్ష్యాలను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
విశాఖకు చెందిన దిగుమర్తి సరస్వతి దేవి ప్రముఖ గాంధేయవాది. విశాఖ జిల్లా కోర్టులో ఏడు దశాబ్దాల పాటు క్రిమినల్ లాయర్గా పనిచేసి విశేషమైన పేరు గడించారు. జాతీయోద్యమ సమయంలో ఆమె గాంధీని రెండుసార్లు కలుసుకున్నారు. ఒక బహిరంగ సభలో ఆమె తన రెండు గాజులు తీసి గాంధీకి ఇచ్చారు. ప్రతిఫలంగా ఏదైనా ఇవ్వాలని కోరినప్పుడు గాంధీ తాను వడికిన నూలు, కుదురు ఇచ్చారు. 2018లో 92 ఏళ్ల వయసులో మరణించారు.
ప.గో జిల్లా పరిధిలోని బీసీ, ఈబీసీ సామాజిక వర్గాలకు డీఎస్సీ పరీక్షలకు ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ నిమిత్తం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బీసీ సంక్షేమ సాధికారత అధికారి గణపతిరావు తెలిపారు. కలెక్టరేట్లో ఈ నెల 10 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. బీఈడీ, టీటీసీతోపాటు టెట్ పరీక్షలో అర్హత సాధించి ఉండాలని, ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Sorry, no posts matched your criteria.