Andhra Pradesh

News March 23, 2024

కోనసీమ: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

ఆలమూరు మండలం జొన్నాడలో అనంతపురం జిల్లాకు చెందిన ఊదపల్లి రమేష్ బాబు (45) శనివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శ్రీనునాయక్ తెలిపారు. ఆలమూరులో నివాసముంటున్న సోదరుడు రామకృష్ణ ఇంటికి గత నెల 19వ తేదీన రమేష్ బాబు డబ్బుల కోసం వచ్చాడన్నారు. చెడు వ్యసనాలకు, మద్యానికి బానిస కావడం, అప్పుల బాధ ఎక్కువ కావడంతో ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ తెలిపారు.

News March 23, 2024

పలాస: బొడ్డపాడు ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెండ్

image

బొడ్డపాడు గ్రామ పంచాయతీకి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ పోతనపల్లి సరోజవర్మ విధుల నుంచి తప్పించినట్లు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక సంచాలకులు జి.వి.చిట్టి రాజు తెలిపారు. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టిన పలాస రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో భరత్ నాయక్ ఉల్లంఘించినట్లు స్పష్టం చేశారు. దీంతో అతని విధుల నుంచి తప్పించినట్లు పేర్కొన్నారు.

News March 23, 2024

విజయనగరం: ఉపాధ్యాయుడు సస్పెండ్

image

ప్రభుత్వ నివాస గృహాన్ని రాజకీయ కార్యకలాపాలకు వినియోగించుకోవడం పై ఉపాధ్యాయుడు అడ్డాకుల సన్యాసి నాయుడును సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఇన్‌ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి జి.కేశవ నాయుడు శనివారం ధ్రువీకరించారు. కురుపాం ఎన్నికల అధికారి ఇచ్చిన నివేదిక మేరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని ఆయన పేర్కొన్నారు.

News March 23, 2024

ప్రసన్నకు కౌంటర్ గా రేపు కోటంరెడ్డి సమావేశం

image

తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులపై కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రెండు రోజులుగా విమర్శల వేడి పెంచారు. ఈ క్రమంలో ఆయనకు కౌంటర్ ఇచ్చేందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సన్నద్ధమయ్యారు. ఆదివారం ఉదయం 9 గంటలకు నెల్లూరులోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడనున్నారు.

News March 23, 2024

కాకినాడ: హైవేపై బోల్తా కొట్టిన వ్యాన్

image

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట వద్ద 16 నంబర్ జాతీయ రహదారిపై ఓ వ్యాన్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. హైవే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాగల్లు నుండి శ్రీకాకుళం జిల్లాకు జామకాయల లోడుతో వెళ్తున్న బొలోరో వ్యాన్ నీలాద్రిరావుపేట వద్దకు వచ్చేసరికి లారీ ఎదురుగా రావడంతో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో జామకాయలు రోడ్డుపై పడిపోయాయి. వ్యాన్‌లో ఉన్న ఇద్దరిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.

News March 23, 2024

విశాఖ: పుట్టెడు దుఃఖంతో పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థి

image

పదో తరగతి పరీక్ష రాస్తున్న దేశగిరి యమునకు పుట్టెడు దుఃఖం కలిగింది. జీకే వీధికి చెందిన యమున తల్లి సరస్వతి మృతిచెందిన సమాచారం తండ్రి కేశకర్ణ చేరవేశారు. రక్తపోటు అధికమై కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. పరీక్ష రాసి స్వగ్రామం దేవరపల్లిలో తల్లి అంత్యక్రియలకు విచ్చేసిన యమున బోరున విలపించింది. దీంతో గ్రామాల్లో విషాదఛాయలు అనుముకున్నాయి.

News March 23, 2024

కొండేపి ఎమ్మెల్యేకు మాతృవియోగం

image

కొండపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి తల్లి సుబ్బమ్మ (83)అనారోగ్యంతో శనివారం సాయంత్రం కన్నుమూశారు. డోలా సుబ్బమ్మ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆమె తుది శ్వాస విడిచారు. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం గ్రామంలో ఆదివారం సుబ్బమ్మ అంత్యక్రియలను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు తెలిపారు.

News March 23, 2024

ఏలూరు: రూ.2.59 ల‌క్ష‌లు సీజ్

image

సార్వత్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నిక‌ల కోడ్ అమ‌ల‌వుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో అధికారులు ముమ్మ‌రంగా త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. శనివారం నిర్వహించిన తనిఖీల్లో రూ.2.59 ల‌క్ష‌లు సీజ్ చేసిన‌ట్లు ఉంగుటూరు నియోజకవర్గ ఎన్నిక‌ల అధికారి, ఏలూరు ఆర్డీవో ఎన్.ఎస్ కె.ఖాజావలి వెల్ల‌డించారు.

News March 23, 2024

మదనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ పై కేసు

image

మదనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదు చేశారు. ఎస్ఐ లోకేష్ రెడ్డి కథనం.. మదనపల్లి నియోజకవర్గంలోని నిమ్మనపల్లిలో అనుమతి లేకుండా నిసార్ అహ్మద్ రాత్రి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దీంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (mmc) అధికారి, నిమ్మనపల్లి ఇన్చార్జ్ ఎంపీడీవో చలపతిరావు ఫిర్యాదుతో నిస్సార్ అహ్మద్ పై కేసు నమోదు చేశారు.

News March 23, 2024

పాడేరుపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

image

2019 ఎన్నికల్లో పాడేరు అసెంబ్లీకి సంబంధించి తక్కువగా (62 శాతం) పోలింగ్ నమోదు కావడంతో ఈ దఫా పోలింగ్ శాతం పెంపునకు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించామని కలెక్టర్ ఎం.విజయ సునీత తెలిపారు. అల్లూరి జిల్లాలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారని తెలిపారు. అన్ని ప్రధాన జంక్షన్లు, పోలింగ్ కేంద్రాల వద్ద ఈవీఎంల ద్వారా ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.