India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహిళా దినోత్సవం సందర్భంగా నేడు మార్కాపురంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ ప్రకాశం వాసులు మార్కాపురం జిల్లా ఏర్పాటుపై బహిరంగ సభలో సీఎం చేసే ప్రకటనపై వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో స్వయంగా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ప్రకటన చేశారు. అయితే సీఎం హోదాలో చంద్రబాబు తొలిసారిగా మార్కాపురానికి వస్తున్న వేళ జిల్లా అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.
వివాహం తర్వాత కుటుంబాన్ని చూసుకుంటూ ఉన్నత చదువులు చదివి ఆదర్శంగా ఉండే వారు కొందరే ఉంటారు. అందులో మంగళగిరికి చెందిన తాయి లక్ష్మీ పద్మజ ఒకరు. వివాహ సమయానికి ఇంటర్ పూర్తి చేసిన ఆమె.. వివాహం తర్వాత హిందీ పండిత్, B.A, M.B.A, PGD HRM, L.L.B, PGD క్రిమినల్ జస్టిస్, PGD సైబర్ లా చదివారు. గత 12ఏళ్లుగా హైకోర్టులో లాయర్గా విధులు నిర్వహిస్తూ పలు ప్రభుత్వ శాఖలకి అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరుగా పని చేశారు.
శాంతిపురం మండలం కదిరి ముత్తనపల్లి గ్రామంలో మార్చి 10 నుంచి సిద్ధేశ్వర స్వామి పెద్ద దేవర ప్రారంభం కానుంది. ఈ మేరకు దేవరకు హాజరుకావాలని YCP అధినేత జగన్ను నిర్వాహకులు ఆహ్వానించారు. పదేళ్లకొకసారి నిర్వహించే జాతర ఘనంగా నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఆహ్వానం పలికిన వారిలో ఎమ్మెల్సీ భరత్, మునిరత్నం, శ్రీరాములు, మంజునాథ్ తదితరులు ఉన్నారు.
నందమూరి తారక రామారావు కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి. ఆమె 1959 ఏప్రిల్ 22న జన్మించారు. ఆమె బాల్యం, విద్యాభ్యాసం చెన్నైలోనే గడిచింది. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్తో పాటు ఫ్రెంచ్ భాషల్లో ఆమెకు ప్రావీణ్యం ఉంది. 2004లో బాపట్ల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ గెలిచారు. 2006, 12లో కేంద్ర సహాయమంత్రిగా చేశారు. 2014లో బీజేపీలో చేరగా.. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులిగా ఉన్నారు.
గురిజాల రాధారాణి 29 జూన్ 1963లో తెనాలిలో జన్మించింది. ఆమె హైదరాబాద్లోని ఉస్మానియా వర్సిటీలో లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, అనంతరం ఎల్ఎల్ఎం, పీహెచ్డీ పూర్తి చేసింది. 1989లో న్యాయవాద వృత్తిలో ప్రవేశించి హైదరాబాద్లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేశారు. 2008లో జిల్లా జడ్జిగా ఎంపికైంది. 2021 అక్టోబరు 13న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులై పని చేస్తున్నారు.
పురుషులకంటే తానేమి తక్కువకాదంటూ నిరూపిస్తుంది ఉమ్మడి జిల్లాకి చెందిన ఫొటోగ్రాఫర్ హైమావతి. శ్రీనగర్ కాలనీకి చెందిన ఆమె 16 ఏళ్లుగా వృత్తిలో ఉన్నారు. భర్త చిరుద్యోగి కావడంతో ఆర్థిక పరిస్థితుల వల్ల ఆమె ఈ రంగాన్ని ఎంచుకున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో అర్ధరాత్రి కూడా వెనుకంజ వేయకుండా వేరే ప్రాంతాలకు వెళ్లి మరి సత్తాను చాటుకుంటున్నారు. 2012లో బాపట్లలో నిర్వహించిన పోటీల్లో హైమావతి 2వ బహుమతి సాధించారు.
తెనాలికి చెందిన బండ్ల శిరీష ఏపీ నుంచి అంతరిక్షంలోకి అడుగుపెట్టిన ఏకైక మహిళ. మురళీధర్, అనురాధ దంపతులకు 1987లో శిరీష జన్మించారు. 5 ఏళ్ల వయసులోనే అమెరికాకు వెళ్లి హ్యూస్టన్లో స్థిరపడ్డారు. 2021లో వర్జిన్ గెలాక్టిక్ సంస్థ చేపట్టిన అంతరిక్ష ప్రయాణంలో ఆమె పాల్గొన్నారు. దీంతో కల్పనా చావ్లా తర్వాత భారత్లో పుట్టి స్పేస్లో అడుగుపెట్టిన రెండో మహిళగానూ, ఏపీ నుంచి ఏకైక మహిళగా నిలిచారు.
మల్లాది సుబ్బమ్మ1924 ఆగస్టు 2న రేపల్లె తాలూకా పాతర్లంకలో జన్మించారు. ఉమ్మడి గుంటూరుకు చెందిన వెంకట రామమ్మూర్తిని వివాహం చేసుకున్నారు. మహిళల హక్కులు, వారి సంక్షేమం కోసం ఆమె అవిశ్రాంతంగా కృషిచేశారు. సంపూర్ణ మద్యపాన నిషేధంపై ఉద్యమం చేశారు. ఉద్యమకారులకు పెద్దదిక్కుగా ఉండేవారు. ప్రఖ్యాతి గాంచిన పాతివ్రత్యం నుంచి ఫెమినిజం దాకా అనే పుస్తకం సహా 88 రచనలు చేశారు. 2003లో ఆత్మగౌరవ పురస్కారాన్ని అందుకున్నారు.
అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జిల్లా స్థాయి డాటెడ్ ల్యాండ్స్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ వినోద్ నిర్వహించారు. నిషేధిత జాబితాలో ఉన్న డాటెడ్ ల్యాండ్స్ని తొలగించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వస్తున్న అర్జీలు, పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతివారం షెడ్యూల్ వేసుకుని జిల్లా స్థాయి డాటెడ్ ల్యాండ్స్ కమిటీ నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు.
వేసవి కాలం దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు గాను జిల్లా గ్రామీణ నీటి సరఫరా సంస్థ (RWS) కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు RWS SE శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంటే 08672-223522 నంబర్కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రజలు ఈ నంబర్కు ఫోన్ చేసి సమస్యను తెలియజేయవచ్చని అన్నారు.
Sorry, no posts matched your criteria.